ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

ʹఅన్నలు

(అశోక్ కుంబము రాసిన ఈ కథనం virasam.org లో పోస్ట్ చేయబడినది)

ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు పాలకులు అధికారంలోకి వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల మీద తీవ్ర నిర్బంధం, ప్రజల మీద హింస రోజురోజుకు పెరుగుతున్నాయి. పౌర, ప్రజాస్వామిక హక్కుల సోయితో బ్రతికిన తెలుగు నేల మీద మొన్నటి వరకు "విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది" అని నినదించిన ఎంతోమంది బుద్ధిజీవులు, కవులు, రచయితలు విప్లవం మంచి ఆదర్శమే కాని ఆచరణ సాధ్యం కాదని కొత్త తీర్మనాలు చేస్తున్నారు. మారిన కాలానికి యాబై ఏండ్ల కిందటి నక్సల్బరీ పంథా సరికాదని, డెబ్బై ఏండ్లుగా ప్రజలకు పనికిరాని పార్లమెంట్ బాట పడుతుండ్రు. అవకాశవాదంతో దోపిడీ పాలకుల పంచన చేరి విప్లవ ప్రజల త్యాగాలను హేళన చేస్తుండ్రు.

ఇవన్నీ చూస్తూ నిరాశపడేవారున్నారు, తక్షణం ఆవేశపడేవారూ ఉన్నారు. వీటన్నింటికి అతీతంగా విప్లవ ఆచరణలో ముందుకు సాగుతున్న వాళ్ళూ ఉన్నారు. ఈ గందరగోళ సందర్భంలోవిప్లవోద్యమంలో తమ జీవితాలను, విలువైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేసిన అమరుల తల్లితండ్రులు, బంధుమిత్రులు అమరుల గురుంచి, వాళ్ళు కనిన కలల గురుంచి, వాళ్ళ త్యాగాల గురుంచి, మొత్తంగా విప్లవం గురుంచి ఏమనుకుంటున్నారో, ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో గత సంవత్సరం అమరుల బంధుమిత్రుల సంఘం సమావేశాలకు పోతె వాళ్ళలో కొందరితో మాట్లాడే అవకాశం దొరికింది. సంవత్సరం దాటినా వాళ్ళ మాటలు నాకు ఇంకా వినిపిస్తూనే వున్నాయి.

వినగలిగే మనసు ఉండాలి కాని వాల్ల దగ్గరి నుండి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ జ్ణాపకాలలో ఎంత చరిత్ర దాగుంది. చదువుకున్నామనే అహం పక్కన పెట్టి వాళ్ళ గుండె చప్పుడు వినాలి కాని ఎన్ని త్యాగాల గుర్తులను ఏరుకోవచ్చు. పైకి ఎంత అమాయకంగా, గంభీరంగా ఉన్నా తమలో ఎన్నో ప్రకంపనాలను దాచుకునివున్నారు. వాళ్ళతో మట్లాడడం అంటే విప్లవ మార్గంలో సాగిపోయిన, ఒరిగిపోయిన అమరుల పాదముద్రలు తాకడమే.

***
"మాది ఖిలా వరంగల్. పడమటికోట. నేను మహేశన్న తల్లిని" అమరుడైన కొడుకే తన చిరునామాగా పరిచయం చేసుకుంది ఆ తల్లి.

"అమ్మా నీ కొడుకు విప్లవోద్యమంలోకి ఎట్ల పోయిండు, ఏడ పనిచేసిండు, ఎట్లా అమరుడయిండు" చెప్పమని ఆ తల్లిని అడగగానే...

"ముందుగాల మా తమ్ముడు, మా పెదనాయన కొడుకును 94ల ధర్మారం దగ్గర పోలీసోళ్ళు కాల్చి చంపిండ్రు. అప్పడిదాక ఆయన పార్టీల పనిచేస్తుండని మాకు తెల్వదు. ఆయన పేరు రమణమూర్తి. ఇంటిపేరు మొగుసాలి. మొగుసాలి రమణమూర్తి. రమణ పేరు మీద పట్టణ కార్యదర్శిగ చేశిండు. అప్పుడు మాకు ఇవేమి తెల్వది. ఆయన ఉన్నప్పుడే నా కొడుకును ఒకసారి అరెస్ట్ చేసిండ్రు. "

"నా కొడుకు నాగార్జునసాగర్ గురుకులంల పది వరకు చదువుకుండు. పరీక్ష రాపిస్తె సీటొచ్చింది. అక్కడే మూడేండ్లుండి చదువుకోని వచ్చిండు. పదో తరగతి ఫస్ట్ క్లాస్ ల పాస్ అయ్యిండు. 92ల. ఒకలు చదువుకో అని చెప్పాల్సిన పనిలేదు ఆయనకు. చదువంటె అంత ఇష్టం. పది పాసయి వచ్చినంక సీకేయం కాలేజ్ ల అప్ప్లై చేస్తే ఫస్ట్ లిస్ట్ లనే పేరొచ్చింది…"

ఆ తల్లి చెప్పేది వింటున్న కాని దానికి సమాంతరంగా నాలో మరో ఆలోచన నడుస్తావుంది. నేను కూడ నల్లగొండ జిల్లాలో ఒక గురుకులంలోనే చదువుకున్న. నేను పాస్ అయ్యింది కూడ 92లోనే. కాని మహేశన్న చైతన్యానికి, ఆచరణకు, త్యాగానికి నాకు ఎంత తేడా వుంది అని మనసు ఒక్కసారిగా ముడుసుకున్నట్లయ్యింది.

ఆ ఆలోచనలోంచి బయటపడడానికి "అమ్మా, నీ కొడుకులాగానే నీను కూడ గురుకులంలోనే చదువుకున్న. 92లనే పాస్ అయిన. అంటే మీమిద్దరం ఒక్కతోటోల్లం. కాని నీ కొడుకు ప్రజల మీద ప్రేమతో వాళ్ళ విముక్తి కోసం విప్లవంలో అమరుడయ్యిండు. నేనేమో నా బతుకు మీద ప్రేమతో ఇలా బతుకుతున్న. నాలాంటోళ్ళను చూసినప్పుడు నీకు ఏమనిపిస్తది? " అని అనగానే

"నాకు ఇంకా ముగ్గురు కొడుకులు ఉండ్రు. వాళ్ళేమి పార్టీల పోలేదు కద బిడ్డ. ఎవ్వరి తెల్విని బట్టి, గుణం బట్టి వాళ్ళు పనిచేస్తరు." నన్ను ఓదార్చినట్లు చెప్పినట్లుంది కాని అందులో జ్ణానం, ఆచరణ, నిబద్ధతకు సంబంధించిన ఒక సత్యాన్ని చెప్పింది.

మహేశ్ గురుంచి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం పెరిగింది. "అమ్మా నీ కొడుకు గురుంచి ఇంకా చెప్పు" అని అడిగిన.

"ఆయన పేరు రవిందర్ రాజు అని పెట్టుకున్నం. బడిల రవిందర్ అంటోల్లు. ఇంట్ల రాజు అని పిలుస్తోలం. పార్టీల మూర్తి పేరుతోటి పనిచేసిండంట. కాని చనిపోయినప్పుడు మాత్రం మహేశన్న అని పేపర్ల పడ్డది" అని చెప్తుంటె

"సీకేయం కాలేజీల చదువుకుంటున్నాయన పార్టీలకు ఎట్ల పోయిండు" అని నా ఆతృత ఆపుకోలేక అడిగిన.

