బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు తరుచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, మీ మౌనంతో అలాంటివారిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆర్థికవేత్త దేవకి జైన్, హక్కుల కార్యకర్తలు లైలా తయాబ్జీ, కమలా భాసిన్, మాజీ భారత రాయబారి మధు బాధురి తదితర ప్రముఖులు, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఏఐపీడబ్ల్యూఏ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) వంటి సంస్థలు సంయుక్తంగా ప్రధానికి బహిరంగ లేఖ రాశాయి.
ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ శ్రేణులు సృష్టించిన భయానక వాతావరణాన్ని చూసి కలత చెంది ఈ లేఖ రాస్తున్నామని.. దేశ పౌరులుగా, హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఆదివాసీ, దళిత మహిళల పక్షాన స్పందిస్తున్నామని పేర్కొన్నారు.
ʹమహిళలపై లైంగిక దాడులు జరుగుతాయంటూ బీజేపీ నేతలు తరుచూ తమ ప్రచారంలో హెచ్చరిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై హింసకు పాల్పడాలంటూ తమ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా మీరు (మోదీ) మౌనంగా ఉండి ఇలాంటి విద్వేష పూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా సమాజంలోని అన్ని వర్గాల మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారు.
ʹబీజేపీకి ఓటేయండి లేదంటే మీపై లైంగికదాడి జరుగుతుందʹనే సందేశాన్ని ఢిల్లీ మహిళలకు అందించాలని అనుకుంటున్నారా?ʹ అని ప్రధానిని ప్రశ్నించారు. షాహీన్బాగ్లో లక్షల మంది గుమిగూడుతున్నారని, వారు ఢిల్లీ ప్రజల ఇండ్లల్లోకి చొరబడి మహిళలపై అఘాయిత్యాలు చేసి, హత్యచేసే అవకాశం ఉన్నదంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ʹదేశంలోని మహిళలు, చిన్నారులందరికీ ముప్పు పొంచి ఉన్నదని మీరు చెప్పదలుచుకున్నారా?ʹ అని ప్రశ్నించారు.
బీజేపీ చేస్తున్న ఈ విద్వేష ప్రచారాన్ని చరిత్ర మరిచిపోదని, దేశ ప్రజలు మన్నించరని హెచ్చరించారు. ʹమీ పార్టీ సభ్యులు సృష్టించిన భయానక వాతావరణాన్ని దేశం మొత్తం చూస్తున్నది. మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితమై.. గత నెల 30న జామియా వర్సిటీ విద్యార్థులపై రామ్ భక్త్ గోపాల్ కాల్పులు జరిపాడు. ఈ నెల 1న మరో ఉగ్రవాది షాహీన్బాగ్లో మహిళలవైపు తుపాకీ పేల్చాడుʹ అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్వహించిన ఓ సభలో ʹదేశద్రోహులను కాల్చిపారేయండిʹ అంటూ నినాదాలు చేయడాన్ని, ʹచెప్తే మాటవినని వారికి బుల్లెట్లతో అర్థమయ్యేలా చెప్పండిʹ అంటూ యూపీ సీఏం యోగి ఆదిత్యనాథ్, ʹనిరసనకారులకు షాక్ తగిలేలా ఈ నెల 8న ఓటెయ్యాలిʹ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ప్రస్తావించారు.
నిరసన తెలుపుతున్న మహిళలను దేశద్రోహులుగా చిత్రీకరిస్తారా? అంటూ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపైకి కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతున్నదని, ఎంపీలు సాధారణ పౌరులను బెదిరిస్తున్నారని, కొందరు విద్వేష పూరిత ప్రసంగాలతో ప్రభావితులై హింస సృష్టిస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తాము తీవ్రం గా భయాందోళన చెందుతున్నట్టు చెప్పారు.
ʹసీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి గల కారణాలను మీ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే మేము చేస్తున్నాం. లక్షల మంది ఢిల్లీ మహిళలు ఉద్యమంలో పాల్గొనడంతోపాటు దానికి నేతృత్వం వహిస్తున్నారుʹ అని చెప్పారు.
మహిళలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తుంటే, వారిపై దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నారని, ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విద్వేషపూరిత ప్రసంగాలు, లక్షిత హింసపై ప్రధాని మోదీ తక్షణం స్పందించాలని, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించేలా, దేశంలోని మహిళల భద్రతకు భరోసా ఇచ్చేలా హుందాగా ఎన్నికల్లో పోరాడాలని కోరారు.
Keywords : delhi elections, bjp, Women Activists, Open Letter
(2024-04-24 17:09:42)
No. of visitors : 1530
Suggested Posts
| సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టుపౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. |
| నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులుఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు. |
| మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసిCAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది. |
| శాంతి ప్రదర్శనపై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులుఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై |
| CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారంపౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది. |
| స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసుపౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది. |
| బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న కోర్టుకర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. |
| CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శనలు ఆపక పోతే |
| కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడిజవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి.
బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు. |
| రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. |