కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి - విరసం

కా.

కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
- విరసం

విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కా. కాశీం అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమించిన సాహిత్య సాంస్కృతిక కళా సంస్థలకు, రచయితలకు, బుద్ధిజీవులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, వివిధ రంగాల్లో పని చేస్తున్న సోదర ప్రజాసంఘాలకు, పార్టీలకు విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. గత యాభై ఏళ్లలో విరసం మీద రాజ్యం విద్రోహపూరితంగా నిర్బంధం తీసుకొచ్చిన ప్రతిసారీ సమాజం నుంచి సంఘీభావం వచ్చినట్లే కా. కాశీం అరెస్టు సందర్భంగా కూడా వచ్చింది. పీడిత ప్రజల, ప్రజాస్వామిక శక్తుల అండదండలతో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విరసం నక్సల్బరీ పంథాను సమున్నతంగా ముందుకు తీసుకెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

విద్యార్థుల, పీడితకులాల, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసే క్రమంలో కా. కాశీం విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చాడు. విరసం కార్యదర్శి అయ్యాడు. ఆయన ప్రజా ఆచరణను, సాహిత్య కృషిని అణచివేయడానికే తెలంగాణ ప్రభుత్వం అనేక అబద్ద నేరారోపణలతో కేసులు పెట్టింది. మావోయిస్టుపార్టీతో సంబంధాలు అంటగట్టి నిర్బంధించింది. అయితే విరసం నిషేధిత సంస్థ కాదని న్యాయస్థానం భావించి కాశీంకు బెయిలు మంజూరుచేసింది.

గతంలో విరసం సభ్యుల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో ఇలాగే స్పందించాయి. విరసం వర్గపోరాట రాజకీయాల వెలుగులో భావ విప్లవం కోసం పనిచేస్తున్న సాహిత్య సంస్థ. రాజకీయాలకు అతీతంగా సాహిత్యకారులు రచనలు చేయలేరు. నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా వర్గ రాజకీయాల దృక్పథంతో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విరసం పని చేస్తోంది. విప్లవ రాజకీయాలను విశ్వసించినంత మాత్రాన తాను నిషేధించిన విప్లవ పార్టీలతో రాజ్యం రచయితలకు, బుద్ధిజీవులకు సంబంధాలు అంటగట్టడం, నేరారోపణలు చేయడం దుర్మార్గం. ఇది భారత రాజ్యాంగంలోని భావప్రకటనా స్వేచ్ఛకు కూడా వ్యతిరేకం. విప్లవ రాజకీయాలపట్ల విశ్వాసం ఉండటం నేరం కాదని న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో చెప్పాయి. అయినా ప్రభుత్వాలు విరసం మీద ఇలాంటి నేరారోపణలు చేస్తూనే ఉన్నాయి. అణచివేత ప్రయోగిస్తూనే ఉన్నాయి. విరసం తన రచనా, మేధో కృషితో, పీడిత ప్రజల అండదండలతో దీన్ని అధిగమిస్తోంది. విప్లవ భావజాలాన్ని ఎత్తిపడుతోంది.

వివిధ రాష్ట్రాల్లో ఎందరో రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు జైళ్లలో ఉన్నారు. కరోనా వైరస్ జైళ్లలో కూడా వ్యాపిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి జైలు నిర్బంధంలో ఉన్న విరసం నాయకులు, ప్రముఖ రచయితలు కా. వరవరరావు, కా. జిఎన్ సాయిబాబను వాళ్ల వయసు, అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్లతోపాటు భీమా కొరేగావ్ అక్రమ కేసులో జైలు నిర్బంధంలో ఉన్నవాళ్లను విడుదలచేయాలి. తెలంగాణ జైళ్లలో ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులను, రచయితలను విడుదల చేయాలి. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో అక్రమంగా నిర్బంధించిన వాళ్లను, ఇతర రాజకీయ ఖైదీలను, సాధారణ ఖైదీలను విడుదల చేయాలి. మానవాళిని కరోనా వైరస్ చుట్టుముడుతున్న సందర్భంలో వాళ్లను వెంటనే ఇండ్లకు పంపించాలని, ఆ తర్వాత నేర విచారణ చేయవచ్చని విరసం డిమాండ్ చేస్తోంది.

- అరసవిల్లి కృష్ణ (విరసం అధ్యక్షుడు), బాసిత్ (విరసం ఉపాధ్యక్షుడు) రివేరా (విరసం సహాయ కార్యదర్శి)

Keywords : virasam, kashim, revolution,
(2024-04-25 03:08:31)



No. of visitors : 756

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కా.