ఒక వైపు లాక్ డౌన్,కరోనా భయం...దళితులపై అగ్రకులాల‌ దాడి, కాల్పులు,5గురికి తీవ్రగాయాలు

ఒక

దేశం ఒకవైపు లాక్ డౌన్ లో ఉంది. ప్రజలు కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నారు. ఇండ్లలోంచి భయటికి రావడానికి జనం భయ‌పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దళితులపై అగ్రకులాల దాడులు మాత్రం ఆగడం లేదు. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి అగ్రకుల దుర్మార్గులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు.
భోజ్పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సుశీల్ కుమార్ తో మాట్లాడిన ʹది వైర్ʹ ఈ సంఘటన‌పై ఓ కథనం పోస్ట్ చేసింది.

ఎస్పీ సుశీల్ కుమార్ కథనం ప్రకారం... ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో, తారారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారా గ్రామంలోని మహా దళిత్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిపై అగ్ర‌ కులానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. దళితుల ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. బాధితులు వారి ప్రవేశాన్ని ప్రతిఘటించినప్పుడు ఆ అగ్రకులం వారు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు, ఈ కాల్పుల్లో ఐదుగురు దళితులు గాయపడ్డారు. అగ్ర‌ కులస్థులు దళిత కుటుంబం పెంచుతున్న కోళ్లను దొంగిలించడానికి ప్రయత్నించారని పోలీసులకు సమాచారం అందింది. కాని ఇంకా దృవీకరణ జరగలేదు.

"బాధిత దళితులను సదర్ ఆసుపత్రిలో చేర్పించాము వారి ఆరోగ్య‌ పరిస్థితి స్థిరంగా ఉంది" అని ఎస్పీ సుశీల్ కుమార్ ది వైర్ కు చెప్పారు. ఆరుగురిపై వెంటనే కేసు నమోదు చేశామని ఇప్పటివరకు వారిలో శివలాగన్ సింగ్, రవి యాదవ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

కాల్పుల్లో గాయపడిన వారిని కృష్ణ ముసహార్, వీడియో ముసహార్, భిఖాన్ ముసహార్, రామ్‌నాథ్ ముసహార్, అజయ్ ముసహార్‌లుగా గుర్తించారు. వారు బీహార్ మహదళిత్ వర్గానికి చెందినవారు, భారతదేశంలోని దళితుల్లో అత్యంత వెనకబడిన‌ వర్గాలలో ఇది ఒకటి.
షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ʹమేము కుటుంబానికి ఆహారం మరియు రేషన్ కూడా ఏర్పాటు చేసాము. నేను వ్యక్తిగతంగా కేసును పర్యవేక్షిస్తున్నానుʹʹ అని ఎస్పీ ʹది వైర్ʹతో అన్నారు.

భోజ్‌పూర్ జిల్లాకు దళితులపై హింసకు సుదీర్ఘ చరిత్ర ఉంది. జూలై 11, 1996 న, బఠానీ తోలాలో 21 మంది దళితులను అగ్రకుల ఉగ్ర సంస్థ రణవీర్ సేన హత్య చేసింది. మృతుల్లో 11 మంది మహిళలు, ఆరుగురు పిల్లలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో, జిల్లాలో దళితులపై దారుణాలు, హింస విపరీతంగా పెరిగిపోయినట్టు అనేక నివేదికలు చెబుతున్నాయి. 2011 అక్టోబర్‌లో జిల్లాలోని ఒక గ్రామంలో ఆరుగురు దళిత మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
(ది వైర్ సౌజన్యంతో)

Keywords : bihar, bhojpur, dalit, upper cast, attack, firing, police case
(2024-04-24 16:52:28)



No. of visitors : 1499

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఒక