ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు

ʹగౌరీ

ప్రముఖ జర్నలిస్టు, రచయిత రానా అయూబ్ ను హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలోబెదిరింపులకు దిగారు కొందరు దుర్మార్గులు. ఈ విషయంపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

కాశ్మీర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి ఓ బాలుడు ఫోటో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోపోర్‌లోని మోడల్ టౌన్ వద్ద ఉన్న మసీదు నుంచి సిఆర్‌పిఎఫ్ ʹనాకాʹ పార్టీపై ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులు కాల్పులు జరిపాయని, ఇందులో సిఆర్‌పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్, పౌరులు మృతి చెందారని ఐజిపి కాశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో భద్రతా దళాలు ఒక్క షాట్ కూడా కాల్చలేదని ఆయన పేర్కొన్నారు. పౌరుడితో పాటు మైనర్ బాలుడిని రక్షించారని ఆయన చెప్పారు. ఈ సంఘటనలో ఓ వృద్దుడు మరణించాడు. అతనితోపాటు ఉన్న అతని మూడేళ్ళ మనవడిని సిఆర్‌పిఎఫ్ జవాను రక్షించారని చెబుతూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వృద్దుడు ఉగ్రవాదుల తూటాలకే చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. అయితే ఆ మూడేళ్ళ చిన్నారి, అతని బందువులు మాత్రం ఆ వృద్దుడు చనిపోయింది సీఆర్పీఎఫ్ తూటాలతోనే అని మీడియాకు చెప్పారు.

ఈ విషయంపై ఆమె వరస ట్వీట్లు షేర్ చేశారు. ఆ వృద్దుణ్ణి హత్య చేసింది పోలీసులే అని వృద్దుని బందువులను ఉటంకిస్తూ ఆమె ఆరోపించింది. ఆ సంఘటన జరిగినప్పుడు ఏ జర్నలిస్టు కూడా అక్కడ లేనప్పుడు. అన్ని ఫోటోలు, అన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించింది. అంతే కాక "భారతదేశంలోని ప్రముఖులకు ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ కానీ కాశ్మీరీల‌ జీవితాలపై పట్టింపు లేదు." అని ఆమె ట్వీట్ చేసింది. "నిజం ఏమిటంటే, మనము కాశ్మీర్ భూమి గురించి మాత్రమే పట్టించుకుంటాము కానీ కాశ్మీరీ జీవితాలకు మన హృదయంలో చోటు లేదు, లోయ అంతటా చిందిన అమాయక రక్తం గురించి పశ్చాత్తాపం లేదు. భారతీయ పౌరురాలిగా నా క్షమాపణలుʹʹ అని ఆమె మరొక ట్వీట్‌లో పేర్కొంది.

ఈ విధంగా ఆమె ట్వీట్లు పోస్ట్ చేశాక‌ సోషల్ మీడియాలో దాడి మొదలయ్యింది. ఆమెను హత్య చేస్తామని, రేప్ చేస్తామని అసభ్య‌ పదజాలంతో దాడి మొదలుపెట్టారు. గౌరీ లంకేష్ ను గుర్తుంచుకో అని బెదిరించారు. ‌ఆ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది అర్దమవుతున్నది. దాడి చేసిన వారి భాష చూస్తే ఓ ఉన్మాద గుంపు ఈ దాడికి నాయకత్వం వహించినట్టు అర్దమవుతుంది.
ఈ విషయంపై ఆమె నవీ ముంబై పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై ఆమె మరో ట్వీట్ చేశారు. అందులో అయూబ్ ఇలా వ్రాశారు "కోపర్‌ఖైరనే పోలీస్ స్టేషన్ అధికారులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. నేను రేపు నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాను. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నాపై బెదిరింపులతో సహా అన్ని ఆధారాలను అందజేస్తాను. వారు వేగంగా చర్య తీసుకుంటారని హామీ ఇచ్చారు.ʹʹ
రానా అయుబ్ సాహస జర్నలిస్టు. సాహస జర్నలిస్టులకు ఇచ్చే మెక్‌గిల్ పతకం 2020 సంవత్సరానికి ఆమె ఎంపికయ్యారు.
2002లో జరిగిన‌ గుజరాత్ అల్లర్లు, గుజరాత్ లో జరిగిన‌ పోలీసుల‌ ఎన్‌కౌంటర్ హత్యలపై ఆమె చేసిన రహస్య పరిశోధనల ఆధారంగా ʹగుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవర్ అప్ʹ అనే పుస్తకం ప్రచురించారు. ఆ రోజు నుండే బీజేపీ ఆమెపై వ్యతిరేకంగా ఉన్నది.
ఇదంతా చూస్తూ ఉంటే గతంలో బెంగుళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను హత్య చేసినట్టే రానా అయూబ్ ను కూడా హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కలగడం సహజం. గౌరీ లంకేష్ ను గుర్తు తెచ్చుకో అని ఆ దుర్మార్గులు బెదిరించారు కూడా.

Keywords : rana ayub, twitter, kashmir encounter, boy, old man death, bjp
(2024-04-24 23:49:27)



No. of visitors : 807

Suggested Posts


జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ....

అరుణ్ సాగర్ అమర్ రహే !

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటు. ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైంది....

ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు

మధ్యాహ్నం 2 గంటలకు ఈ దాడి ప్రారంభమైంది, స్థానికులైన పురుషులు,మహిళలు జర్నలిస్టులను చుట్టుముట్టారు, దాడి సమయంలో, మహిళా జర్నలిస్ట్ ఒక గేట్ ద్వారా పక్క సందులోకి పారిపోగానే ఆ ముఠా గేటును లాక్ చేసి, మిగతా ఇద్దరు జర్నలిస్టులను లోపల బంధించింది. ఆ మహిళా జర్నలిస్ట్ తన సహచరులను విడిచిపెట్టమని వేడుకొంటే ఒక వ్యక్తి ఆమె దుస్తులు పట్టుకొని మళ్ళీ గేటు లోపలికి లాగడానికి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹగౌరీ