50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
క్లిష్ట సమయంలో కవులు, కళాకారులు మౌనం వహించడం సరైంది కాదన్నారు ప్రముఖ కవి కె. శివారెడ్డి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానము కేంద్రంలో జరుగిన విప్లవ రచయితల సంఘం 27వ మహాసభల రెండో రోజు సభల్లో ఆయన ప్రసంగించారు. ఈనాటి స్థతికి కారణం మనువాద వ్యవస్థ పునాదుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వాదుల మౌనం, నిష్క్రియాపరత్వం మరో కారణం అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ దేశంలో ధిక్కారం బ్రతికే ఉన్నదనటానికి విరసం ఆచరణే రుజువని అన్నారు. పోరాట సమూహాల మద్దతుగా గొంతునిచ్చే విరసం గొంతు నొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని.. ఈ సందర్భంలో ఆలోచనాపరులైన రచయితలంతా విరసానికి తమ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రచన పరంగా యాభైఏళ్ల కాలంలో వాసిలోనూ రాసిలోనూ ఎంతో విస్తృతి సాధించిన, తనతో సహా ఎంతో మంది రచయితలను తీర్చిదిద్దిన విరసానికి జోహార్లు.. విరసంతోనే తామంతా ప్రయాణిస్తామని మద్దతు తెలిపారు.
విప్లవ సాహిత్యోద్యమం గురించిమట్లాడటం అంత సులువైన విషయం కాదని విరసం నాయకుడు ప్రొఫెసర్ సీ. కాశీం అన్నారు. యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమం అంశంపై ప్రొఫెసర్ సీ. కాశీం ప్రసంగించారు. విరసం 50 ఏళ్ల చరిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంతకంటే ఎక్కవ స్పూర్తి మంతమైన ప్రయాణం అని తెలిపారు. విరసం కార్యాచరణ ఈ ధిక్కార స్వరానికి మూలం, మనం చరిత్రను తరచిచూసుకుంటే తప్ప అర్ధం కాదని వివరించారు. రచయిత రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండడని.. రచన రాజకీయం వేరుకాదని అది నన్నయ కాలం నుంచినేటి వరకూ రుజువైతున్నదని అన్నారు. సమాజంలో నిశ్శబ్దం ఆవరించినప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డవాడే నిజమైన కవి, రచయిత అని ఆ ఒరవడిని దిగంబర, తిరగబడు కవుల మొదలు విరసం వరకూ కొనసాగిస్తున్నారుని, ప్రజాపోరాటాలను ఎత్తిపడుతూ అన్ని సాహిత్య ప్రక్రియల్లో విప్లవ సాహిత్యోద్యమం తన పాత్రను పోషిస్తోందని అన్నారు.
యాభై ఏళ్ల విరసం సభ వేదిక మీద నిలబడి మాట్లాడం ఒక ఉద్వేగాన్ని ఇస్తొందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించిన ప్రతిసారీ దాన్ని ఫాసిజం అని అంటూ ఉంటారు. కానీ నిజమైన ఫాసిజం అంటే.. ప్రజల మద్దతుతో ప్రజావ్యతిరేక పాలనను కొనసాగించడమే అసలైన ఫాసిజం అని వివరించారు.ఫాసిజం గురించి లోతైన అవగాహనతో ఉంటేనే దాన్ని సరిగా ఎదుర్కోగలమని చెప్పారు. ధిక్కారం ఎప్పుడూ సృజనాత్మకంగానే ఉంటుందని...కానీ ధిక్కారాని సరైన దారిలో మళ్లించాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంటుందని చెప్పారు. అలాంటి నాయకత్వం విప్లవ రచయితల సంఘం అందించాలని ఆకాంక్షించారు.
సంగిశెట్టి శ్రీనివాస్(సింగిడి), తైదల అంజయ్య (మరసం), భూపతి వెంకటేశ్వర్లు (తెలంగాణ సాహితి), శిఖమణి, కోడేపూడి నిర్మల, కేఎన్ మల్లీశ్వరి(ప్రరవే), నాళేశ్వరం శంకరం (తెరసం), రాపోలు సుదర్శన్ (అరసం) ఎన్. వేణుగోపాల్(వీక్షణం సంపాదకుడు), నల్లెల రాజయ్య (వరంగల్ రచయితల సంఘం), సీ. రామ్మోహన్ ( పాలమూరు అధ్యయన వేదిక), చమన్ ( తెలంగాణ చైతన్య సాహితి), సజయ, అల్లం రాజయ్యలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫాసిస్టు రాజ్య హింసకు వ్యతిరేకంగా రచయితలు ప్రజల గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు.
విరసం మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రొఫెసర్ హరగోపాల్, రత్నమాల, నల్లూరి రుక్మిణి, జి.కళ్యాణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పలు ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశారు. ఉరిశిక్షను, బూటకపు ఎన్ కౌంటర్ లను తాము వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. మహాసభల సందర్భంగా విప్లవ రచయిత సంఘం తన కొత్త కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సాహాయ కార్యదర్శి లతో పాటు కార్యవర్గాన్ని సర్వసభ్యసమావేశంలో ఎన్నుకున్నారు. ప్రజాకళామండలి కళాకారులు, బెంగాల్ లాల్ లాంతర్ కళాకారుల పాటలు ప్రేక్షకులను ఉత్తేజితులను చేశాయి
Keywords : virasam
(2024-04-24 17:20:48)
No. of visitors : 1385
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |