అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !

అనారోగ్యంతో

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్టంలో ప్రజాస్వామ్యం షరిడవిల్లుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. అయితే తానూ ఆ తానులోని ముక్కనే అని జగన్ నిరూపించుకోవడానికి చంద్రబాబుతో పోటీ పడుతున్నాడు.
గత సంవత్సరం డిశంబర్ లో హైదరాబాద్ లో చైతన్య మహిళా సంఘం కార్యకర్తలైన అనూష, అన్నపూర్ణ, భవానీ లను వాళ్ళ ఇంటి నుండి కిడ్నాప్ చేసి మావోయిస్టులనే కేసు బనాయించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనూషకు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్య సదుపాయంలేకుండా వేధిస్తున్నారు. తన పరిస్థితిపై విశాఖ జైల్లో ఉన్న అనూష రాసిన లేఖ పూర్తి పాఠం....

ప్రజల పక్షాననిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహించని రాజ్యం ప్రజాసంఘాలపై ఉక్కు పాదం మోపుతుంది. అందులో భాగంగానే... అనారోగ్యంతో ఉన్న నన్ను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైదరాబాద్ లోని మా ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించారు. నడవలేని స్థితిలో వున్న నాకు జైల్ అధికారులు ఒక కొత్త వీల్ చైర్ ఇచ్చి. వీల్ చైర్ నెట్టడానికి ఒక మనిషిని కూడా పెట్టారు కానీ,... నన్ను పేషెంట్ గా మాత్రం గుర్తించడంలేదు. నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ, జైల్ వాళ్ళు మాత్రం ఎస్కార్టు లేదని అడ్మీట్ చెయ్యలేదు మళ్ళీ కోర్టులో కంప్లైంట్ చేశాను. ఇలా కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే ఒకరోజు హాస్పిటల్ కి తీసుకెళ్ళడం మళ్లి రొజునుంచి పట్టించుకోక పోవడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ వల్ల నా చేతులు ప్రస్తతం నేను నడవడానికి ఉపయోగపడుతున్న స్టిక్కుని కూడా పట్టుకోలేక పోతున్నాయి ఈపరిస్థతిని వివరిస్తూ మళ్ళీకోర్టు లో ఫిర్యదు చేశాను. ఇలా కోర్టుకి వెళ్లిన ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నానని దాదాపు రెండు నెలల నుంచి కోర్టుకు కూడా తీసుకెళ్లడంలేదు. వీటన్నిటినీ నిరసిస్తూ 24 గంటలు నిరాహార దీక్ష కూడా చేసాను. కానీ జైలు వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు ఇంతలోనే కండిషనల్ బెయిల్ వచ్చింది. పాడేరు, జి. మాడుగుల, పెద్దబైలు ఈ మూడు పోలీస్ స్టేషన్లలో 10 గం౹౹ల నుండి 2 గం౹౹ ల లోపు సంతకాలు పెట్టాలి. ఈ మూడు ప్రాంతాలకు బస్ సౌకర్యం గాని, ఆటో సౌకర్యం గాని అంతగా లేవు. ఐదు కేసులకు పది శూరిటీలు పెట్టాలన్నారు. పది శూరిటీలు పెడితే శూరిటీలు వెరిఫికేషన్ చేయాలని చెప్పి వెరిఫికేషన్ పేరుతో శురిటీలు పెట్టేవారిని బెదిరించారు. శూరిటీలు పెడితే మీ కుటుంబాలను నక్సలైట్ కుటుంబంగా పరిగణిస్తామని,మాకుటుంబం మొత్తం నక్సలైట్ల కుటుంబమని, ఆస్తులను జప్తు చేస్తామని, మీకు ఆడపిల్లలు ఉన్నారు మీకు మీ కూతుర్లు అవసరంలేదా అని బెదిరించారు. దానితో కొంతమంది భయపడి శూరిటీలు పెట్టడానికి రామన్నారు. అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తికి బెయిల్ తీసుకొని బయటికి వచ్చే హక్కు ఉంటుంది. కానీ, పోలీసులు మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా నా ఆనారోగ్యస్థితిని నిర్లక్ష్యం చేస్తూ, బెయిల్ వచ్చినప్పటకి నావిడుదలకు ఆటంకాలు కల్పిస్తూ.... శారీరకంగా, మానసికంగా నన్ను హింసిస్తున్నారు.

***విశాఖ సెంట్రల్ జైలు నుండి అనూష.***

Keywords : andhrapradesh, anusha, maoists, police, jagan
(2024-04-28 02:04:53)



No. of visitors : 2187

Suggested Posts


ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ముగ్గురు మహిళా మావోయిస్టులు వలసి @ రమే, వనతల లక్ష్మి @ సంగీత , కొర్ర దేవి @ సీతలను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులుప్రకటించారు.

మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారు

మనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం.....

చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి

ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు....

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌

బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదను సామ్రాజ్యవాద, కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల చట్టాలను తీసుక వచ్చి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నది.

ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూ

మనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు.

విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీ

ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇ

విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌

విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అనారోగ్యంతో