మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

మంథని

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణకు ఆదేశించింది. శీలం రంగయ్య అనే వ్యక్తిని లాకప్ డెత్‌ చేశారంటూ న్యాయవాది నాగమణి రాసిన లేఖ ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు రంగయ్య‌ మరణం పై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌ను నియమించింది. జూన్ 2 వరకు నిందితుడి అనుమానాస్పద మృతిపై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది.
మరో వైపు రంగయ్య మరణంపై పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ నిర్వహింది. 27 మే 2020 బుధవారం న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రంగయ్య కుటుంబ సభ్యులను రామయ్య పల్లె గ్రామస్తులను మరియు మంథని పోలీస్ అధికారులతో కలిసి వివరాలు సేకరించింది. ‌

దీనిపై పౌరహక్కుల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన
రామయ్య పల్లె శీలం రంగయ్య ది మంథని పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య కాదు! మృతికి పోలీసులే బాధ్యత వహించాలి!

రామయ్య పల్లె గ్రామం రామగిరి మండలం పెద్దపెల్లి జిల్లా కు చెందిన శీలం రంగయ్య 26 మే 2020 మంగళవారం మంథని పోలీస్ స్టేషన్ టాయిలెట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే ఘటనపై ఈరోజు 27 మే 2020 బుధవారం న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రంగయ్య కుటుంబ సభ్యులను రామయ్య పల్లె గ్రామస్తులను మరియు మంథని పోలీస్ అధికారులతో కలిసి సేకరించిన వివరాలు, ఈ ఘటనపై పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ లుగా వివరిస్తున్నాము.
23 మే 2020 శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మంథని పోలీసులు గాజులపల్లె శివారులోని గుడిమెట్ట గుట్ట వద్ద శీలం రంగయ్యను మిగతా ముగ్గురు వ్యక్తులను వన్యప్రాణులను వేటాడడం కోసం హై వోల్టేజి లైన్లను పరిచారని అదుపులోకి తీసుకున్నారు.
శీలం రంగయ్య ది ఆత్మహత్య కాదు అని మా నిజ నిర్ధారణలో తేలింది. 52 గంటల పైన మంథని పోలీసులు శీలం రంగయ్యను అక్రమంగా మంథని పోలీస్స్టేషన్లో నిర్బంధించి వేధించడం వలన చనిపోయినట్లు మా నిజనిర్ధారణ లో తేలింది .పోలీసులు చెబుతున్నట్లు టాయిలెట్లో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు లేవు, అది కట్టుకథ. పోలీసుల కథనం లో వాస్తవం లేవు ,వాస్తవాలు బయటికి రావాలంటే ఈ లాకప్ డెత్ పై
1. జ్యుడిషియల్ ఎంక్వయిరీ మరియు సిబిసిఐడి ఎంక్వయిరీ జరిపించాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
2. సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి మరియు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి .(culpable homicide).శీలం రంగయ్య ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
3. మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ఒక ప్రభుత్వం ఉద్యోగం(పర్మనెంట్) ఇవ్వాలి.
4. ఈ కేసులో అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకుండా శీలం రంగయ్య మృతికి కారణమయ్యారు.మరియు కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన పోలీసు అధికారులు మరియుఅధికార పార్టీ నాయకుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

1. మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ.

2. జి వి ప్రసాద్ అధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

3. మహమ్మద్ అక్బర్ ఉపాధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

4. ఏనుగు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

5. పుల్ల సుచరిత సహాయ కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

6 వేల్పుల బాలయ్య సహాయ కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

7. పోగుల రాజేశం ఈసీ మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.

మంథని
27 మే 2020, బుధవారం మధ్యాహ్నం..

Keywords : telangana, peddapalli, manthani, police, lockup death, rangayya
(2024-04-25 03:14:21)



No. of visitors : 2356

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మంథని