"సీకేయం కాలేజీల చదువుతున్నప్పుడే ʹమీ మామ ఏడవుంటడో చెప్పురాʹ అని ఆయనను అరెస్ట్ చేసిండ్రు. అప్పటికి మా తమ్ముడు పార్టీల పని చేశేది మాకు తెల్వది. ఆయన బాగ బొమ్మలు గీసేది. మా దగ్గరికి బాగ వచ్చేది. ఆయనతో పాటే మా రాజు కూడ గోడల మీద రాతలు రాసేది. బొమ్మలేసేది. అదేమి తప్పుపని కాదు కదా అని మీము సుతాగ ఏమి అనపోతోళ్ళం. నాకు, రాజు వాల నాయనకు ఇద్దరికి చదువు రాదు. కూలి పని చేస్తోల్లం. ఆయన రిక్షా తొక్కేది. బస్తాలు మోసేది. మీము గోసంగోల్లం. మాకు సెంట్ భూమి కూడ లేదు. అయినా కూడ కూలినాలి చేసి రాజును చదివియ్యాలనుకున్నం. కాని మా తమ్ముని కోసమని మా రాజును పరీక్ష రాసి బయటకు వస్తుంటె పట్టుకుపోయేవరకు మాకు తెల్వదు అసలు ఎంజరుగుతుందో. మా చుట్టూర విప్లవ పార్టీలు వున్నయని తెలుసు. రోజు చూస్తనే వుంటిమి. కాని మాదాంట్ల అంత తెల్వికల్లోలు ఎవరున్నరు వాటిల్ల పనిచేయనీక అనుకుంటోళ్ళం. మా తమ్ముడే పనిచేసేది అప్పుడే తెల్సింది."

"రాజును పట్టుకపోయి రైలు పట్టాలకు కట్టేసి ʹమీ మామ ఎక్కడుండో చెప్పకపోతె సచ్చిపోతవ్ʹ అని బెదిరించిండ్రంట. నేను సచ్చినా సరేకాని నాకు తెల్వదని చెప్పిండంట. ఇంక ఇట్ల చెప్పడని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకపోయి కరెంట్ పెట్టిండ్రంట. కళ్ళకు గుడ్డలు కట్టి నానా హింస పెట్టిండ్రంట. కొడుకు హింస భరించిండు కాని ఒక్క మాట కూడ వాళ్ళకు చెప్పలే. చివరికి వాళ్ళవీళ్ళ కాళ్ళు పట్టుకోని విడిపించుకోని వచ్చినం."

"వచ్చినాంక మల్లమల్ల పట్టుకుపోవడం చేసిండ్రు. ఒకసారి మా పక్క ఊర్ల శ్యాం అనే పార్టీ సభ్యుని తల్లిని హింస పెడితె ఆ బాధ తట్టుకోలేక ఆమె మందు తాగి సచ్చిపోయింది. తల్లి చావుకు మారువేశంల వచ్చి పోతుంటె ఆ పిల్లగాన్ని మా రాజు సైకిల్ మీద తీసుకపోయిండంట. అది ఎవరో చూసి పోలీసులకు చెప్తె, పొద్దున్నే మళ్ళీ కాలేజ్ దగ్గరే అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. మాకు తెల్సి స్టేషన్ కు పోయి అడిగితె ʹమీము ఎవ్వరిని అరెస్ట్ చేయలెపోʹ అన్నరు. అక్కడే మాకు తెల్సిన కానిస్టేబుల్ వుండె. ఆయనొచ్చి ʹరాజును పట్టుకొచ్చిండ్రు. లోపల పెట్టిండ్రుʹ అని చెప్పిండు. ఏమన్న గాని అని లోపలికి పోయినం. పోయేసరికి ఏముంది, నా కొడుకు వేలుముద్రలు తీసుకుంటుండ్రు. బాడీ కొలతలు తీసుకుంటుండ్రు. అప్పుడే అనుకున్న నా కొడుకును నాకు కాకుండ చేస్తుండ్రని. సక్కగపోయి ʹఏంది సారు, మా రాజును ఎందో ఆగం చేయపడ్తిరి. వాడు మంచిగ సదువుకుంటోడు సారు. వానికి పార్టీ ముచ్చట్లేం తెల్వదు సారు. కూలినాలి చేసి అట్లనో ఇట్లనో చదివిస్తున్నం. వాని మీదనే మా ఆదరువు. నా బిడ్డను వదిలిపెట్టండి సారూʹ అని దండం పెట్టి అడిగిన. అయినా వినలె. చివరికి ఐదు రోజుల తర్వాత జమానత్ కట్టి తీసుకొచ్చుకున్నం.ʹ

"ఇట్లనే మాటమాటికి తీసుకపోతుండ్రు, బెదిరించి వదిలిపెడుతుండ్రు. రొండేండ్లు బాగ సతాయించిండ్రు. పార్టీ వాళ్ళను ఒక్కరినన్న పట్టియమని వెంటపడ్డరు. ఎట్ల పట్టిస్తడు. ఎవరినని పట్టిస్తడు. చదువొచ్చిన మేధావాయె. ఎవని కడుపు కాలుస్తడు. వాల్లెన్నితీర్ల బెదిరించినా బెదరలే, అదరలే."

