include 'men';
?>
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ - ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
వర్షాలు వచ్చే ముందు ఆదివాసులు నాలుగు రోజులపాటు విత్తన పండుగను జరుపుకుంటారు. చత్తీస్ గడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా ఎడ్సిమెట్ట గ్రామంలో ఆరోజు( May 17, 2013) విత్తన పండుగ చివరి రోజు . ఆ రాత్రి గ్రామానికి చెందిన 100 మంది ఆదివాసులు ఒక్క చోటే గుమిగూడారు. అదే సమయంలో దాదాపు 150 మంది సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా బలగాలు ఎడ్సిమెట్ట గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామస్తులమీదకు బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో చెల్లాచెదురైన ఆదివాసులు పుట్టకొకరు చెట్టుకొకరుగా పరుగులు తీశారు. అలా అడవుల్లోకి పారిపోయిన ఆదివాసులు ఉదయాన్నే భయం భయంగా గ్రామం చేరుకొని చూసే సరికి అక్కడ తమ వాళ్ళ శవాలు కనిపించాయి. చెల్లా చెదురుగా దూరం దూరంగా తమవాళ్ళు 8మంది చనిపోయిఉండడాన్ని చూసి బోరుమన్నారు ఆదివాసులు...చనిపోయిన వారిలో 4గురు చిన్నారులు,ఒకరు విత్తన పండుగ జరిపించిన పూజారి. వీళ్ళే కాక ఆ రాత్రి పోలీసులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో వాళ్ళ కొల్లీగైన ఓ కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. చనిపోయిన వాళ్ళు 35 ఏళ్ళ కరమ్ సోములు,35 ఏళ్ళ కరంజోగ, 30 ఏళ్ళ పూనెమ్ సోము, 37 ఏళ్ళ పూజారి కరమ్ పండు, చిన్నారులు 10 ఏళ్ళ కరమ్ గుడ్డు, 16 ఏళ్ళ కరమ్ మాసా, 8 ఏళ్ళ కరమ్ భద్రు, 15ఏళ్ళ పూనెమ్ లక్కు తోపాటు కోబ్రా కానిస్టేబుల్ దేవ్ ప్రకాశ్ లు.
ఇంత దుర్మార్గంగా పోలీసులు నిరాయుధులైన ఆదివాసులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్ట్నపెట్టుకుంటే పొద్దున పత్రికలు
. ʹʹచత్తీస్ గడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా ఎడ్సిమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7గురు మావోయిస్టులు ఒక కానిస్టేబుల్ చనిపోయారుʹʹ అని పోలీసుల కట్టు కథను తమ కథనంగా ప్రచురించాయి. ఈ సంఘటనపై ఆదివాసులు, ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనబాటపట్టడంతో మాట మార్చిన పోలీసులు చనిపోయింది గ్రామస్తులేనని ఒప్పుకుంటూనే అక్కడ ఉన్న మావోయిస్టులు గ్రామస్తులను షీల్డ్ గా ఉపయోగించుకున్నారని అందువల్ల తమకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో గ్రామస్తులు చనిపోయారని కొత్త కథను ప్రచారంచేశారు.
అయితే పోలీసులు చెబుతున్న కట్టుకథలు ఈ సమాజానికి కొత్తకాదు.. సమాజంలో ఎవ్వరూ వాళ్ళ కథలను నమ్మలేదు. ఆదివాసులను హత్య చేసిన పోలీసులను శిక్షించాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి.
మరో వైపు ఈ దుర్మార్గమైన సంఘటనపై పలువురు ప్రజా న్యాయవాదులు న్యాయస్థానాల తలుపుతట్టారు. దిగ్రీ ప్రసాద్ చౌహాన్ అనే మానవహక్కుల కార్యకర్త ఆరేళ్ళుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్ అనే ఢిల్లీకి చెంది న్యాయ సంష్త ప్రసాద్ కు అండగా నిలబడింది. అన్ని రకాల పోరాటాల మూలంగా ఆదివాసుల, చిన్నారుల హత్యలు జరిగిన ఆరేళ్ళ తర్వాత ఎట్టకేలకుఈ నెల 3వతేదీన... ఈ సంఘటనపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి ఈ హత్యలపై దర్యాప్తు చేయవల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐ ని ఆదేశించింది. దర్యాప్తు చేసే అధికారులు చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందనివాళ్ళై ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది.
ఆరేళ్ళ తర్వాతనైనా సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇచ్చినప్పటికీ సీబీఐ చరిత్ర తెలిసినవాళ్ళకు.. ఆ దర్యాప్తు ఎలా జరుగుతుందో , రిపోర్టూ ఏ విధంగా వస్తుందో ఊహించడం పెద్దకష్టమైన పని కాదు కదా !
Keywords : chattisgarh, police, adivasi, murder, firing, maoists
(2024-04-24 18:29:39)
No. of visitors : 766
Suggested Posts
| చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్... డీవీసీ మెంబర్ అశోక్ సహా నలుగురు మావోయిస్టులు,ఒక ఎస్సై మృతిఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లా మన్పూర్ అటవీ ప్రాంతం పరిధిలోని పర్దోని దగ్గర మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా నలుగురు మావోయిస్టులు, ఒక ఎస్సై మరణించారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..