TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం

TISS

టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్ (TISS) యాజమాన్యం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక చర్యలకు నిరసనగా విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం స్పంధించకపోవడంతో ఆమరణ నిరహార ధీక్షలకు పూనుకున్నారు. దీంతో యాజమాన్యం దుర్మార్గమైన చర్యకు పూనుకుంది. మొత్తం క్యాంపస్ నే మూసేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ క్యాంపస్‌(టిస్‌) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి అద్దె బిల్డింగుల్లోకి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్‌ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. అయితే 15 వేలుగా ఉన్న‌ మెస్‌ చార్జీలను ఒకే సారి 54 వేలకు పెంచారు. గతంలో 15 వేలు కూడా మూడు విడతలుగా చెల్లించే వీలుండేది. ఇప్పుడు 54 వేలు ఒకే సారి చెల్లించాలన్న నిబంధ‌న విధించారు. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించారు.
దేశంలోని అనేక ప్రాంతాల నుండి చదుకోవడానికి వచ్చే పేద మధ్యతరగతి పిల్లలు ఇంత మొత్తం ఒకే సారి చెల్లించడం అసాధ్యమే.

దీంతో విద్యార్థినీ విద్యార్థులు మెస్‌ చార్జీలతో పాటు భారీగా పెంచిన‌ డిపాజిట్లను తగ్గించాలని, మెస్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ నిన్న (16 జూలై) ʹసైన్‌–డైʹ ఆఫ్‌ క్యాంపస్‌కు యాక్టింగ్‌ రిజిస్ట్రార్‌ ఎంపీ బాలమురగన్‌ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్‌ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. స్వంత ఊళ్ళకు వెళ్ళాలన్నా కష్టమే ఇక్కడే ఉండాలన్న కష్టమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మాహెచ్చరించారు.
దీనిపై స్పంధించిన పౌరహక్కుల సంఘం టిస్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు నిచ్చింది. ఈ విధంగా ʹటిస్ʹ క్యాంపస్ ను మూసేయడం అక్రమం అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. యాజమాన్యం విద్యార్థుల సమస్యలను కనీసం వినకుండా వారితో చర్చించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని పౌరహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేపు (17 జూలై) మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పౌరహక్కుల సంఘం తెలిపింది. మధ్యాహ్నం 1 గంటకు సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో జరిగే ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జీ.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్ పద్మజా షా, వీ. రఘునాథ్, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, టిస్ విద్యార్థి జేఏసీ నాయకురాలు కరిష్మా, పీఎమ్.రాజు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొంటారని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

Keywords : TISS, Students, CLC, Telangana
(2024-04-24 18:08:10)



No. of visitors : 772

Suggested Posts


The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.

The students of the Tata Institute of Social Sciences, Hyderabad are protesting against the exorbitant hostel fees which is pushing many underprivileged students to dropout of the course entirely.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


TISS