"ప్రతిసారి పట్టుకుపోతుండ్రని రాజును దొరకకుండ చేసినం. ఇక పోలీసోల్లు వచ్చినప్పుడల్ల మా ఆయనను కొట్టిండ్రు. మా మరిదిని కొట్టిండ్రు. మా చిన్నోన్ని తలకు తుపాకి పెట్టి కాలుస్తమని బెదిరించిండ్రు. నన్ను, నా బిడ్డను చెప్పరాని మాటలు తిట్టిండ్రు. ఈయెత్తున చేస్తుంటె వుండలేక రాజు ఇంటికొచ్చిండు. వచ్చిన పది నిమిషాలకే పోలీసోలొచ్చి పట్టుకపోయిండ్రు. మల్ల హింస పెట్టిండ్రు. "

"ఎన్ని హింసలు పెట్టినా మాకు చెప్పకపోయేది. మనసులనే పెట్టుకున్నడు. అట్ల రొండేల్లు ఇబ్బంది పెట్టిండ్రు. ఇట్ల జరుగుతుండగనే మా తమ్మున్ని 94ల కాల్చి చంపిండ్రు. జూన్ 04, 94ల చంపేసిండ్రు. ఆ తర్వాతనే రాజు పార్టీలకు వెళ్ళిపోయిండు. ఆయనను కూడ 96ల చంపేసిండ్రు.ʹ

ఆ తల్లి చెప్పేదంతా విన్న తర్వాత "అమ్మా, నీ కొడుకు, నీ తమ్ముడు విప్లవం కోసం ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఆ త్యాగాన్ని ఎట్ల చూస్తున్నవ్? ఆ త్యాగానికి ఉన్న విలువేంటి?" అని అడిగిన.

వెంటనే ఆమె "ఆ త్యాగానికి చాలా విలువుంటది బిడ్డా. వాళ్ళు చదువుకున్నరు, మంచిగ బతికే పరిస్థితి వుండె. కాని వాళ్ళ జీవితం కన్న ప్రజల జీవితం ముఖ్యమనుకున్నరు. వాళ్ళ కోసం వాళ్ళు బతకడంల ఏమి విలువ వుంటది. నలుగురు కోసం బతికినా, సచ్చినా విలువనే. ఆ ఆలోచన చేయడానికి చాలా ధైర్యం వుండాలి. సాన మందికి ఆ ధైర్యం వుండదు."

"అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.ʹ

"నిజం చెప్పాలంటె నాకున్న నలుగురు కొడుకులల్ల రాజు కున్న తెలివి, గుణం ఎవ్వరికి రాలె. మల్ల నా బిడ్డకొచ్చింది. ఆమె కూడ పార్టీల, ప్రజా సంఘాలల్ల పనిచేసింది. ఆమె కూడ చనిపోయింది."

ఏ తల్లి అయినా తన పిల్లలందరిని ఒక్కతీరుగ పోల్చుకుంటది, పొగుడుకుంటది. కాని ఈ తల్లి మాత్రం విప్లవంలో ప్రజల కోసం ఒరిగిన తన ఇద్దరు బిడ్డలు మెరికల్లాంటోళ్ళు, మేలైనోళ్ళని మాతృత్వ సహజ నియమాలను రద్దు చేసుకొని చెబుతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఆ బిడ్డలు అమరులయ్యారు కాబట్టి అలా అంటుందా, లేక వాళ్ళు విప్లవంలో భాగమయ్యారు కాబట్టి అంటుందా? ఈ ప్రశ్నలు నా మెదల్లో సుడులు తిరుగుతుండగానే "సరే అమ్మ, మెరికల్లాంటి నీ పిల్లల విప్లవానికి అందిచ్చినవ్. కాని ఇప్పుడు పార్టీ మీ దగ్గర లేదు. ఊర్లల్ల మొత్తం పరిస్థితులన్నీ మారిపోతున్నయ్. ఇంకా ఏం ఆశ వుంది విప్లవం వస్తదని?ʹ అడిగిన.

"ఏం మారింది కొడుక. దొంగలు మారిండ్రా, దోపిడీ మారిందా? ఎవరికన్న కొత్తగ భూములొచ్చినవా? కొలువులొచ్చినవా? అంతా మారింది మారింది అని ఊదురగొడుతుండ్రు కాని ఏమి మారలే. ఇంకా రెక్కాడితెనే ఇంత ముద్ద దొరుకుతుంది. ఇప్పుడు పార్టీ లేదు నిజమే. మస్తు బాధ పడుతున్నం. కాని మళ్ళీ వస్తది. ఇవ్వాల కాకపోతె రేపైనా వస్తది."

ఆ తల్లికి విప్లవం మీద ఉన్న విశ్వాసానికి ఆశ్చర్యం వేసి మరో ప్రశ్న అడిగిన.

"మీరేమో పార్టీ తప్పకుండ మళ్ళీ మీ ఊర్లకు వస్తదని అంటుండ్రు. కాని, అది నక్సల్బరీలో పోయింది, శ్రీకాకులంలో పోయింది, తెలంగాణలో పోయింది, మళ్ళీ వస్తదని మీ నమ్మకం ఏంటి?"

నా ప్రశ్న పూర్తి కాకముందే తను మాట అందుకుంది.

"ఒక్క మాట చెబుత ఏమనుకోవు కదా బిడ్డా" అంది.

"చెప్పమ్మా, నువ్వు చెప్పాల్సింది ఏదైనా చెప్పు. ఏమి అనుకోను" అని అనగానే

"నీ ధ్యాసంతా పోయినదాని మీదనే వుంది కాని, ఒక్కాడ పోయిన ప్రతిసారి ఇంకోకాడ పుట్టుకొచ్చింది కదా. విప్లవానికి చావే లేదు. అదెందుకు చూస్తలేవు? "

ఆ మాట వినగానే ఇందుకే కదూ ప్రజలే నిజమైన మేధావులని అనేది అనిపించింది. తెలుగు సమాజంలో ʹమేధావి ʹ అనే పదాన్ని ఎంత ఉచితంగా వాడుతున్నారో కదా! పెద్ద పెద్ద భుజకీర్తులతో ఊరేగే ఎంత మంది మేధావులకు ఈ విప్లవ చలన సూత్రం అర్థమవుతది.

ఇంకా ఆ తల్లి చెబుతనే వుంది. "మళ్ళీ పార్టీ వస్తదని నమ్మకం ఉంది. చీకటి కొన్నాల్లు. వెన్నెల కొన్నాల్లు. విప్లవం కూడ అంతె. నేను మాత్రం ఎవరైనా మనోళ్ళు వస్తె వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్న. దాని కోసమే బతుకుతాన్న. వీలొచ్చి భయపెట్టిస్తరు, వాలొచ్చి భయపెట్టిస్తరని బుగులేమి లేదు. పోలీసోలొస్తరని భయమేమి లేదు. కొడితె నాలుగు దెబ్బలు కొడుతరేమో. తిడితె నాలుగు తిట్లు తిడుతరేమో. తీస్తె పానం తీస్తరేమో. పోతెపొయ్యింది. అంతకన్న ఎక్కువేం చేస్తరు."

...

అమరుల త్యాగాలను తమ గుండెల్లో పదిలంగ దాచుకొని వారి స్వప్నాలను నిజంచేసే విప్లవకారుల కోసం తెలంగాణ గడ్డ మీద ఎదురుచూస్తున్న తల్లులు ఎందరో! విప్లవానికి మరణం లేదని ఎలుగెత్తి చెప్పే ఆ తల్లుల విశ్వాసమే అమరులకు నిలువెత్తు నివాళి!
- అశోక్ కుంబము

Keywords : maoists, warangal, martyrs, police, fake encounter
(2024-04-24 18:07:55)



No. of visitors : 3561

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹఅన్నలు