వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌

కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే మార్గమని ప్రకటించిన ప్రభుత్వాలు లాక్ డౌన్ లో అనే నిబందనలను ప్రకటించాయి. సామాన్యులు అత్యవసరం అయ్యి ఆ నిబందనలను కొద్ది గా అతిక్రమించినా లాఠీలతో చితకబాదిన పోలీసులు రాజకీయ్ అనాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని నిబందనలను ధిక్కరించి వందల మందితో ధూ ధాంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. పైగా ఆ వార్త రాసిన పాపానికి ఓ జర్నలిస్టు ఇల్లు కూల్చేశారు అధికారులు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి త్న పుట్టిన రోజు వేడుకలకు వందలాది మ‍ందిని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో కేకు కట్ చేశాడు. వచ్చిన వాళ్ళెవ్వరూ కనీస భౌతిక దూరం పాటించలేదు. ఎక్కువ మందికి మాస్క్ లు కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున నిబందనలు ఉల్లంఘన జరినా ఏ అధికారీ అడిగిన పాపానపోలేదు. ఎవ్వరూ అడ్డుకోలేదు. అయితే నారాయణ ఖేడ్ వీ6 రిపోర్టర్ పరమేశ్ ఈ విజువల్స్ ను తీసి తన చానల్ కు పంపాడు. అది ఆ చానల్ లో టెలీకాస్ట్ అయ్యింది. దాంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. తనకు వ్యతిరేకంగా వార్త రావడం తట్టుకోలేక పోయాడు.

వార్త వీ6 లో టెలీ కాస్ట్ అయిన రెండో రోజే పరమేశ్ కొత్తగా కట్టుకుంటున్న ఇల్లును అనుమతులు లేవని అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేశారు. అప్పటికే ఆ ఇల్లు పూర్తి కావచ్చింది. పది లక్షలకు పైగా ఖర్చయ్యింది.
ఇల్లు కట్టుకోవడానికి అనుమతుల కోసం తాను అప్లై చేసి చాలా రోజులయ్యిందని, లాక్ డౌన్ కారణ్‍అమ్గా అనుమతులు పెండింగులో ఉన్నాయని పరమేశ్ అంటున్నాడు. పైగా మున్సిపల్ కమిషనర్ తన ఇంటి ముందే ఉంటాడని తాను అప్లిఅ చేసిన విషయం కూడా అతనికి తెలుసని చెప్పాడు పరమేశ్. ఇల్లు కూల్చిన విషయం తెలిసి వృద్దుడైన తన తండ్రి గుండె పోటుతో కూలిపోయాడన్నాడు పరమేశ్.

ఈ విషయంపై జర్నలిస్టు సంఘాలు మండి పడ్డాయి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్యాయంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. భూపాల్ రెడ్డి ధౌర్జన్యాలను ఖండిస్తూ వీ6 రిపోర్టర్ కు న్యాయం చేయాలనే డిమాండ్ తో వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ నాయకత్వంలో జర్నలిస్టులు సంగారెడ్డిలో ధర్నా నిర్వహించారు.

నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి దౌర్జన్యం పై మంత్రి హరీష్ రావుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ ఫిర్యాదు చేసింది. దానిపై ఆ యూనియన్ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని న్యూస్ కవర్ చేసిన స్థానిక V6 రిపోర్టర్ పరమేష్ పై కక్షసాధిపు ధోరణితో రిపోర్టర్ నిర్మించుకుంటున్న ఇల్లును కూల్చి వేయించాడు. దీనిని TUWJ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు ఫిర్యాదు చేయడం జరిగింది. TUWJ నాయకుల ఫిర్యాదుకు స్పందించిన మంత్రి రిపోర్టర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు కానీ, బెదిరింపు చర్యలు కానీ జగకుండా చూడాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు మంత్రి హరీష్ రావును కోరారు. మంత్రిని కలిసిన వారిలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, TUWJ హైద్రాబాద్ అధ్యక్షుడు పి.యోగానంద్, TEMJU హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి. సంపత్,TUWJ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, యోగనంద్ రెడ్డి, ధారసింగ్ తదితరులు ఉన్నారు.

Keywords : telangana, kcr, narayana khed, bhupal reddy, v6 reporter, paramesh
(2024-04-25 03:08:05)



No. of visitors : 1714

Suggested Posts


కొమురయ్య బెయిల్ పై విడుదల - టీఆరెస్ నేతలతో ప్రాణ హాని ఉందని ఆందోళన

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక పోవడంతో ఆగ్రహించి మంత్రి కడియం శ్రీహరి మీద చెప్పు విసిరిన కొమురయ్య సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు....

జంప్ లు షురూ !

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల గోడ దూకడాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీలలోకి వలసలు ముమ్మరమవుతాయి. తిండి దొరికే చోటికి వలస వెళ్ళడం పక్షులకు అవసరం కదా......

కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంటు కెటిఆర్ గారు ప్రసంగిస్తూ దేశంలో అసహనం పెరిగిపోతుందనీ తర్కానికి, విభిన్నాభిప్రాయాలకు, వైరుధ్యాలకు అందులోనూ మిత్రవైరుధ్యాలకు విలువలేకుండా పోతుందనీ, ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, భిన్న శక్తుల మధ్య జరిగే సంఘర్షణ నుండే చరిత్ర పుడుతుందని. కావున తెలంగాణా వికాస సమితి కలిసికట్టుగా ఉంటూ ʹఅవసరమైతేʹ సందర్భానుసారం

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వందల