రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు

రెక్కవిప్పిన

ʹʹ కంఠంలో నినాదంగా స్వీకరించిన పోరాటమే
ఊహలకు ఇంతగా కాంతినిస్తుంటే
ప్రజల రాజ్యాధికారం కత్తిని నిర్మించే కొలిమిలో
మనం రవ్వలమైతే ఎంత వెలుగు !ʹʹ

(వరవరరావు -1974)

ఒక సాహిత్య పత్రికగా ʹసృజనʹను అనధికార ప్రతిపక్ష గొంతుగా వినిపించిన వరవరరావు జీవితాంతం తాను రాసిన అక్షరాలకే నిబద్ధుడై బతుకుతున్నాడు. అదే ఆయన బలమైతే,అందుకే ప్రభుత్వాలకి ఆయనంటే అంత కన్నెర్ర అయ్యింది. 1966 లో ʹసృజనʹ ద్వారా, 1970 లో ʹవిరసంʹ ద్వారా వరవరరావు చెవి చూపు గొంతుగా నిలిచాడు. అందుకే గత అయిదున్నర దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నిషేధాలు నిర్బంధాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయినా ఆయన కలం గళం మూగవోలేదు. ఆయన సహచరి హేమలత, పిల్లలు సహజ అనల పవనలు ఆయన వెన్నంటే ఉంటూ ఆ నిర్బంధాలను పరోక్షంగా అనుభవిస్తున్నారు. ఆయన, ఆ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వివి ది ʹకమ్యూనిస్ట్ కుటుంబం.ʹఈ రోజుల్లో ఇది అతి అరుదైన విషయం.

విప్లవ రచయితల జీవితాల్లో ఎదురవుతోన్న నిర్బంధాలు వాళ్ళ కదిలికల మీద నియంత్రణ పెట్టగలవేమోగాని, వాళ్ళ సృజనాత్మకతను చంపలేవు. హొచిమిన్ నుంచి వరవరరావు దాకా కటకటాలనుంచి కూడా సమాజానికి విప్లవానికి నిబద్ధమయ్యే రచనలే చేశారు. ʹభూగోళమంతా ఒక విధ్వంస ప్రయోగంʹ (వివి) జరుగుతున్న వేళ మేధావి అలీనంగా ఉండలేడు. నక్సల్బరీ శ్రీకాకుళం ముషాహారీ నుంచి తెలంగాణ దాకా నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాట జ్వాలలు 1970 ల తరం దశ – దిశ ని నిర్దేశించాయ . వివి లాంటి వాళ్ళు ఆ ʹరక్త చలన సంగీత శృతి ʹ ని నిరంతరాయంగా ఆలపిస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ పంథా, మొక్కవోని స్వేచ్ఛా కాంక్ష ఈ రాజకీయ విశ్వాసానికి పునాది అయ్యింది. రాజ్యం కుట్రలని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నందు వల్లే విప్లవకారులు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు; రచయితలు రాజద్రోహం కుట్రకేసుల్లో మగ్గుతున్నారు. ఈ ప్రశ్నించే గొంతులపై అమలయ్యే నిర్బంధంలో భాగమే నిన్నటి సాయిబాబా నుంచి నేటి కాసీం వరవరరావుల దాకా అమలవుతున్న రాజ్యహింస. సాయిబాబా ʹ శరీరం 90 శాతం అశక్తతకు గురైనా, మిగిలిన ఆ 10 శాతమే భయపెడుతోందిʹ అని తీర్పు ప్రకటించడమంటేనే, ఎటువంటి మధ్య యుగాలనాటి శిక్షా స్మృతి ఇప్పటికీ అమలవుతుందో అర్థమవుతోంది.

80 ఏళ్ళు పైబడిన వివి లో ʹ ఒక ప్రమాదకరమైన నక్సలైట్ʹ ఉన్నట్లు న్యాయస్థానం పదేపదే అంటోంది. జాతీయ అంతర్జాతీయ మేధావులు రచయితలు ప్రముఖ పాత్రికేయులు దాకా వీరి విడుదల లేదా బెయిల్ గురించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా , అవేవీ పాలకుల చెవికెక్కటం లేదు. సాయిబాబా విషయంలో ఆయన సహచరి వసంత, వరవరరావు విషయంలో ఆయన సహచరి హేమలత, కాసీం విషయంలో ఆయన సహచరి స్నేహ పరోక్షంగా ఈ నిర్బంధపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయినా ఎంతో మనో నిబ్బరంతో వారి సహచరుల విడుదలకోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

1974 లో అఖిల భారత రైల్వే సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మెను బలపరుస్తూ తెచ్చిన ʹసృజన ʹ సంచిక ఎడిటర్ హేమలత. అదే పెద్ద రాజద్రోహ నేరంగా జడ్జి ఆమెకు జైలు శిక్ష విధిస్తూ ʹ ముగ్గురు ఆడపిల్లల తల్లియై కూడా ఆమెలో పశ్చాత్తాపం లేదు ʹ అంటాడు జడ్జి. ʹపశ్చిమాన సూర్యుడు ఉదయిస్తే, పశ్చాత్తాపం ప్రకటిస్తాను మైలార్డ్ ʹ అని ఆమె తరఫున వివి కవిత రాశారు. అప్పటినుంచే హేమలత వివి రాజకీయ విశ్వాసాల బాధ్యతను పంచుకోవడం మొదలయ్యింది. వివి ప్రతి అడుగులో అడుగై ఆమె సాగుతోంది. కుటుంబ సాహచర్యం కూడా ఒక ʹవిప్లవ విలువʹ గా ఉండబట్టే, ఈ నిర్బంధాలు వాళ్ళ గుండె నిబ్బరాన్ని దెబ్బతీయ లేకపోయాయి.

వరవరరావు వయస్సు 80ఏళ్ళు దాటుతోంది. ఆయన నడకకు, నడతకు రెండు ముఖాలు లేవు. ప్రభుత్వాలు గత 47 ఏళ్లుగా ఆయన్ని 25 కేసుల్లో ఇరికించి, విచారణ నెపంతో దీర్ఘకాలం వేధించాయి. ఈ అన్ని కేసుల్లోంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యాడు. 1973 అక్టోబర్ 10 న మొదలైన ఈ నిర్బంధాలు 2018 ఆగస్టు నెలలో బనాయించిన ʹ భీమా కోరేగావ్ ʹ కుట్రకేసు దాకా కొనసాగాయి. కనీస వసతులు కూడా కరువైన పూణేలోని యెరవాడ జైలులో 2018 నవంబర్ నుంచి వివిని మిగత సహా నిందితులతో పాటు నిర్బంధించారు. కోర్టులు బెయిల్ అప్పీళ్లను తిరస్కరిస్తున్నాయ. కనీసం జైలులో ములాఖత్ కూడా అనేక షరతుల మధ్య కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారు. ఒక్కోసారి అదీ అనుమతించరు. 2020 ఫిబ్రవరిలో నవీ ముంబై లోని ʹతలోజʹ జైలుకి తరలించారు. న్యాయవాదులను కూడా జైలులో కలువనివ్వని దారుణ నిర్బంధం అమలవుతోంది.

1975 నుంచి 2017 దాకా వరవరరావు రాసిన సుమారు 400 కవితలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వివి ʹతెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల ʹ మీద ప్రామాణికమైన పరిశోధనా గ్రంధం వెలువరించారు. గూగీ నవలలో కొన్ని అనువదించారు. జైలులో ఉన్నా బైట ఉన్నా ఆయన కలానికి విరామం లేదు; ఆయనకు విశ్రాంతి లేదు. పర్ స్పెక్టివ్స్ 1989 జులైలో వివి జైలు నుంచి రాసిన ʹసహచరులుʹ ప్రచురించింది. ఇదే ఆ తర్వాత ఇంగ్లిష్ లో వెలువడింది. 1990 జనవరిలో ʹసృజన సంపాదకీయాలుʹ మా నాలుగవ ప్రచురణగా తెచ్చాం. ఆ క్రమంలోనే 2008 జనవరి నుంచి 2019 జులై వరకూ గడిచిన 11 సంవత్సరాల కాలంలో వెలువడిన అల్లం రాజయ్య 6 సాహిత్య సంపుటాలకు వివి సంపాదకత్వం వహించారు. వాటికి 240 పేజీల ముందుమాటలు రాశారు. అవి నిజానికి ఆ రచనా కాలానికి అద్దంపట్టిన తెలంగాణ లోని నక్సలైట్ ఉద్యమ సాంస్కృతిక రాజకీయాల చరిత్ర. ఆయన తప్ప మరొకరు రాయలేని పొలిటికల్ డాక్యుమెంట్.

రాజకీయ ఉద్యమాలు, పార్టీలు ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ సమస్యలకు పరిష్కారం దొరకకుంటే చేజేతులా తిరిగి ఫాసిజం పడగ నీడన మగ్గిపోవాల్సి ఉంటుంది. సామాజిక సాంస్కృతిక రంగాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్ళు తమ నిరసనని పదేపదే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ʹఎవరూ చేయని నేరం / రచయితలే ఏం చేశారు?ʹ అన్న వరవరరావు ప్రశ్నకు జవాబు మరో ఉద్యమానికి సంసిద్ధం కావటమే. చివరిగా 1977 లో వరవరరావు అన్న మాటలని మరోసారి యాది చేసుకొందాం.

ʹనేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే
ఊరక కూర్చున్న
నోరున్న ప్రతివాడు నేరస్తుడే!
--ఆర్ కె
P E R S P E C T I V E S

(సారంగ వెబ్ మేగజైన్ సౌజన్యంతో)

Keywords : varavararao, hemaltha, srujana, saibaba
(2024-04-24 23:49:51)



No. of visitors : 851

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రెక్కవిప్పిన