ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్

ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని

మన దేశంలో దేశ ద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని, దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ప్రలీన్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన లాయర్స్ వర్క్ షాప్ లో ʹదేశ‌ద్రోహ చట్టము... ‍భావ ప్రకటనా స్వేచ్చʹ అనే అంశంపై జస్టిస్ గుప్త ప్రసంగించారు.

ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని, చివరకు ఆర్మీని కూడా విమర్శించడం దేశద్రోహం కాదని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. విమర్శలు చేసినవారందరిపై కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే భారత దేశం పోలీసు రాజ్యంగా మారుతుంది కానీ ప్రజాస్వామ్య దేశంగా మనలేదన్నారు. భావప్రకటనా స్వేచ్చకు విలువనిచ్చే చాలా దేశాలు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసాయని చెప్పిన జస్టిస్ గుప్తా మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన అధికరణం19(1) భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తుందని తెలిపారు. అధికరణం 21 ప్రకారం ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని తెలిపారు అధికరణం 25 మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని ఆయన తెలిపారు ఎవరికి ఇష్టమైన విశ్వాసాలను వారు ఆచరించేందుకు ప్రచారం చేసుకునేందుకు ఈ అధికారులు హామీ ఇస్తుందని భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇచ్చిన తర్వాత ఆషామాషీగా దేశద్రోహం కేసు నమోదు చేసిన మాత్రాన అది చెల్లుబాటు కాదని ఆయన స్పష్టం చేశారు.
వ్యక్తులే వ్యవస్థలు కాదని, దేశం అంటే ఓ వ్యక్తి కంటే ఎంతో పెద్దది అని చెప్పిన గుప్తా అత్యవసర పరిస్థితి( ఎమర్జన్సీ)కాలంలో 1975, 77ల్లో ఓ పార్టీ అధ్యక్షురాలు దేశానికి నాయకురాలిగా వ్యహరించారని, అప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగిందని అయితే ఆ ప్రయత్నం విఫలం అయిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆ ప్రయత్నం ఎవరు చెయ్యబోరన్న నమ్మకం తనకు ఉందని అన్నారు దేశం అంటే ఓ వ్యక్తి కంటే ఎంతో పెద్దది అని ఆయన అన్నారు.

మనం సమస్యలని లేవనెత్తకపోతే, పాతబడిపోయిన వ్యవస్థలని ప్రశ్నించకపోతే కొత్త వ్యవస్థలను నిర్మించలేం. బుద్దుడు, జీసస్ క్రైస్ట్, కబీర్, రాజారాంమోహన్ రాయ్, స్వామీ దయానంద సర్స్వతి, కార్ల్ మార్క్స్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రశ్నించడం ద్వారానే కొత్త దారులు వేశారని జస్టిస్ గుప్తా అన్నారు.
(inputs: indianexpress.com, deccanherald.com, scroll.in, livelaw.in)

Keywords : Justice Deepak Gupta , Supreme Court judge, sedition
(2024-04-24 17:49:42)



No. of visitors : 1308

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని