మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?

మరొకసారి

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన వీక్షణం జూన్, 2019 సంచిక సంపాదకీయం )

ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడ వెలువడ్డాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ - ఎన్‌డిఎ ప్రభుత్వం ఓడిపోతుందని, మరొక ప్రభుత్వం వస్తుందనీ, దేశంలో కొనసాగుతున్న కుల, మత విద్వేష, అసహన రాజకీయాల నుంచి కొంతయినా ఉపశమనం దొరుకుతుందనీ అనుకున్న చాలమంది ప్రగతిశీల బుద్ధిజీవుల, ప్రజల ఆశలు భగ్నమయ్యాయి.

గత ఐదు సంవత్సరాలలో అమలు చేసిన ప్రజా వ్యతిరేక, విష విద్వేష రాజకీయాలను యథాతథంగానో, మరింత ఎక్కువగానో కొనసాగించడానికి సంఘ్‌ పరివార్‌కు ʹʹప్రజామోదంʹʹఅనబడే బారాఖూన్‌ మాఫ్‌ అనుమతి దొరికింది. ఈ పరిణామం ఎట్లా సంభవించింది, మన సమాజం ఇంతగా మతోన్మాదపూరితమై పోయిందని మనం గుర్తించలేదా లేక మరేదైనా ఆకస్మిక, ఐంద్రజాలిక, సాంకేతిక కనుకట్టు విద్యలతో సంఘ్‌ పరివార్‌ మళ్లీ గద్దెనాక్రమించిందా, ఇది సంఘ్‌ పరివార్‌ బలమా, ప్రతిపక్షాల వైఫల్యమా, ప్రగతిశీల శక్తుల ఆచరణలోపమా అని ఎన్నెన్నో ప్రశ్నలు సమాధానాలు కోరుతున్నాయి.

పార్లమెంటరీ రాజకీయ పక్షాలలో ఎవరు గెలిచి ఎవరు ఓడినా అంతిమ ఓటమి ప్రజలదే అవుతుంది. పాలకవర్గ ప్రయోజనాలను ఓడిన ముఠా కన్న తానే ఎక్కువగా కాపాడతానని గెలిచిన ముఠా తమ యజమానులను ఒప్పించిందనడానికి సూచికే ఎన్నికల ఫలితాలు. అందువల్ల ఓడిన ముఠా ఓటమికి కారణాలను అన్వేషించే బదులు ప్రజల ఓటమికి కారణాలను అన్వేషించడం అవసరమైన పని.

అయితే మన సమాజ సంక్లిష్టత వల్ల ఏ ఒక్క అంశమూ సరళంగా, సూటిగా, సమీకరణం లాగ చెప్పలేము. పాలకవర్గ ముఠాలన్నీ ఒక్క తానులోని ముక్కలేనని తెలిసిన వారు కూడ ఒక ముక్క గెలుపును కాకపోయినా, కనీసం మరో ముక్క ఓటమిని కోరుకునే సందర్భం వస్తున్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చే ప్రజానుకూల పాలన అందించకపోవడం, దేశాన్ని బడా భూస్వాముల, దళారీల, సామ్రాజ్యవాదుల చేతుల్లో పెట్టడం, అవసరం అనుకున్నప్పుడు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, జనహననానికి పాల్పడడం, ప్రాథమిక హక్కులను ఉక్కుపాదంతో కాలరాయడం వంటి పనుల జాబితా తయారు చేస్తే భాజపా ఎంతటి నేరస్తురాలో కాంగ్రెస్‌ అంతటి నేరస్తురాలని స్పష్టమవుతుంది.

రెండు పక్షాల చరిత్రా ఒక్కటేనని తేటతెల్లమవుతుంది. అయినా ఈ ఎన్నికల్లో చాల మంది ఉద్యమకారులు, ప్రగతిశీలవాదులు, అంచులలోకి నెట్టబడిన వర్గాలు భాజపా - ఎన్‌డిఎ ఓడిపోవాలని, ప్రభుత్వం నుంచి దిగిపోవాలని కోరుకున్నారు. అదేమీ కాంగ్రెస్‌ - యుపిఎ పట్ల ప్రేమ కాదు, వారు ప్రజా ప్రయోజనాలను నెరవేరుస్తారనే భ్రమ కాదు.

విషవాయు ప్రయోగంతో ఐదు సంవత్సరాలు ఉక్కిరి బిక్కిరైన వర్గాలు ఈ జైలు కన్న పక్కన అగడ్తలోకి దూకడమైనా సరే అనుకున్నాయి. ఈ మంటల్లో కాలిపోవడం కన్న ఎగిరి పెనం మీద దూకితే వేగినా సరే అనుకున్నాయి. ఎంతకాదన్నా కాంగ్రెస్‌ బహుళత్వాన్ని నమ్మే, ఆచరించే రాజకీయ పక్షం. అనేక చారిత్రక కారణాల వల్ల దానికి ఆ వెసులుబాటు వచ్చింది గనుక ప్రజలకు కూడ కనీసం గాలి పీల్చుకునే అవకాశం, బేరసారాలకు దిగే వీలు వస్తాయని కొందరైనా అనుకున్నారు.

ఆ స్థానంలో ఏకాత్మతను నమ్మే, ఆచరించే, హింసా దౌర్జన్యాల పార్టీగా భాజపా ఐదు సంవత్సరాల అధికారాన్ని ఎంత ప్రజా కంటకంగా నిర్వహించగలదో నిరూపించింది. కారణాల గురించి వివరంగా విశ్లేషించుకోవచ్చుగాని, అంతకన్న ముఖ్యంగా అలా తెలుసుకున్న కారణాలను తొలగించడానికి, తగ్గించడానికి, అంతిమంగా ఈ దుర్మార్గ పాలనను బలహీనపరచడానికి, రద్దు చేయడానికి ప్రతిపాదిస్తున్న ఆచరణ ఏమిటి అనేది ఇవాళ కీలకమైన ప్రశ్న.

ఈ స్థితిలో, ఈ దుస్థితిలో మీరు వ్యక్తిగతంగానో, సామూహికంగానో మీ కర్తవ్యం ఏమిటని నిర్వచించుకుంటున్నారు? ఈ దుర్మార్గ పాలనలో బాధితులుగా, పీడితులుగా మిగలబోయే ప్రజాసమూహాలేవో స్పష్టమే. మనువాదాన్ని ఖండించే సమూహాలు, ఈ దేశం బహుళత్వ దేశమనీ దీన్ని ఏ ఒక్క మతంతోనో, ఏ ఒక్క జీవనవిధానంతోనో ఏకాత్మతా సంస్కృతిగా మార్చడానికి వీలులేదని ఎలుగెత్తే సమూహాలు, హింసకూ అసమానతకూ ఆలవాలమైన ఈ బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు సామాజిక స్వభావాన్ని కూలదోయాలనీ, సమభావం పునాదిగా, ఆర్థిక,
రాజకీయ, సామాజిక న్యాయాన్ని నిర్మించాలనీ కలలు గనే సమూహాలు అన్నిటినీ ఈ పాలన ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నిస్తుంది.

వాక్సభాస్వాతంత్య్రాలను, వ్యక్తిస్వేచ్ఛను, పత్రికాస్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించే ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఈ
పాలకులకు కంటగింపు. ఆ విలువలను ఎత్తిపట్టదలచినవారందరినీ నిర్బంధాల పాలు చేయడం ఈ పాలన లక్ష్యం. ʹఏకీభవించనోడి పీకనొక్కు సిద్ధాంతంʹ ఈ పాలనకు శిరోధార్యం.

ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో ఇటలీలో బెనిటో ముస్సోలినీ, జర్మనీలో అడాల్ఫ్‌ హిట్లర్‌ ఏ మానవతా హనన ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలనే మరెన్నో రెట్లు ఎక్కువగా, మరింత విచ్చలవిడిగా, ఎన్నోరెట్లు విశాలమైన ఈ దేశంలో అమలు చేయాలనేది ఈ పాలకుల కల.బుద్ధిజీవులుగా, చరిత్ర విద్యార్థులుగా, సున్నితమైన హృదయ స్పందనలు గలవాళ్లుగా, సామాజిక జీవులుగా తమను తాము గుర్తించుకునే వాళ్లందరిముందరా ఇవాళ చరిత్ర ఒక సవాల్‌ విసురుతున్నది.

ఎప్పుడో భూస్థాపితమైన నరహంతకుల మీద మీ వైఖరి సరే, వారి మీద పోరాడిన యోధుల గురించి మీ ప్రశంసలు సరే, ఇవాళ ఆ నరహంతకుల వారసులే అధికారపీఠాలు అధిరోహిస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేయదలచారు అని. తమ గురించి తాము ఏమి ఆలోచించుకుంటున్నా, సమాజం గురించి, సమాజ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచిస్తున్నా, ఎన్నెన్నెన్ని అభిప్రాయభేదాలున్నా, ఒకరిది తూర్పుదారి, మరొకరిది పడమటిదారి అయినా సరే, మహమ్మారి ముంచుకొస్తున్నది, సునామీ అందరినీ ముంచబోతున్నది.

మిగిలిన విభేదాలూ వివాదాలూ అన్నీ పక్కన పెట్టి ఒకటవుతామా లేదా, సకల రంగాల్లో సకల స్థాయిల్లో సకల తలాల్లో సకల స్థలాల్లో ఈ మహమ్మారిని ప్రతిఘటించేందుకు మన శక్తి సామర్థ్యాలన్నిటినీ కలగలిపి సమగ్ర, విశాల, సమన్వయ, దీర్ఘకాలిక, అర్థవంత, ప్రజా ప్రయోజనాత్మక పోరాటానికి సిద్ధపడతామా లేదా అనేదే మనలో ప్రతి ఒక్కరినీ ఇవాళ సమాజం, చరిత్ర నిలదీస్తున్న ప్రశ్న.
- ఎన్.వేణుగోపాల్

Keywords : narendra modi, bjp, rss, congress, hindutva
(2024-04-24 18:21:32)



No. of visitors : 832

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మరొకసారి