రెండురోజులు... మూడు కుల దురహంకార హత్యలు !

రెండురోజులు...

చిత్తూరు జిల్లాలో అగ్రకుల అహంకార హత్య జరిగింది. కన్నబిడ్డ ఓ దళితుడుని పెళ్లి చేసుకుందన్న కారణంతో కమ్మ కులానికి చెందిన‌ తల్లిదండ్రులే కూతురు గొంతు కోసారు.

పలమనేరు మండలం ఊసరపెంట గ్రామంలో కమ్మ కులానికి చెందిన భాస్కరనాయుడి కూతురు 23 ఏళ్ల హేమవతి బీటెక్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవ్‌ను ప్రేమించింది. వీరి పెళ్లికి హేమవతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

దళిత యువకుడిని పెళ్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు వారిపై దాడి చేసి బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు మూడుసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

అయినప్పటికీ దాడులు ఆపకపోవడంతో రెండున్నరేళ్ల క్రితం ఆ దంపతులు ఊరి విడిచి వెళ్లిపోయారు. బెంగళూరు, జంగాల అగ్రహారం తదితర ప్రాంతాల్లో నివసిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో గర్భవతి అయిన హేమవతి ఇటీవల తన భర్త సోదరి ఊరైన బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి వచ్చింది. వారం రోజుల క్రితం పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం అత్తవారింటికి వెళ్లిన హేమవతి శుక్రవారం బిడ్డకు ఒంట్లో బాగాలేకపోవడంతో భర్త, అత్తతో కలిసి పలమనేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించింది. అనంతరం అందరూ కలిసి తిరిగి బస్సులో ఇంటికి బయలుదేరారు. ఊసరపెంటలో బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హేమవతి తండ్రి భాస్కరనాయుడు, సోదరుడు చరణ్ వారిని చూశారు.

వెంటనే వారి వద్దకు వెళ్లి హేమవతి భర్త, అత్తలపై దాడి చేశారు. హేమవతి తల్లి వరలక్ష్మి, సోదరుడుభాను ప్రకాశ్, చెల్లెలు నిఖిల కలిసి బాలింత అని కూడ చూడకుండా హేమవతిని బలవంతంగా ద్విచక్ర వాహనం ఎక్కించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నామని, అక్కడికొచ్చి మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, బైక్‌ను పొలాల్లోకి తిప్పడంతో అప్రమత్తమైన హేమవతి భర్త కేశవ్ తెలిసిన వారికి చెప్పి, చేతిలో ఉన్న పసిబిడ్డతో బైక్ వెనక పరుగెత్తాడు. అయితే, అప్పటికే వారు మాయమయ్యారు.

హేమవతిని నేరుగా మామిడి తోటలోకి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు గొంతుకు తాడు బిగించి చంపేసి అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి లాక్కెళ్లడాన్ని చూసిన కొందరు కేకలు వేశారు. జనం రావడం చూసిన ఆ హంతకులు కత్తులతో వారిని బెధిరించి హేమావతి మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పరారయ్యారు.

ఈ దుర్మార్గం శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగితే రేండు రోజుల ముందు మంగళవారంనాడు తమిళనాడులో మరో అగ్రకుల అహంకార మృగాలు మరో జంటను హత్య చేశాయి. ఇక్కడ అమ్మాయి దళితురాలు, అబ్బాయి అగ్రకులం. ఇద్దర్ని చంపింది అబ్బాయి సోదరుడు.

కోయంబత్తూరు మెట్టుపాలయం శ్రీరంగరాయన్ ఓట్టై ప్రాంతానికి చెందిన కరుప్పసామి కుమారుడు కనకరాజ్ అదే ప్రాంతంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో దర్శినిప్రియతో అతనికి పరిచయమై.. ప్రేమగా మారింది. అయితే, దర్శినిప్రియ దళిత సామాజికవర్గం అవడంతో అగ్రకులమైన కనరాజ్ కుటుంభానికి అది నచ్చ లేదు. దీంతో ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే వారిని వెతికి పట్టుకున్న ఇరుకుటుంబాల పెద్దలు.. పంచాయతీ పెట్టి.. వేరు చేశారు. ఇకపై ఒకరినొకరు కలవకూడదని షరతులు పెట్టారు.

అయినా, ఆ తర్వాత కూడా కనకరాజ్‌, దర్శినిప్రియ తరచూ కలుస్తూ వచ్చారు. అమ్మాయి తక్కువ కులానికి చెందినదని, ఆ అమ్మాయిని కలువకూడదని కనకరాజ్‌ను అతని సోదరుడు వినోద్ హెచ్చరించాడు. అయినా వారు రహస్యంగా కలుస్తూ వస్తుండటంతో ఆగ్రహించిన వినోద్.. గత మంగళవారం సోదరుడు కనకరాజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి అడ్డువచ్చిన దర్శినిప్రియపై కూడా కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో కనకరాజ్ అక్కడికక్కడే మృతిచెందగా దర్శినిప్రియ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది.


Keywords : chittoor, palamaneru, tamilanadu, dalit, upper cast, murder
(2024-04-24 18:13:50)



No. of visitors : 1052

Suggested Posts


Love Has No Labels !

While the vast majority of Americans consider themselves unprejudiced, many of us unintentionally make snap judgments about people based on what we seewhether its race, age, gender, religion, sexuality, or disability....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రెండురోజులు...