స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !

స్వాతంత్ర్య

తమకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్న బీజేపీ నాయకులు.. స్వతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారినీ వదలడం లేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించిన‌ ఒక స్వతంత్య్ర సమరయోధుడిని కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ దారుణంగా అవమానించారు. ʹఆయనొక నకిలీ స్వతంత్య్ర సమరయోధుడనీ, అంతేగాక పాకిస్థాన్‌కు ఏజెంటుʹ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళ్తే.. బెంగళూరుకు చెందిన 102 ఏండ్ల హెచ్‌ఎస్‌ దొరెస్వామి స్వతంత్య్ర పోరాటంలో పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో ఒక ఏడాది పాటు జైళ్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు చేసిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. కొద్దిరోజులుగా ప్రధాని మోడీ పాలనపైనా విమర్శలు చేస్తున్నారు. దాంతో బీజేపీ నాయకులు ఆయనపై కక్షగట్టారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ బెంగళూ రులో నిర్వహించిన ఓ సభలో హక్కుల కార్యకర్త అమూల్య లియోనా పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దొరెస్వామి దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతే..! దీంతో బీజేపీ నాయకులు ఒక్కసారిగా దొరెస్వామని టార్గెట్‌ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ తన ఆక్రోషాన్ని వెల్లగక్కాడు. దొరెస్వామి నకిలీ ఉద్యమకారుడనీ, పాకిస్థాన్‌ ఏజెంటు అని ఆరోపణలు చేశాడు. దీనికి పలువురు బీజేపీ నాయకులు వంత పాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాటిల్‌ వ్యాఖ్యల్ని సమర్థించినట్టు కొన్ని వార్తా పత్రికలు రాశాయి.

మరో వైపు దొరెస్వామిని అవమానించడంపై రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ... ʹరాష్ట్రానికి ఆయన గర్వకారణం. స్వతంత్య్ర పోరాటంతో పాటు రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నీ విమర్శించారు. రైతుల భూపట్టాలకు సంబంధించిన నాటి ప్రభుత్వంతో కొట్లాడారు. ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దీనిపై ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప మౌనంగా ఉండటం ఆందోళనకరంʹ అని అన్నారు. అవినీతి నిరోధక ఉద్యమకారుడు ఎస్‌.ఆర్‌.హేమంత్‌ మాట్లాడుతూ.. ʹగాంధేయవాది అయిన దొరెస్వామి లాంటి వ్యక్తిని పాకిస్థాన్‌ ఏజెంటు అని నిందించడం హాస్యాస్పదంʹ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్పందిస్తూ.. క్విట్‌ఇండియా సందర్భంగా ఆయన జైలుకెళ్లినప్పుడు జైలర్‌ ఇచ్చిన పత్రాన్ని చూపుతూ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది.

Keywords : karnataka, bjp, nrc, caa, HS Doreswamy, ramachandra guha
(2024-04-18 18:31:14)



No. of visitors : 1002

Suggested Posts


ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు

కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు మతోన్మాదులు ఓ అమ్మాయిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అందుకు కారణం ఆ అమ్మాయి సరదాగా ʹఐ లవ్‌ ముస్లిమ్స్‌ʹ అని వాట్సప్‌లో మెసేజ్ చేయడమే.

Support the struggle for human dignity and livelihood .

ix months back onwards 577 Adivasi families had legally occupied government land in siddapura near virajpet and constructed hutments in order to escape the bonded wage labour in the coffee estate....

War and Peace in the Western Ghats

The last two weeks have been the most traumatic in my life. At one go, these two weeks have shown how various forms of violence operate: the shrinking democratic space, the betrayal by the so-called mentors of our age, a government that has no control over the police and, above all, what domestic violence can do. Feminism declares

న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?

ʹఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు బాధితులు, సాక్షులైన మహిళలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం

భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల

దక్షిణ కన్నడ జిల్లాలోని కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనానికి అంచున ఉన్న మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడిని, అతని తండ్రిని 2012లో కర్ణాటక పోలీసుల నక్సల్ వ్యతిరేక విభాగం అరెస్టు చేసింది.

స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు

బ్రాహ్మణిజాన్ని విమర్షించినందుకు కన్నడ నటుడు చేతన్ పై కేసు నమోదయ్యింది. అతనిపై బసవనగుడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

మత మార్పిడికి పాల్పడుతున్నారంటూ ఓ దళిత కుటుంబంపై దాడి చేసిన మతోన్మాదులు

ఓ మతోన్మాద గుంపు దళిత కుటుంబంపై దాడి చేసి దారుణంగా కొట్టారు,హింసించారు. ఆ దళిత కుటుంబం ఇతరులను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ ఆ మతోన్మాద మూక ఈ దారుణానికి ఒడిగట్టింది.

దళిత యువకుడిపై తీవ్ర చిత్ర హింసలు...లాకప్ లో మూత్రం తాగించిన పోలీసులు

కర్నాటకలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కస్టడీలో ఉన్న దళిత యువకుడితో బలవంతంగా మూత్రం తాగించాడు. ఈ విషయంపై బాధితుడు పై అధికారులకు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం

కర్నాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లా మహాలింగాపూర్‌ టౌన్ బీజేపీ నాయకురాలు‌, మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చాందిని నాయక్ పై ఆమె పార్టీకే

తమ వాకిట్లో అడుగు పెట్టారని దళిత యువకులపై అగ్రకుల మూక దాడి - ఆత్మహత్య యత్నం చేసిన దళితులు

తమ వీధిలోకి వచ్చారనే కోపంతో ఇద్దరు దళిత యువకులపై అగ్రకుల మూక దాడి చేయడంతో అవమానం భరించలేని ఆ యువకులు ఆతమహత్యకు ప్రయత్నించారు. కర్నాటక రాష్ట్రం యల్ బుర్గ తాలూకా హోసల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


స్వాతంత్ర్య