పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి

పోలీసుల

ఇంద్రవెల్లి నెత్తుటి మడుగై 38 ఏండ్లయ్యింది. ఇప్పటికీ ఆ గాయం సలుపుతూనే ఉన్నది. వందమందికి పైగా ఆదివాసులను కాల్చి చంపిన నయా డయ్యర్లు నేటికీ రాజ్యమేలుతూనే ఉన్నారు. తమతో కలిసి జీవించి తమ హక్కులకోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ యోధులకు నివాళులు అర్పించడానికి కూడా సమైక్య పాలకులు ఒప్పుకోలేదు. ప్రతి ఏప్రెల్ 20వ తేదీన ఇందవెల్లితో సహా చుటూ అనేక కిలోమీటర్ల మేర తుపాకులు పహారా కాస్తాయి. లాఠీలు స్వైర విహారం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినా న్ని అధికారికంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ స్వేచ్చగా నివాళులు అర్పించవచ్చని ప్రకటించిన టీఆరెస్..అధికారంలోకి వచ్చాక సమైక్య పాలకులను మించి నిర్భందాన్ని కొనసాగిస్తోంది. ఇంద్రవెల్లి అమరుల స్తూపం దగ్గరికి రాకుండా ఆదివాసులను అడుగడుగునా అడ్డుకుంటోంది.

శనివారం సాయంత్రం వరకు 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటిం చారు. పోలీసులు షరతులతో కూడిన అనుమ తులు ఇస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి ఆదివాసులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభలు, సమావే శాలను నిర్వహించుకునేందుకు అనుమతులు లేవం టూ పోలీసులు హెచ్చరిస్తు న్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండల పరిసర ప్రాంతాలు పోలీసులరక్షణ వలయంలో ఉన్నాయి. ఇంద్రవెల్లి వైపు వచ్చే రహదారులను నిర్బంధిం చారు. రహదారులపై ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులపై నిఘా పెడు తున్నారు. శనివారం పోలీసు ఆంక్షలు కొనసాగు తాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

స్వరాష్ట్రం వచ్చిందని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినంపై ఇక ఆంక్షలు తొలగిపోతాయని ఆదివాసులు సంబరపడ్డారు. అయితే సమైక్య‌ పాలకుల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోలీసు ఆంక్షలు విధించడంతో ఆదివాసులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూ డా పోలీసులు ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవం పై ఉక్కుపాదం మోపడం వారికి ఆగ్ర హం తెప్పిస్తోంది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు. ఆనాటి సమైక్య‌ పాలకుల పాలనను ప్రశ్నించిన టీఆర్ ఎస్ నేతలే ప్రస్తుతం వారి వారసత్వ పాలననే కొనసాగించడంపై ఆదివాసులు, ప్రజా స్వామ్య వాదులు, మేధావులు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తు తం ఇంద్రవెల్లి మండలంలో కొనసాగుతున్న నిర్బంధ పరిస్థితుల పై జవాబు చెప్పాలంటూ ఆదివాసులు, మేధావులు, ప్రజా స్వామ్యవాదులు డిమాండ్ చేస్తు న్నారు.

Keywords : indravelli, adilabad, police, telangana, trs, kcr
(2024-04-24 18:34:54)



No. of visitors : 1023

Suggested Posts


ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడు రోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఏప్రెల్ 20, 1981 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాలక వర్గాలు నెత్తురు పారించిన రోజు. గిరిజన రైతు కూలీ సంఘం మహా సభ జరుపుకునేందుకు వస్తున్న వేలాది ఆదివాసులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది.

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ఏప్రిల్ 20 తేదీ సాయంకాలం నాలుగు గంట లకు గిరిజన ప్రదర్శన, ఆరు గంటలకు బహిరంగసభ ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా అంతటా గోండు, కొలామ్ తెలుగు భాషల్లో పోస్ట‌ర్లు పడ్డాయి. కరపత్రాలు పంచ‌ బడ్డాయి. ఈ ప్రదర్శనకు ముప్పైవేల మంది పైగా గిరిజనులు హాజరవుతారని అంచనా వేయబడింది.

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ʹరగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.ʹ పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పోలీసుల