నల్గొండలో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
ఈసారి విరసం తన సాహిత్య పాఠశాలను నల్గొండలో నిర్వహిస్తోంది. విప్లవ సాహిత్యోద్యమానికి తెలంగాణ నేలతో పేగుబంధం ఉన్నది. గత నలభై తొమ్మిదేళ్ళలో ఉమ్మడి నల్గొండ జిల్లాతో కూడా అలాంటి సంబంధమే ఉంది. అయినా రాష్ట్రస్థాయి సాహిత్య పాఠశాల ఇప్పుడే జరుగుతోంది. జిల్లాలో తొలి తరం విరసం నాయకుడిగా, ఉపాధ్యాయ ఉద్యమనేతగా, రచయితగా అమరుడు శేషుసారు అందరికీ సుపరిచితం. తెలుగు సాహిత్యానికి పోరాటతత్వాన్ని, మట్టి వాసనల పరిమళాన్ని, ప్రజా, జానపద ప్రత్యామ్నాయాన్ని అందివ్వడంలో నల్గొండ పాత్ర గణనీయమైనది. ప్రజాపోరాట చైతన్యంతో, వామపక్ష విప్లవ దృక్పథంతో, పీడిత అస్తిత్వ ఆకాంక్షలతో రచనలు చేసిన ఎందరో కవులు, సాహిత్యకారులు, కళాకారులు ఇందులో భాగం. అలాంటి అమర సృజనకారుల స్పూర్తితో విరసం తన సాహిత్య పాఠశాలను నల్గొండలో తలపెట్టింది.
నల్గొండ అనగానే ఇతర తెలుగు ప్రాంతాల వాళ్లకు మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గుర్తుకు వస్తుంది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆంధ్ర మహాసభ ఆరంభించింది. తెలుగు భాష, సాహిత్యం, ప్రజా, జానపద కళలకు గొప్ప శక్తిని అందించింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటానికి తెరతీసింది. మట్టి మనుషుల్లోని జీవధాతువులాంటి సృజనాత్మకత ధిక్కార స్వరంగా వ్యక్తమైంది. ఈ మొత్తంలో ఆనాటి నల్గొండ జిల్లాకు కీలక స్థానం ఉంది.
బండి యాదగిరి, సుద్దాల హనుమంతు వంటి ఎందరో ప్రజా కళాకారులను నల్గొండ పోరాటం రూపొందించింది. పెద్దగా గుర్తింపునకు రాని అనేక మంది గాయకులు, వాగ్గేయకారులు, కళా ప్రదర్శకులు తెలంగాణ రైతాంగ కాలంలో నల్గొండ నుంచి వచ్చారు. భువనగిరి ప్రాంతంలో సాయుధ దళాల్లో పనిచేసిన కళాకారుడు గుండా కేశవులు కవి, గాయకుడు. సాధినేని ధర్మయ్య సాయుధ పోరాట వీరుడు, గొప్ప కళాకారుడు. తెలంగాణలో భాషా సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేసిన నవలా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి నల్గొండ జిల్లాకు చెందినవారే. జిల్లాలో తొలి పత్రిక నీలగిరిని స్థాపించిన షబ్నవీశ్ మంచి రచయిత కూడా. చరిత్రకారుడిగా బిఎన్ శాస్త్రి అందరికీ సుపరిచితుడే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మౌఖిక, లిఖిత ప్రక్రియలు రెంటిలోనూ జిల్లా నుంచి ఉత్తమ రచయితలు ఎందరో వచ్చారు. పోరాటంలో, సాహిత్య కళారంగంలో, మేధో రంగంలో నల్గొండ జిల్లా సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాతి కాలంలో తెలుగులో వచ్చిన అస్తిత్వ సాహిత్యం మీద కూడా నల్గొండ ముద్ర ఉన్నది.
