భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర‌ ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్

భిన్నాభిప్రాయాలపై

ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని తుడి చిపెట్టే అధికారాన్ని పొందినట్టు కాదని స్పష్టం చేశారు. బెంగాల్‌లో కమ్యూనిస్త్టుల‌ ప్రాబల్యం తగ్గిపోవడంతో మత వైషమ్యాలు పెరుగుతున్నా యని అన్నారు. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమర్త్యసేన్‌ ʹఆన్‌ బీయింగ్‌ ఎ బెంగాలీʹ అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న మెజారిటేరియన్‌ విధానాల వల్లే భిన్నాభిప్రాయాలు కలిగి ఉండే స్వేచ్ఛ కుచించుకుపోతున్నదని చెప్పారు. అయితే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై జరుగుతున్న దాడులకు గట్టి ప్రతిఘటన వస్తున్నదని, ప్రతిఘటించేందుకు ప్రాణాలను త్యాగం చేసేందుకైనా సిద్ధమయ్యే ప్రజలున్నారని తెలిపారు. హేతువు (రీజన్‌) బలంగా లేకుంటే ఫాసిస్టు భావజాలం వేగంగా వ్యాపిస్తుందని అన్నారు. 1940వ దశకంలో బెంగాల్‌లో మత అల్లర్లు వ్యాప్తి చెందేందు కు హేతువు లోపించడమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శాంతినికేతన్‌ విద్యార్థి ఆనంద్‌ పట్వర్దన్‌ నిర్మించిన ʹరీజన్‌ʹ సినిమాను ప్రస్తావించారు. తన తాతయ్య క్షితిమోహన్‌ సేన్‌ సంభాషణను అమర్త్య సేన్‌ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఢాకా బిక్రంపూర్‌లోని సోనాగావ్‌లో కొన్నేండ్ల క్రితం ఓ మౌల్వీ ఓ హిందు నివాసిని తేనీటి విందుకు ఆహ్వానించాడని చెప్పారు. తేనీటిని స్వీకరిస్తున్నప్పుడు వారి ముందు నుంచి వెళ్తున్న ఓ హిందూ పూజారినీ తేనీటికి ఆహ్వానించగా.. ఆయన తాను పవిత్రమైన హిందువుడని చెబుతూ తిరస్కరించాడని వివరించారు. వెంటనే ఆ మౌల్వీ నవ్వుతూ నీవు నేను ఒకటేనంటూ వివరించాడని చెప్పారు. పూజారివైన నీవు హిందువుల మేలు కోరి పూజలు చేస్తే.. నేను ముస్లింల కోసం ప్రార్థిస్తానని చెప్పాడని తెలిపారు. బెంగాల్‌లో ఎంత బహుళత్వమున్నా తామంతా ఒకటేనన్న భావన ఉండేదని అన్నారు. బ్రిటీషర్లు వారి అవసరం కోసం మత వైషమ్యాన్ని రేకెత్తించారని చెప్పారు. బ్రిటీషర్ల కాలంలోనే భూములను జమీందార్లకు అప్పజెప్పారనీ, సుల్తాన్‌లు లేదా నవాబ్‌ల కాలంలో పాలకులు వారి సొంత మతస్తులకూ భూములను కట్టబెట్టలేదని గుర్తుచేశారు. అసలు రామాయణ, మహాభారతాలను బెంగాలీలోకి అనువదించే పనిని ముస్లింపాలకులే పురమాయించారన్న సత్యాన్ని మరువరాదని తెలిపారు. బెంగాల్‌ స్వతంత్ర నవాబ్‌ సిరాజుద్దౌలా కీలక బృందంలో నలుగురు హిందువులుండగా.. ఇద్దరే తన మతస్తులుండేవారని చెప్పారు. బెంగాలీలో ఠాగూర్‌ తర్వాత ఖాజీ నజ్రుల్‌ పద్యాలే ఎక్కువ ప్రాచుర్యమున్నవని అన్నారు. ఆయన సామ్యవాద ఆలోచనలు కలిగి ఉండేవాడని, బెంగాలీ భాషలోకి కారల్‌ మార్క్స్‌ జీవిత చరిత్రను అందించినది ఆయనే అని చెప్పారు.
(నవతెలంగాణ సౌజన్యంతో)

Keywords : west bengal, amartyasen, bjp, trunamul congress, communists
(2024-04-13 13:06:28)



No. of visitors : 1228

Suggested Posts


కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ

జాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు.

అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌

సిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం

కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి

అమరుడు కిషన్ జీ నాయకత్వంలో పీడితులు మహత్తర పోరాటాలు చేసిన పశ్చిమ బెంగాల్ జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ అగ్గి రాజుకుంటోంది. జంగల్ మహల్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ లు తీవ్రతరం చేశారు.

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.

విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణ‌

ప్రజా ఉద్యమ కార్యకర్త, విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి.

జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటన‌

జైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం.

కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త

Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం

సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మహిళా విభాగం ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఎయిర్‌వో) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షర్మిస్ట ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందుతూ ప్రగతిశీల మహిళా సంఘం

బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు

ప‌శ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామం బ‌రోమాసియాకు చెందిన సునీతా హ‌న్స్ధా ఇప్పుడు గుండె ప‌గిలి ఏడుస్తున్న‌ది. త‌ర‌త‌రాలుగా ఆ భూమిపై వ్య‌వ‌సాయం చేస్తూ ‌తుకున్న త‌మ‌ను భూమిని వ‌దిలి వెళ్లిపోవాల‌ని అంటున్నార‌ని క‌న్నీరు పెట్టుకుంటున్న‌ది.

UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది

అక్టోబర్ 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో, రాజకీయ కార్యకర్త టిప్పు సుల్తాన్‌ను శాంతినికేతన్‌లోని గురుపల్లిలో వున్న అతని ఇంటి నుండి పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భిన్నాభిప్రాయాలపై