ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

ʹరోళ్ళగడ్డ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం రోళ్ళగడ్డ అడవి ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరి పై సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి హత్యానేరం కేసు నమోదు చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావులు మీడియాకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం ....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం రోళ్ళగడ్డ అడవి ప్రాంతంలో నిన్న ఉదయం 11 గంటల‌ ప్రాంతంలో పోలీసులకు సీపీ.ఐ.ఎమ్.ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు లింగన్న దళానికి పోలీసులకు ఎన్ కౌంటర్ జరిగినట్టుగా అందులో లింగన్న మృతి చెందినట్టుగా పోలీసులు ప్రకటించారు. . కానీ ఉదయం 7 గంట‌ల ప్రాంతంలోనే లింగన్న‌ దళాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా లింగన్న స్వంత గ్రామమైన రోళ్ళగడ్డకు చెందిన వారి బంధువులు చెబుతున్నారు. ఉదయం 11 గంటల లోపే లింగన్న పోలీసుల అదుపులో ఉన్నట్టు అన్ని టీవీ ఛానళ్ళలో స్క్రోలింగ్ లు వచ్చాయి. కానీ ఎస్ పి అంబర్ కిషోర్ ఝా ఘటనా స్థలానికి చేరుకొని ఎన్ కౌంటర్ చెయీంచి నట్టుగా, అందులో లింగన్న మృతి చెందినట్టుగా వారి బంధువులు మాకు తెలియజేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న లింగన్న దళాన్ని కోర్టులో హాజరు పర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూనే అందులో నరేష్ అనే డివిజనల్ కమిటీ స్థాయి వ్యక్తి ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వీరందరికి ప్రాణాపాయం వున్నందున వెంటనే కోర్టులో హాజరు పర్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము, స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఇంకా నలుగురు కార్యకర్తలు పోలీసుల అదుపులో వున్నారు. మధ్యాహ్నం వరకు పోలీసులు అదుపులో వున్న లింగన్నఎన్ కౌంటర్లో పాల్గొనడం అనేది పూర్తిగా హాస్యాస్పదం. కాబట్టి లింగన్నను ఎన్ కౌంటర్ పేరుతో పోలీసులే హత్య చేసారని స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. గత 50 ఏళ్ళుగా దేశంలో నక్సల్బరి, శ్రీకాకుళం పోరాట నేపథ్యంలో ప్రజల కోసం ప్రజా ఉద్యమకారులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, ఆ ఉద్యమకారులపై జలగం వెంగళరావు ప్రభుత్వం మొద‌లు ఇప్పటి దాకా ప్రభుత్వాలన్నీ ఎన్ కౌంటర్ల‌ పేరుతో హత్యలు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మధుసూదనరాజ్ హత్య, నల్లమల మాధవ్ తో పాటు 8 మంది ఎన్కౌంటర్ పై ఒక దశాబ్దకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపోరాటం చేసి 2009, ఫిబ్రవరి 6న ఎన్ కౌంటల్లో పాల్గొన్న పోలీసులపై 302 హత్యానేరం కేసు నమోదు చేయాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ అధికారుల సంఘం ప్రభుత్వం కలిసి సుప్రీంకోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నది. ఇదీ ఎనీకాంటర్ హత్యలపై మహారాష్ట్రకు చెందిన పి.యు.సి.ఎల్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పులో కూడా16 మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. అందులో ప్రధానమైంది ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 హత్యానేరం కేసు నమోదు చేయాలనే ప్రధానంగా ఉంది. ఈ నెల 18న సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును కాద‌ని 2014లో పి.యు.సి.ఎల్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును ప్రధానం చేసింది. అందులో భాగంగానైన 2014 నుంచి కూడా అనేక ఎన్కౌంటర్ హత్యలు జరిగినప్పటికీ పోలీసులపై 302 హత్యానేరం కేసు నమోదు కాలేదు. ఇప్పుడు హత్య గావించబడిన లింగన్న విషయంలోనైనా స‌రే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. అంతేకాక సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎనీకౌంటర్లో మరణించినట్టుగా చెప్తున్న లింగన్న మృతదేహాన్ని భద్రపరచాలని, నిపుణులైనా ఫోరెన్సిక్ వైద్య బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా టి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Keywords : bhadradri kottagudem, linganna, fake encounter, cpi ml new democracy
(2024-07-26 06:00:45)



No. of visitors : 3484

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹరోళ్ళగడ్డ