ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఇళ్ళలోంచి బైటికి రావద్దని దూరప్రాంత పర్యటనలు చేయవద్దని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు రోడ్లపై బారికేడ్లు పెట్టి మరీ ప్రజలను ఎక్కడికీ వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరినీ ప్రయాణాలకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో....
తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వాళ్ళలో ఏ హక్కుతో వారు ఈ విధంగా చేస్తున్నారు ? వారికి ప్రభుత్వం అనుమతి ఉన్నదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై ది హిందూతోపాటు అనేక వెబ్ సైట్ లు కథనాలు పోస్ట్ చేశాయి.
ఇది జరిగింది తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ హైవేపై బీబీనగర్ దగ్గర్లోని గూడూరు చెక్ పోస్ట్ వద్ద ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్న బారికేడ్లను దాటేవారి పత్రాలను ఈ ఆరెస్సెస్ వారి తనిఖీ చేస్తున్నారు. ఈ ఫోటోలను ʹ@friendsofrssʹ అనే ట్విట్టర్ హ్యాండిల్ ʹఆర్ఎస్ఎస్ వాలంటీర్లు పోలీసులకు సహాయం చేస్తున్నారుʹ అని కామెంటుతో ట్వీట్ చేసింది. ఈ విధంగా చేయడం చట్టవిరుద్దమని నెటిజనులు ఫైర్ అయ్యారు. అనేక మంది పోలీసులకు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ʹʹవారికి కర్రలు ఎందుకు ఉన్నాయి? వారు ఈవిధంగా చేయడానికి ఉఎవరు అధికారం ఇచ్చారు ? @KTRTRS, ʹʹ అని ట్విట్టర్ యూజర్ సాయి కిరణ్ ట్వీట్ చేశారు. ఆరెస్సెస్ ఈ విధంగా చేయడంపై సామాజిక కార్యకర్త ఎస్.క్యూ. మసూద్ ఆందోళన వ్యక్తం చేసి, తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ట్యాగ్ చేసి, వివరణ కోరారు.
దీనిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ "ఈ సంఘటన గురించి నాకు తెలిసింది. మరియు ఫోటోలు కూడా చూశాను. వారు [ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు] ఈ విదమైన కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తామని అని అడుగుతూ మా వద్దకు వచ్చారు. కుదరదని వారికి చెప్పాము.. ఎటువంటి మత సంస్థ నుండికానీ రాజకీయ సంస్థ నుండి కానీ సహాయం తీసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాము.ʹʹ అన్నారు.
దీనిపై సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ మాట్లాడుతూ... పోలీసింగ్ ఏ సంస్థకు అప్పగించలేనందున అటువంటి పనులు ఎవరు చేసినా తప్పే. ప్రజలను ఆపే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన వివరించారు. ʹʹఎటువంటి అధికారంలేకుండా ఎవరైనా ఇలా చేయడం ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు" అని ఆయన అన్నారు.
ప్రజలకు సహాయం చేయడం, ఆహారం, నిత్యావసరాలు అందించడం వేరు. ప్రజల పత్రాలను తనిఖీ చేయడం ప్రజలు ఎటైనా పోవాలా వద్దా అని డిసైడ్ చేయడం ఆరెస్సెస్ వాళ్ళు ఎలా చేస్తారు. పోలీసులు కూడా తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. అనుమతి లేకుండా ఏ అధికారంతో వాళ్ళిలా చేస్తున్నారు ? వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?

Keywords : rss, police, corona, lockdown, telangana, rangareddy, warangal, hyderabad
(2023-05-31 15:54:28)
No. of visitors : 4321
Suggested Posts
| లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలుకర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు. |
| కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీకరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు. |
| కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ |
| లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹకరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు |
| లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది. |
| మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘంకరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది. |
| లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సులాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన సిఫార్సు చేసింది. |
| వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు. |
| 8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడకఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక... |
| అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు. |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..