include 'men';
?>
సోన్ భద్ర నరమేధం వెనక అసలు నిజాలు...కీలక పత్రాలు మాయం చేసిందెవరు ?
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్రలో10 మంది ఆదివాసులను దుర్మార్గంగా కాల్చి చంపిన సంఘటన ఈ దేశ ప్రజలని నివ్వెర పోయేట్టు చేసింది. గ్రామ ప్రధాన్ యజ్ఞదత్ తన అనుచరులు చేసిన ఈ నరమేధం వెనక అనేక సంవత్సరాల కుట్ర దాగి ఉన్నది. ఆదివాసులపై తరతరాలుగా సాగుతున్న దోపిడీ, అణిచివేతల కొనసాగింపుగానే సాగిందీ నరమేధం. ఈ దేశంలో ఆదివాసుల భూములను అటు ప్రభుత్వాలు ఇటు భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళను నిర్వాసితులుగా మార్చి అడవికి దూరంచేసి హత్య చేసే కుట్రల్లో భాగంగానే ఈ నరమేధం జరిగిందన్నది అర్దమవుతోంది.
ఇంత దుర్మార్గం జరిగాక ఇప్పుడు అధికారులు ఈ భూమి డీల్ ఫైలు మాయమయ్యిందని ప్రకటించారు. 200 పైగా ఎకరాల అటవీ భూమి ఒక ఐఏఎస్ అధికారి స్థాపించిన ట్రస్ట్ కు ఎలా వెళ్ళిందన్న డాక్యుమెంట్లు ఇప్పుడు మాయమయిపోయాయి.
1950లో సుమారు 600 బిగాల( దాదాపు 200 ఎకరాల పైన) భూమిని జమీందారీ నిర్మూలన , భూ సంస్కరణల చట్టం కింద బంజరు భూమిగా ప్రకటించింది ప్రభుత్వం. అనంతరం ఆ ప్రాంతంలోని ఆదివాసీలు (గోండ్లు) మూడు తరాలుగా ఆ భూమిని సాగు చేసుకొంటున్నారు. ఈ 600 బిగాల అధికారిక పత్రాలలో గ్రామ సభ భూమిగా నమోదు చేశారు. 1955లో, సుమారు 463 భిగాల భూమిని బీహార్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి ప్రభాత్ కుమార్ మిశ్రా కు చెందిన ఆదర్శ్ సహకారి సమితి ట్రస్ట్ కు బదిలీ చేశారు. ఈ ట్రస్ట్ లో ప్రభాత్ కుమార్ మిశ్రా మామ మహేశ్ మిశ్రాను ప్రెసిడెంట్గాను, అతని భార్య, కూతురిని ఆఫీసు బేరర్లుగాను నియమించారు. 1989 లో సిన్హా మరణం తరువాత, సుమారు 200 బిగాల భూమిని సిన్హా కుమార్తె, మిశ్రా భార్య అయిన ఆశా మిశ్రా, మనువరాలు వినీత పేరుతో బదిలీ చేశారు. అటవీ భూములు ఆదివాసులు తప్ప ఇతరులు కొనడానికి హక్కులేదన్న చట్టాలుండగా ఇలా ఓ ఐఏఎస్ ఎలా స్వంత చేసుకోగలిగాడు ?
అయితే 2017లో ఈ భూమిని గుజ్జర్ కులానికి చెందిన గ్రామ ప్రధాన్ యజ్ఞదత్తో పాటు మరో 10 మందికి రూ.2 కోట్లకు అమ్మారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా దత్ ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ భూమి తమదంటూ దత్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేంచిన గోండ్లు, 2017 ఒప్పందం చట్టవిరుద్ధమంటూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పలు కేసులు నమోదయ్యాయి.
అయితే జూలై 6 న, 32 ట్రాక్టర్లు, 300 మంది గూండాలను వెంటేసుకొని దత్ భూమికి మీదికి వచ్చి దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. ఆదివాసులు దీని అడ్డుకోవడంతో గూండాలు ఆదివాసులపై దుర్మార్గంగా దాడి చేశారు. కర్రలతో తలలు పగులగొట్టారు. బరిశెలతో పొడిచారు. చివరికి తుపాకులతో పది మంది ఆదివాసులను కాల్చి చంపారు. ఈ సంఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. పచ్చటి ఆ నేలంతా ఆ గోండుల నెత్తురుతో ఎర్రబారింది. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడికి రాలేదు. వాళ్ళకు తెలిసీ రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇంత జరిగినా ఏ మీడియా ఈ దుర్మార్గాన్ని చూపలేదు. ఏ పత్రికా రాయలేదు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయిన తర్వాత మీడియాకూడా రాయడం మొదలుపెట్టింది. మరో వైపు ప్రభుత్వం ఐదు రోజుల దాకా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి ఎవరినీ వెళ్ళనివ్వలేదు. చివరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని కూడా సోన్ భద్ర వెళ్ళకుండా ప్రభుత్వం అడ్డుకుంది. పైగా ఈ మారణ హోమానికి గత కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల ప్రభుత్వాలే కారణమని ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపణలకు దిగాడు. ప్రభుత్వం పై అన్ని వైపుల నుండి విమర్షలు రావడంతో చివరకు అధికారులతో ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నాడు ముఖ్యమంత్రి.
ఈ నరమేధానికి కారణమైన ఈ భూమికి సంబంధించి అసలు డాక్యుమెంట్లు మాయమయ్యాయి అని తేల్చి చెప్పిన కమిటీ కూడా చేతులు దులుపుకుంటుంది. అడవుల్లో నుండి ఆదివాసులను వెళ్ళగొట్టి ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్లకు దోచి పెట్టాలన్న కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాల కుట్రకు ఈ సంఘటన కొనసాగింపుగా అనిపించడం లేదా ?
Keywords : son bhadra, uttara pradesh, adivasi, gond, yogi adityanath,
(2024-04-24 18:06:20)
No. of visitors : 1607
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..