అధిక కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి...సీపీఎం డిమాండ్

అధిక

తెలంగాణలో అధిక కరంట్ బిల్లులతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ రోజు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆన్లైన్ లో జరిగిన ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ పార్టీ విడుదల చేసింది.

సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన ఆన్లైన్ లో జరిగింది. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలను చర్చించి, ఈ క్రింది తీర్మానాలను చేసింది. వాటిని పత్రికలకు విడుదల చేస్తున్నాం.

1. గత మూడు నెలల గృహ విద్యుత్ బిల్లులను సగటు చేయడం వల్ల స్లాబ్ మారి బిల్లులు పెరిగాయి. 50 యూనిట్లు లోపు వాడే వారు యూనిట్‌కు రు. 1.45లు చెల్లించేవారు స్లాబ్ పెరగడం వల్ల రు. 2.60లు కట్టాల్సి వస్తున్నది. డిస్కాంలు ఏనెలకు ఆనెల రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి. కానీ మూడు నెలలు నెలవారీ రీడింగ్ తీయకపోవడం వల్ల అదనపు భారాన్ని వినియోగదారులు భరించాల్సి వస్తున్నది. డిపార్టుమెంట్ చేసిన విధాన సవరణ వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు. అందువల్ల నెలవారీ రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి తప్ప సగటు బిల్లింగ్ చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లుల భారాన్ని నివారించాలని, ప్రస్తుతం పెరిగిన విద్యుత్ బిల్లుల భారాన్ని పేదకుటుంబాలకు తగ్గించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.

2. పోడు భూముల సాగుదార్లకు రక్షణ కల్పిస్తానని, వారి భూమికి పట్టాలిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. నేడు ఫారెస్టుయంత్రాంగాన్ని మరియు పోలీసులను పంపించి నిర్బంధంగా బేదఖల్ చేయడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్రంలో 1.65 లక్షల మంది రైతులు 4.57లక్షల ఎకరాల సాగులో వున్నారు. వీరిని తొలగించి చెట్లు నాటడం పేరుతో వారు సాగుచేస్తున్న పంటలకు నష్టం కల్గిస్తున్నారు. ఈ నిర్భంధ తొలగింపులు ముఖ్యమంత్రి ప్రకటించిన దానికి విరుద్ధం. ఫారెస్టు డిపార్టుమెంట్ వారు అక్రమంగా గిరిజనులపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. పోడు పేరుతో సాగును వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి మూడు, నాలుగు దశాబ్దాలుగా ఒకే చోట సాగుచేస్తున్న రైతులు పోడు వ్యవసాయం కాకుండా స్థిర వ్యవసాయం చేస్తున్నారు. వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించి 2020 వానాకాలంలో వారు సాగు చేసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఫారెస్టు డిపార్టుమెంట్ అభ్యంతరం పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం)కోరుతున్నది.

3. లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. వైరసను ఎదుర్కోవడంలో ముందుపీఠిన నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులు కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రజల్లో తీవ్రమైన అభద్రతా భావం నెలకొన్న ప్రస్తుత పరిస్తితుల్లో రాష్ట్రంలో కరోనా విస్తృతిని అంచనా వేయడానికి పరీక్షలు విస్తృతంగా జరపాలని, ఐసోలేషన్ వార్డుల్లో, ఇతర ఆసుపత్రుల్లో తగు సౌకర్యాలు కల్పించాలని, ట్రిమ్స్ ను కూడా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేలు తక్కువ చేసి వ్యాధిగ్రస్తుల సంఖ్యను తక్కువ చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో వీలయినంత ఎక్కువ ప్రజానీకానికి పరీక్షలు చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. హైదరాబాʹ పాటు వివిధ జిల్లాల్లో ముమ్మరంగా తగు ఏర్పాట్లు చేసి వ్యాధి నిరోధానికి కృషి చేయాలని కోరుతున్నాం. అందుకు పార్టీ సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాయి.
-తమ్మినేని వీరభద్రం
రాష్ట్ర కార్యదర్శి

Keywords : telangana, cpm, power bills
(2024-04-25 03:25:56)



No. of visitors : 895

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అధిక