ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

ఉత్తేజకరంగా


విరసం సాహిత్య పాఠశాల మొదటి రోజు

హిందూ ఫాసిజంతో దేశా నికి పెనుముప్పు పొంచి ఉందని విప్లవ రచయి తల సంఘం (విరసం) కార్యదర్శి పాణి అన్నారు. శని వారం నల్లగొండలోని ఎస్ బీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన విరసం 21వ సాహిత్య పాఠశాల కార్యక్రమంలో దేశీ సాహిత్యం, సామాజిక చరిత్ర -మార్క్సిజం అనే అంశంపై ప్రసంగించారు. ఒక పక్క దేశం సాంకేతిక పురోగతి సాధిస్తుందని చెబు తున్న బీజేపీప్రభుత్వం.. మరోపక్క విమానాలు, ప్లాస్టిక్ సర్జరీలు, టెస్ట్ ట్యూబ్ బేబీలు పురాణాల లోనే ఉన్నాయని ప్రచారం చేయడం శోచనీయమ న్నారు. చరిత్ర నిర్మాణంలో సంఘ్ పరివార్ జోక్యం ఫాసిజం, మతోన్మాదం అమలుకు బలమై న ఆధారంగా కనిపిస్తోందన్నారు. దేశీ సాహిత్యం, సామాజిక చరిత్రను మార్క్సిస్టు అవగాహనతో అర్థం చేసుకోవాలన్నారు.

మధ్యాహ్నం నిర్వ హించిన సమావేశంలో భీమా కోరేగావ్-బ్రాహ్మ ణీయ వ్యతిరేక పోరాట ప్రతీక అనే అంశంపై వి రసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ప్రసంగిస్తూ భీమా కోరేగావ్ చరిత్రను కన్నులకు కట్టినట్లు వివ రించారు. బ్రాహ్మణీయ కేంద్రంగా చరిత్రను రా సుకోవడం నంఘ్ పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. చరిత్రను ఆధిపత్య వర్గాలు తమకు అనుగుణంగా రాసుకున్నాయని, దాన్ని తిరస్కరిస్తూ అట్టడుగు వర్గాలు ఉద్యమాలు నిర్వ హిం చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగానే భీమా కోరేగావ్ పోరాటాన్ని అర్థం చేసుకోవాల న్నారు. బ్రాహ్మణీయ ఆధిపత్య పోరాటానికి భీమా కోరేగావ్ ఒక ప్రతీక అని వివరించారు. 200 ఏళ్ల క్రితం పీష్వాల పాలనకు వ్యతిరేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవడాన్ని ఇవాల్టీ పాలకవర్గాలకు కంటగింపుగా మారిందన్నారు. దళితులు తమ పరాక్రమ చిహ్నాన్ని, విజయోత్సవాలు చేసు కోవడం జీర్ణించుకోలేని సంఘ్ పరివార్ శక్తులు దాడులకు పాల్పడడంతో పాటు ఇద్దరు దళితుల హత్యకు కారణమయ్యారని పేర్కొన్నారు. సంఘ్ ప‌రివార్ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా స్వామిక శక్తులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన మైందన్నారు.

కలెక్టివ్ వాయిస్ కన్వీనర్, కవి యాఖూబ్ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసి జం పెచ్చరిల్లుతోందని, కల్బుర్గి, పన్సారీ, గౌరీ లంకేశ్ లాంటి ప్రజా మేధావులను హత్య చేసిన హిందూ మతోన్మాద శక్తులు ప్రశ్నించేవారిని అర్బన్ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధి స్తుందన్నారు. సామాజిక కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశా రు.

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ ప్రస్తుత పాలకుల మతోన్మాద విధానాలు చూస్తుంటే ఇందుకేనా మేము స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించిం దని ఆవేదన వ్యక్తు చేశా రు. ప్రశ్నించే గొంతు లను నులిమి వేసే ధోరణి పెరిగిపోతుందని, మోదీ అధి కారంలోకి వచ్చాక ఫాసిస్ట్ మూకలు చెలరేగిపోతున్నాయన్నారు. గోరక్షణ పేర భౌతిక దాడులు, హత్యలు చేస్తున్నారని, విభిన్న ఆచార వ్యవహారాలను సాంస్కృతిక జీవన సరళిని నేరం గా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ కవి, రచయితలను కుట్ర కేసుల్లో ఇరికించి జైళ్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదంగా పరిగణించాలన్నారు.

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. సాయంత్రం ప్రజా కళామండలి కళాకారులు పునాదులు కదులుతున్నాయి అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో దళితు లపై కొనసాగుతున్న నిరాదరణ, దౌర్జన్య కాండ జరుగుతున్న తరుణంలో అంబేద్కర్ ప్రత్యక్షమై తాను రచించిన రాజ్యాంగం అమలు కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో పెడధోణులతో అమలు చేస్తున్న విధానాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేసే ఘట్టాలను ఆకట్టుకునేలా ప్రదర్శించారు. విరసం కార్యవర్గ సభ్యుడు వెంకన్న అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో విరసం సభ్యులు, ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు.

విరసం సాహిత్య పాఠశాల రెండవ‌ రోజు

దేశంలో రెండు రాజకీయాలు ఉన్నాయని, ఒకటి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికల రాజకీయాలు, మరొకటి వ్యవస్థను మార్చే రాజకీ యాలని విరసం సీనియర్ సభ్యుడు జి.కళ్యా ణరావు పేర్కొన్నారు. విరసం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న 21వ సాహిత్య పాఠశాలలో 2వ రోజు ఆయన మాట్లాడారు. వ్యవస్థను మార్చే ప్రత్యా మ్నాయ రాజకీయాలపై తీవ్ర నిర్బంధం అమల వుతుందని.. మేథావులపైన నిర్బంధం కొనసా గిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా రచయితలు, హక్కుల కార్యకర్తలపై కుట్ర కేసులు అందులో భాగమేనని వివరించారు.

విరసం సీనియర్ సభ్యురాలు రత్నమాల మాట్లాడుతూ ప్రజలప క్షాన మాట్లాడే గొంతులను నొక్కివేయడమే లక్ష్యంగా రాజ్యం యత్నాలు చేస్తోందని పేర్కొ న్నారు. అక్రమ కేసుల పేరుతో జైళ్లలో నిర్బంధి స్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. విరసం కార్యద ర్శి పాణి మాట్లాడుతూ వర్గ పోరాటాలే ప్రజల విముక్తికి మార్గమని, సమాజాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కా రాలను కనుగొనగలుగుతామని వివరించారు.

విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం ʹదేశీయ సాహిత్య చరిత్ర, మార్క్సిస్టు దృక్పథంʹ అనే అంశంపై మాట్లాడారు. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన సాహిత్యం దేశీయ సాహిత్యమని, రామా యణ మహాభారతాలు రాజుల కోసం, వారి ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చాయని వివ రించారు. భారతదేశంలో శైవ మతం ఆవిర్భవిం చిన కాలంలో దేశీయ సాహిత్యం వచ్చిందని, ప్రధానంగా ఉత్పత్తి కులాల నుంచి ప్రజలను శైవ మతంలోకి ఆహ్వానించడానికి ప్రజలకు అర్థ మయ్యే భాషలో నన్నె చూడుడు, పాల్కురికి సోమ నాథుడు ద్విపద కావ్యాలను లిఖిత సాహిత్యంలో వెలువరించారని చెప్పారు. 1990 తర్వాత మాత్రమే తెలుగు సాహిత్యంలో స్త్రీ, దళిత, మైనార్టీవాద సాహిత్యం వెలుగు చూసిందని, తమదైన జీవితం గురించి ఆ సమూహాలు మాట్లా డుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నరెండు సాహిత్య ధోరణులలో ఒకటి మైదాన సాహిత్యం, రెండోది దండకారణ్య సాహిత్యమని గుర్తుచేశారు. దండకారణ్య రచయితలు యుద్ధ భూమిలో మృత్యువు అంచున నిలబడి సాహిత్య సృజనకు బాటలు వేస్తున్నారని అన్నారు.

2వ సెషన్లో ʹబుద్ది జీవులపై నిర్బంధంʹ అనే అంశంపై ప్రముఖ రచయితలు డానీ, ఎన్.వేణు గోపాల్, స్కైబాబా, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వరలక్ష్మి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వరవర రావు సహా పలువురు హక్కుల కార్యకర్తలపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని, కుల దురహంకార హత్యలను ఖండిస్తూ అసోం పాత్రికేయులపై మోపిన కేసులను ఎత్తివేయాలని తీర్మాణాలు చేశారు. అనంతరం సహచరులు, అనగనగా అడ విలో, భూంకాల్, నిలువెత్తు సాక్ష్యం, జీవితం, నదిలాంటి మనిషి, జాబిలి ఖైదు, వెన్నెల పడవ, తదితర పుస్తకాలను ఆవిష్కరించారు.

Keywords : virasam, nalgonda, revolution, bhima koregaov
(2024-04-27 09:43:23)



No. of visitors : 3241

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఉత్తేజకరంగా