ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !

ఈ

తరతరాలుగా తెలంగాణ తనపై జరిగే అన్యాయాలపై పోరాడుతూనే ఉన్నది. నియంతృత్వాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటం నీళ్ళూ, నిధులూ, నియామకాల కోసమే కాదు ప్రజాస్వామ్యం కోసం కూడా ఆ పోరాటానికి నాయకత్వం వహించానని, తమది ఉద్యమ పార్టీ అని ప్రతిరోజూ జబ్బలు చరుచుకునే టీఆరెస్ పాలన సమైక్య రాష్ట్రపాలకన్నా కొత్తగా ఏమీ లెదని ప్రతీ రోజూ నిరూపిస్తూనే ఉన్నది. ప్రశ్నించే, నిరసన తెలిపే గొంతులను నులుమడానికి ప్రతి రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నది. భిన్నాభిప్రాయాలకు స్థానంలేక పోతే ప్రజాస్వామ్యమే కాదని టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ స్టేజీల‌ మీద ఉపన్యాసాలు దంచుతాడు మరో వైపు చిన్న సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వది హైకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ప్రజలను అరెస్టులు చేస్తూ సభను జరగనివ్వరు. ఇదీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం.

ఆదివాసుల పోడు హక్కుల కోసం వరంగల్ లో సభ పెట్టాలనుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆ సంఘం హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ రోజు హన్మకొండలో సదస్సుకు ఏర్పాటు చేసుకున్నది ప్రజాఫ్రంట్. అయితే ఆ సదస్సును జరగనివ్వకుండా తెల్లవారుజామునుండే అరెస్టులు మొదలుపెట్టారు పోలీసులు. సదస్సుకు వస్తున్న ప్రజలను అనేక చోట్ల అరెస్టు చేశారు. స్పీకర్ లను శ్రోతలను అన్ని చోట్ల అరెస్టు చేశారు. హాలు నిర్వాహకులను బెదిరించారు. తెలంగాణ ప్రభుత్వపు ఈ అప్రజాస్వామిక దుర్మార్గపు చర్యపై తెలంగాణ ప్రజాఫ్రంట్ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

పత్రిక ప్రకటన
తేదీ. 25 సెప్టెంబర్, 2019.

పోలీసు నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండించండి.
ఆదివాసీ, పోడు రైతుల హక్కులకై పోరాడుధాం.

ఈరోజు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో హన్మకొండ పట్టణంలో ఏకశిలా పార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి నిరాకరించడంతో సదస్సు గా మార్చుకోవడం జరిగింది.

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో సదస్సు కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదని హాలు నిర్వాహకులను పోలీసులు రాత్రి బెదిరించారు.

ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి వివిధ జిల్లాలలో నుండి వస్తున్న ప్రజలను బెదిరించడం జరిగింది అనేక మంది కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టు చేశారు ఈ అరెస్టు లను తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.

అరెస్టు అయిన వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అద్యక్షులు రవి చంద్ర, ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, ఉపాధ్యక్షుడు నలమాసకృష్ణ, ఉపాధ్యక్షులు రమాదేవి, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు మద్దిలేటి, సందీప్, tpf అర్బన్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ , కార్యదర్శి రంజిత్, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు శాంతక్క, tpf వరంగల్ జిల్లా నాయకులు మురళి, ఉమక్క, pdm జిల్లా అధ్యక్షులు క్రాంతి, tvv నాయకులు సూర్యం,గణేష్, గోపి, tpf గట్ల నర్సింగపూర్ మెరుగు రాజన్న, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజు, తెలంగాణ రైతాంగ సమితి నాయకులు ప్రసాద్ తొపాటు కన్నారం గ్రామ ప్రజలు 20 మంది, tpf పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొమురయ్య, tpf కార్యదర్శి భానోత్ రామారావు, హైదరాబాద్ tpf నాయకులు రాంబాబు, హరికృష్ణ, జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల వెంకన్న, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జైపాల్ మొదలయిన వారిని అరెస్టు చేసి ఖాజీపేట, హసన్ పర్తి, కాకతీయ యూనివర్సిటీ , సుభేదారి, హన్మకొండ మొదలైన పోలీస్ స్టేషన్ లలో మొత్తం 150 మందిని నిర్బంధించారు.

అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని tpf రాష్ట్ర కమిటీ
డిమాండ్ చేస్తోంది.

ఏజెన్సీలో ఆదివాసిల చేతుల్లో ఉన్న భూములను గుంజుకుని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తుంది.

ఉద్యమాభివందనాలతో..
తెలంగాణ ప్రజా ఫ్రంట్.
రాష్ట్ర కమిటీ

Keywords : telangana praja front, warangal, police, trs, arrest
(2024-04-24 17:45:17)



No. of visitors : 1088

Suggested Posts


ప్రత్యామ్నాయ గొంతు వినిపించడం నేరమా...మా నాన్నను వెంటనే విడుదల చేయాలి...నల‌మాస కృష్ణ కూతురు

ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్ ఐ ఏ అరెస్టు చేసింది. అనారోగ్యంతో ఉన్న కృష్ణ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉ౦డగా ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హాస్పటల్ లోకి వెళ్ళిన ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్టు చేశారు.

నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి

బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై రెండు నుండి నాలుగు వరకు 72 గంటల జాతీయ, విప్లవ కార్మిక సంఘాల సమ్మె పిలుపునకు టి పి ఎఫ్ తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