తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !

తెలంగాణ

తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై జే.జే హాస్పిటల్ చేర్పించబడి మళ్లీ తలోజ జైలుకు పంపబడిన ప్రముఖ తెలుగు కవి వరవరరావు విడుదల కోసం కృషి చేయాలని తెలంగాణ మంత్రి వర్గ సభ్యులందరికీ ప్రొఫెసర్ హరగోపాల్, నిర్బంధ వ్యతిరేక వేదిక నాయకులు లేఖ రాశారు. వరవరరావును బెయిలు లేదా పెరోలుపై విడుదల చేయాలని లేదా హైదరాబాద్ కు తరలించి హాస్పిటల్లో మంచి చికిత్స అందించాలని, తక్షణం వీడియో కాన్ఫరెన్స్ లో భార్య, కూతుళ్లతో మాట్లాడే అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఆ లేఖ పూర్తి పాఠం...

గౌరవ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం గారికి,
తేదీ:4-6-2020

సర్/మేడం,

విషయము÷ వరవరరావు, సాయిబాబా మరియు భీమా కోరేగావ్ కేసులో, తెలంగాణలో UAPA కింద అరెస్టు చేసిన అందరినీ విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి.

ప్రజాస్వామిక ఆలోచనలను, భావ వ్యక్తీకరణను, నిరుపేదలు, ఆదివాసీలు, దళితులు, మహిళలపై ప్రతినిత్యం కొనసాగుతున్న వేధింపులను వ్యతిరేకించడాన్ని, ప్రశ్నించడాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమాత్రమూ సహించట౦ లేదు. సంఘాలు ఏర్పరుచుకుని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఏ చిన్న ఆందోళనలనైనా అనేక ఆంక్షలతో నిరోధిస్తున్నారు. ప్రజా ఉద్యమాల కార్యకర్తలను, ప్రజాస్వామిక ఆకాంక్షలకు, ప్రజల జీవన పరిస్థితులు మార్పు కోసం కట్టుబడి పనిచేసే మేధావులను, ప్రజాస్వామిక వాదులను అక్రమకేసుల్లో ఇరికించి, కటకటాల వెనక్కి నెట్టేసి వాళ్ళ ఆరోగ్యాలను, వయసును, కోవిడ్-19 పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోకుండా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.

గత మూడేళ్లుగా ప్రొ. జి.ఎన్. సాయిబాబా జీవిత ఖైదీగా అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక, ఒంటరిగా, కదలలేని అంగవైకల్యంలో తోడ్పడే సహాయకులు లేక, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని కనీసం ఒకసారి చూసే అవకాశం లేక ఒంటరి సెల్లో నిర్బంధంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బెయిల్ కోరినా, పెరోల్ కోరినా ప్రభుత్వమే వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. తెలుసుకునే అవకాశాలే లేవు.

గత 18 నెలలుగా విప్లవ కవి, విరసం వ్యవస్థాపకులలో ఒకరు అయిన పి వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్నారు. తొలుత పూణే ఎరవాడ జైల్లో ఉంచారు. అటునుండి ముంబై తలోజా జైలుకు తరలించారు.80 సంవత్సరాలు పైబడిన వయసులో అసౌకర్యాల జైలులో ఒంటరి సెల్ లో ఉంచారు. వివి అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కానీ, ఫోన్ లో నైనా మాట్లాడగల అవకాశంకానీ కల్పించడం లేదు. అలాగే బీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్న మరో పదిమంది ఖైదీల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వీరెవరికీ కోవిడ్ విపత్తు లోనైనా, అనారోగ్య పరిస్థితుల రీత్యా నైనాబెయిల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్నది.

ప్రొ.జి.ఎన్.సాయిబాబా విషయంలో, భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుల విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున స్పందించారు. అయినా భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామికంగా మానవీయంగా కాకపోయినా కనీసం రాజ్యాంగబద్ధంగా కూడా ప్రతి స్పందించలేదు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపా(UAPA) చట్టం తీసుకు వచ్చింది. ఆ చట్టానికి ప్రస్తుత భాజపా ప్రభుత్వం మరికొన్ని కఠినమైన సవరణలు చేర్చింది. దేశవ్యాప్తంగా ఊపా చట్టాన్ని ప్రజాస్వామికవాదులు పై, ఉద్యమకారులపై ప్రయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర సాధన కృషిలో క్రియాశీలంగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు న్యాయం కోసం గొంతు విప్పుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఊపా కేసులు బనాయిస్తున్నది. 99 మంది ప్రజాసంఘాల కార్యకర్తలపై 255 కు పైగా కేసులు---ఒక్కొక్కరి పై ఒకటి, రెండు నుంచి ఐదారు కేసుల దాకా బనాయించిoది.17 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలామంది గత కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు.

ప్రజాస్వామిక వాదులను అర్బన్ నక్సలైట్లుగా సంబోధించడం, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించడం, కేసులు బనాయించడం, అన్ని కేసుల్లోనూ సాధారణ విషయమై పోయింది. ప్రపంచంలో కోవిడ్-19 కలిగిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. కోవిడ్-19 బారిన లక్షలలో ప్రజలు చనిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకుండా అడ్డుకోవడం, విచారణ కాలాన్ని సైతం శిక్షాకాలంగా అమలు చేయటం జీవించే హక్కును భంగ పరచడమే. NIA పరిధిలో వరవరరావు కేసు ఉన్నదనే కారణంగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఫోన్లో కూడా కుటుంబ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లేదు.

డిమాండ్లు:

◆ పూర్తి అంగవైకల్యంతో సహాయకులు లేకుండా గడపలేని స్థితిలో ఉన్న ప్రొ. జిఎన్ సాయిబాబాను వెంటనే పెరోల్పై విడుదల చేసి, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని చూసే అవకాశం, కొవిడ్-19 బారినుండి కాపాడుకునే అవకాశం కల్పించాలి.

◆ ముంబై తలోజ జైల్లో ఉన్న వరవరరావు తన కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశాన్ని తక్షణమే కల్పించాలి.

వరవరరావు ఆరోగ్య పరిస్థితులను, 80 సంవత్సరాలు పైబడిన వయసును పరిగణించి, తక్షణం బెయిలుపై విడుదల చేయాలి.

కోవిడ్-19 విపత్తు బారిన పడకుండా వరవరరావును ముంబై నుండి హైదరాబాద్ కు తరలించి, ఇక్కడి హాస్పిటల్లో చికిత్స అందించాలి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

◆ భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుగా ఉన్న సుధీర్ ధావలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రావత్, రోనా విల్సన్, వెర్నాన్ గొన్జ్వాలెజ్, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫెరేరా, ఆనంద్ తెల్ తుంబ్డే,గౌతమ్ నవలఖా లకు బెయిలు మంజూరు చేసి, విడుదల చేయాలి.

◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంఘాల కార్యకర్తలపై, ప్రజాస్వామికవాదులపై బనాయించిన UAPA కేసులను వెంటనే ఎత్తివేయాలి. నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలి.

◆ ప్రజాస్వామికమైన రాజ్యాంగబద్ధమైన హక్కులను భంగపరిచే అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

కావున పై విషయాల పై రాష్ట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకొనే ట్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా స్పందించగలరని ఆశిస్తున్నాము.

కృతజ్ఞతలతో,

ప్రొ.జి.హరగోపాల్,కన్వీనర్
ప్రొ.జి లక్ష్మణ్,
ఎం.రాఘవాచారి
ఎస్.అనిత,
కె. రవిచందర్
కో- కన్వీనర్స్

Keywords : varavararao, haragopal, kcr, ministers, telangana, NIA, maharashtra
(2024-04-25 03:20:17)



No. of visitors : 954

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తెలంగాణ