కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఫోన్ల సేవలు ఆపేసినప్పటికీ బీజేపీ వాళ్ళకు మాత్రం అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. బిజెపి సభ్యులకు పత్రికా ప్రకటనలు ఇవ్వడానికి వారి ప్రధాన కార్యాలయానికి మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ (ఎంఎఫ్సి) నుండి నివేదికలను పంపడానికి నిరంతరం నెట్ సదుపాయం కల్పించబడింది. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ సెంటర్ లోకి జర్నలిస్టులకంటే బీజేపీ నాయకులకే అధికారులు సాదర స్వాగతం కల్పిస్తున్నారు.
ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని ప్రభుత్వం రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నాటి నుండి లోయలో ఇంటర్నెట్ షట్ డౌన్ విధించబడింది. చాలా కాలంపాటు జర్నలిస్టులకు తమ వార్తలను పంపించే అవకాసం కూడా లేక పోవడంతో ప్రభుత్వం శ్రీనగర్ లో సోన్వర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హోటల్లో మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ (ఎంఎఫ్సి) ని ఏర్పాటు చేసింది.
ఈ కేంద్రంలో మొదట నాలుగు కంప్యూటర్లు మరియు ఒక మొబైల్ ఫోన్లు ఏర్పాటు చేశారు. గత వారం, ప్రభుత్వం మరో ఐదు కంప్యూటర్లను ఏర్పాటు చేసింది, వాటిలో ఒకటి మహిళా జర్నలిస్టుల కోసం మాత్రమే.
కాశ్మీర్లోని మొత్తం జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రస్తుతం కథనాలను దాఖలు చేయడానికి ఈ ఫెసిలిటేషన్ సెంటర్పైనే ఆధారపడుతోంది. జర్నలిస్టులు వారి పేర్లు మరియు ఆధారాలను నమోదు చేసిన తరువాత ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. జర్నలిస్టులకు కంప్యూటర్ 15 నిమిషాలు,మొబైల్ ఫోన్ అతి కొద్ది నిమిషాలు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఇస్తున్నారు. జర్నలిస్టులు వారి కథనాలు, ఫోటోలను ముందుగానే పెన్ డ్రైవ్లలో తీసుకొచ్చి ఇక్కడి నుండి వాటిని తమ న్యూస్రూమ్లకు పంపుతారు. వీరూ రోజూ వచ్చే జర్నలిస్టులైనా సరే వీళ్ళను భద్రతా అధికారులు అణువణువు చెక్ చేస్తారు. ఒకటికి పది సార్లు ఐడి రుజువులను అడుగుతారు.
ఈ అవకాశాన్ని కశ్మీర్ ప్రజలు కానీ రాజకీయ పార్తీలు కానీ వినియోగించుకునే అవ్కాశం లేదు. ఒక్క బీజేపీకి తప్ప. బిజెపి రాష్ట్ర యూనిట్ కూడా ఈ సౌకర్యాన్నిప్రతి రోజూ జర్నలిస్టులకన్నా ఎక్కువగా ఉపయోగిస్తోంది. కేంద్రంలో ఉన్న జమ్మూ కశ్మీర్ సమాచార విభాగానికి చెందిన ఐదు నుండి ఆరుగురు అధికారులు, బిజెపి ఆఫీసు బేరర్లను స్వాగతించడమే కాకుండా, ఖాళీగా ఉన్న కంప్యూటర్లను వినియోగించుకోవడానికి వారికి అన్ని విధాలా సహకరిస్తారు. అంతే కాదు చాలా సార్లు జర్నలిస్టులను కంప్యూటర్ల ముందునుండి లేపి బీజేపీ నాయకులకు అక్కడ బీజేపీ నేతలను కూర్చోబెడతారు.
అధికారుల అనుమతితో ఆగస్టు 9 నుంచి ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నట్లు కాశ్మీర్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అశ్వని కుమార్ చ్రుంగూ న్యూస్ 18 కి చెప్పారు.
ʹకశ్మీర్ లో ఇంటర్నెట్ అందుబాటులో లేనందున, మేము కాశ్మీర్ నుండి పార్టీ ప్రకటనలను పంపలేము. అందువల్ల ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవడాకి నన్ను అనుమతించమని నేను అధికారులను కోరాను అందుకు అధికార్లు ఒప్పుకున్నారుʹఅని అతను శనివారం న్యూస్ 18 కి చెప్పాడు.
కశ్మీర్ పరిస్థితిపై తన జాతీయ నాయకులకు క్రుంగూ ప్రతి రోజూ నివేదికలను పంపుతుంటారు. "అంతర్జాతీయ మీడియా కాశ్మీర్ పై చాలా ప్రతికూల విషయాలను చెబుతోంది అందువల్ల నేను ఇక్కడ నుండి కౌంటర్ రిపోర్టులను పంపుతున్నాను, అంతర్జాతీయ మీడియా అబద్దాలను ఛేదింసడానికి మా పార్టీ నాయకులకు నా రిపోర్టులు ఎంతగానో ఉపయోగపడటాయి.ʹ పార్టీ అని క్రుంగూ చెప్పారు.
(మీడియా సెంటర్ లో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ చ్రుంగూ)
కాశ్మీర్లోని చాలా రాజకీయ పార్టీలు తమ పార్టీ కేడర్ నిర్బంధంలో ఉన్నందున తమ ప్రకటనలను ప్రెస్కు పంపించలేకపోతున్నాయి. ఎవరైనా మాట్లాడాలనుకున్నా, వారి సమస్యలను తెలియజేయడానికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు.
మరో వైపు కాశ్మీర్లోని జర్నలిస్టులు తమ కార్యాలయాల్లో లేదా కనీసం కాశ్మీర్ ప్రెస్ క్లబ్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అనుమతించలేదు.
జర్నలిస్టులు దీనిని ʹక్రూరమైన జోక్ʹ గా వర్ణిస్తున్నారు "మేము ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళం. ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి మేము ప్రతిరోజూ ఇక్కడి దాకా రావాలి అతి తక్కువ సమయం మాకు అవకాశం ఇస్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఎలా అవకాశం ఇస్తుంది?" అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు
ʹఇది మా పనిలో చొరబాటు మీడియా కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ను వినియోగించుకోవడానికి ఓ రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తే మరి సాధారణ ప్రజలేం పాపం చేశారు. వాళ్ళకు కూడా అవకాసం ఇవ్వాలి కదాʹ అని శ్రీనగర్ కు చెందిన జర్నలిస్ట్ అనీస్ జర్గర్ అన్నారు.
కాగా ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి జమ్మూకశ్మీర్ సమాచార శాఖ డైరెక్టర్ సయ్యద్ సెహ్రిష్ అస్గర్ నిరాకరించారు.
(Source: news18.com)
Keywords : kashmir, jammu, srinagar, journalists, bjp
(2024-03-13 20:34:05)
No. of visitors : 1064
Suggested Posts
| పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటుపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి..... |
| మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలుభద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో.... |
| అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామాఅతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు.... |
| మానసిక సమస్యలతో కశ్మీర్ ప్రజలు - నిండిపోతున్న ఆసుపత్రులుప్రజలు మానసిక జబ్బుల భారిన పడుతున్నారు. మతిస్తిమితం కోల్పోవడం, తీవ్ర ఆందోళనకు గురవ్వడం, విపరీతంగా భయాందోళనలతో రోధిస్తూ పలువురు అపస్మారక స్తితికి చేరుకుంటున్నారు. గడిచిన 12 రోజుల్లో... మానసిక సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని SHMS ఆసుపత్రి వైద్యులు |
| కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి.. కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది. |
| పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్పీఎఫ్పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్పీఎఫ్ జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు.... |
| కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే. |
| కాశ్మీర్ లో మరో సాల్వజుడుంఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు..... |
| దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మిఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే..... |
| సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?26 ఏండ్ల ఫరూఖ్ అహ్మద్ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ..... |