అట్టడుగు కులాల నుంచి, మైనారిటీ సమూహాల నుంచి అనేక మంది ప్రతిభావంతమైన కవులు, రచయితలు, కళాకారులు జిల్లా నుంచి తెలుగు సాహిత్యాన్ని ప్రజాస్వామికీకరించడానికి దోహదపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా నల్గొండ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో గణనీయంగా కృషి చేసింది. ఆధునిక యుగానికి పూర్వం ఆస్థానేతర, ప్రజా సాహిత్య సంప్రదాయం తెలంగాణకు ఉజ్వలంగా ఉన్నది. పాల్కురి సోమనాథుడి దగ్గర నుంచి మార్గ పద్ధతికి, బ్రాహ్మణ పండిత సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో దేశీ సంప్రదాయం కొనసాగింది. ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలానికల్లా వెట్టిచాకిరీ చేసే భూమిలేని కూలీల, పీడిత కులాల కళా సంప్రదాయంగా ముందుకు వచ్చింది.
అనన్య త్యాగాలతో, అలుపెరుగని పోరాటాలతో సాగుతున్న ఈ ప్రజా ఉద్యమాల్లోంచే ప్రజలు తమదైన ప్రత్యామ్నాయ కళా సంస్కృతులను సృజించుకుని, నిర్మించుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ప్రజా ఉద్యమాల్లోంచే ప్రజా కళలు, సంస్కృతి మొగ్గతొడిగి వికసించాయి. సాహిత్య, కళా సాంస్కృతిక రంగం ప్రజా ఉద్యమాలకు జీవం, జీవంగా వెలుగుదారి చూపింది. అభ్యుదయ రచయితల సంఘం నుంచి, దిగంబర కవుల ధిక్కార స్వరం నుంచి, విప్లవ రచయితల సంఘం చారిత్రక సందర్భానుసారంగా రూపుదిద్దుకొని, ఎదుగుతూ విస్తరిస్తూ సాహిత్య, సాంస్కృతిక పోరాటాన్ని కొనసాగిస్తున్నది. బండి యాదగిరి, సుద్దాల హన్మంతు, వట్టికోట ఆళ్వారుస్వామి, నాజర్ ఆశయాలు, ఆచరణల వెలుగులో, పెన్నూ గన్నూ పట్టిన సుబ్బారావు పాణిగ్రాహి ఒరవడిలో విరసం అడుగులేస్తున్నది. కష్టజీవికి ఇరువైపుల నిలిచేవాడే కవి అన్న శ్రీశ్రీ, ప్రజలను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేటి కవి అన్న శివసాగర్, పాటకు ప్రాణం పోసిన చెరబండరాజు, సాహిత్యమే జీవితంగా సాగిన కొకు, కేవీఆర్, త్రిపురనేని, చలసాని, బెల్లి లలిత వంటి ఎందరో రచయితలు, కళాకారుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, వారి ఆశయాల బాటలో విరసం పయనిస్తున్నది.
ఈ మొత్తాన్ని విప్లవ సాహిత్యోద్యమం తన వారసత్వంగా స్వీకరించింది. వర్గపోరాట చైతన్యంతో సొంతం చేసుకున్నది. ఇప్పుడు ʹʹదేశీ సామాజిక, సాహిత్య చరిత్ర - మార్క్సిజంʹʹ అనే ఇతివృత్తంతో సాహిత్య పాఠశాల తలపెట్టింది. ఈ రంగంలో తెలుగు సాహిత్య రంగంలో, ముఖ్యంగా విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో గుర్తించదగిన కృషి జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకపోడానికి ఈ సాహిత్య పాఠశాల దోహదపడుతుంది. ఈ ప్రయత్నం విప్లవ సాహిత్యోద్యమానికేగాక మొత్తంగా తెలుగు ప్రగతిశీల, ప్రజా సాహిత్యానికి గొప్ప చేర్పుగా దోహదపడుతుంది. సాహిత్య భావజాల రంగాల్లో ప్రతీఘాతుక, బ్రాహ్మణీయ ఆధిపత్య ధోరణులు బలోపేతమవుతున్న తరుణంలో దేశీ సాహిత్యం గురించి మరోసారి లోతుగా మాట్లాడుకోవడం చాలా అవసరం. ఈ అవగాహనతో విరసం చేపట్టిన ఈ సాహిత్య పాఠాశాల విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిద్దాం.
జైని మల్లయ్య గుప్త, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు
నోముల సత్యనారాయణ, ఆహ్వాన సంఘం అధ్యక్షులు
Keywords : virasam, revolutionary writers association,
(2024-02-21 17:28:34)
No. of visitors : 2126
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |