మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న

మొదటితరం

దశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న. ఎనభైయవ దశకం వారికి ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ ప్రభావంలో ఉన్న వారందరికీ రైతుకూలీ సంఘం నర్సన్నగా ఆదర్శప్రాయుడు. ఆ కాలంలో విస్తృతంగా జరిగే ప్రతి సభ, సమావేశంలోనూ ముందువరుసలో నిలిచి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల రైతుకూలీ సంఘం నేతగా పాల్గొని ప్రసంగించేవాడు. తన సాదాసీదా మాటలతో సమాజంలో జరుగుతున్న వివక్ష, అణిచివేతలను గురించి విప్పి చెప్పే తీరు అందరినీ ఆకట్టుకునేది, ఆలోచింపజేసేది. ఎల్లప్పుడూ తెల్లని బట్టలతో కనిపించే నర్సన్న అంతే స్వచ్ఛమైన మనసున్నవాడు. విద్యార్థులుగా మేం చాలా చిన్న పిల్లలమైనా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని.. అంతా క్షేమమేనా అయ్యా.. అని పలుకరించే అతని మాటలు మా బోటి వారికి ఆయనలో ఓ కుటుంబ పెద్ద, తండ్రి, తాత కనిపించేవాడు. నాటినుంచీ నేటిదాకా ప్రజా సంఘాల కార్యకర్తలకు ఆయన పంచిన ప్రేమానురాగాలు మరుపురానివి.
ఎనభైయవ దశకం విద్యార్థులుగా సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఒకవిధంగా ఆయన వ్యక్తిత్వంతో ఉపన్యాసాలతో ఉత్తేజితులైన తరం మాది. ప్రజల గురించి, ముఖ్యంగా పేదల గురించీ ఆలోచించటం అంటే ఎంత బాధ్యతాయుత కార్యాచరణో, అది ఎంతటి ఉన్నతమైనదో ఆయన తన నిబద్ధ జీవితాచరణతో తెలియజెప్పాడు. ఆ రోజుల్లో విప్లవోద్యమ కార్యకర్తలు, సానుభూతిపరులందరికీ రైతు కూలీసంఘం నర్సన్న, ఆర్‌వైఎల్ ప్రభు, శ్రీనివాస్‌లు అన్నింట్లో ఆదర్శం. ఆ క్రమంలోనే జంటనగరాల్లో పెల్లుబుకిన విప్లవ విద్యార్థి ఉద్యమ విజయాల్లో వారి పాత్ర విడదీయలేనిది.
1986 నాటికి రాష్ట్రంలో ఆటా మాటా బంద్ అయ్యి నిప్పులు చెరిగే నిర్బంధ కాలంలో.. ఊహించనివిధంగా నర్సన్న బీహెచ్‌ఈఎల్ ప్రధాన గేట్ సమీపంలోని బస్తీలో ఎదురయ్యాడు. రాజ్యం అమలుచేసే నిర్బంధం ప్రజా కార్యకర్తలను ఏ రూపాల్లోకి మారుస్తుందో ఊహకందని కాలమది. ఎల్లప్పుడూ ప్రజల మధ్య నాయకుడిగా, మార్గదర్శిగా ఉండే నర్సన్న ఓ చిన్నపాటి గుడిసెలో కార్పెంటర్ వృత్తి చేస్తూ కనిపించాడు. నేను ఏంటన్నా.. అంటే... విప్లవోద్యమం నిర్దేశించిన మార్గంలో మన జీవితాలను మలుచుకోవాలని, తీర్చిదిద్దుకోవాలని చెప్పిన తీరు విప్లవాచరణలోని సృజనాత్మతకు అద్దం పట్టింది. ఆ క్రమంలో.. నా రాకను గురించి ఆయన ఎన్నడూ నన్ను అడుగలేదు, అలాగే ఆయన అక్కడ ఉండటం గురించి కూడా నేను ఆయన్ను అడుగలేదు. అదంతా విప్లవోద్యమ ఆవశ్యకతలు, అవసరాల్లోంచి ఆవిష్కరించుకున్న దృశ్యాలు. ఆ తర్వాత కాలంలో నేను ఎప్పుడు పోయినా అదే ప్రేమతో సాదరంగా ఆహ్వానించి దగ్గర కూర్చోబెట్టుకుని యోగక్షేమాలు అడిగేవాడు. ఎప్పుడు వెళ్లినా అన్నం తినమనేవాడు. తిని వచ్చానని చెప్పితే.. తిన్నోనివి ఎంత తింటవ్ తిను.. అని తిన్నదాకా కాలు కదుపనిచ్చేవాడు కాదు. కార్పెంటర్‌గా కలపతో సౌకోట్లు, దర్వాజా తయారుచేసే పనులు ఆపకుండా చేస్తూనే.. నేనున్నంత సేపూ ఏదో ఒకటి తన అనుభవాలు చెప్పేవాడు. ముఖ్యంగా విప్లవోద్యమ ఆరంభ కాలంలో పెద్దాయన కొండపల్లి సీతారామయ్యతో కలిసిన అనుభవాలు ఎంతో ఉత్తేజంగా చెప్పేవాడు. బహుశా నర్సన్న కొడుకు వేణు అప్పుడు పదేండ్లలోపు పిల్లవాడు. బక్కపలుచగా చంకకు బ్యాగేసుకొని బడికి పోతున్న వేణును అప్పుడే చూశాను. తన కొడుకును చూపిస్తూ.. ఇతను ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడో, ఈ ప్రజల కోసం ఏం పనిచేస్తాడోనని తన ఆశలన్నీ తన కొడుకుపైనే అని చెప్పకనే చెప్పేవాడు. సరిగ్గా ఆశయాల మార్గంలోనే వేణు జంటనగరాల విప్లవోద్యమంలో కీలక భూమిక నిర్వహించాడు. నగరంలో పుట్టి పెరిగిన భూమి పుత్రులుగా వేణు (రావణ), జంటనగరాల విప్తవోద్యమ నేత హయత్‌నగర్ సురేశ్ (ప్రభాకర్) అమరులు కాకుండా ఉంటే నగరంలో ఉద్యమనిర్మాణం మరోవిధంగా ఉండేది. వీరిద్దరూ కొద్దికాలం తేడాతో రాజ్యం చేతిలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులవటం జంటనగరాల విప్లవోద్యమానికి తీరని లోటు.
నర్సన్న జీవితం ఆసాంతం విప్లవాశయంతో ముడివేయబడింది. అతను ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా విప్లవోద్యమంలో భాగంగా తనదైన పాత్ర పోషించాడు. ప్రజా సంఘాల్లో తనదైన పాత్ర పోషిస్తూనే, యువతరానికి ఓ పెద్ద బాల శిక్షగా పనిచేశాడు. తనదైన వ్యక్తిత్వంతో, కార్యాచరణతో నేటి తరానికి స్ఫూర్తి నింపాడు. ప్రజసంఘాల కార్యక్రమాలన్నింటిలో అగ్రభాగాన ఉంటూ ఉద్యమ పతాకగా నిలిచాడు. 90ల చివరి రోజుల నుంచి ప్రభుత్వ నిర్బంధం పెరిగి అమరుల జాడలు కూడా మాయం చేయబడుతున్న గడ్డుకాలమొకటి వచ్చింది. నగరాలు మొదలు అటవీ ప్రాంతంలో అమరులైన వారిని గుర్తుతెలియని వారుగా ప్రకటించి అనామక శవాలుగా పోలీసులే పూడ్చివేస్తున్న దుర్మార్గ పరిస్థితుల్లో అమరుల బంధుమిత్రుల సంఘం పురుడు పోసుకున్నది. ఆ క్రమంలో కన్న కొడుకును విప్లవోద్యమానికి అందించిన త్యాగశీలిగా నర్సన్న అమరుల బంధుమిత్రుల సంఘానికి ముందుండి నడిపించాడు. అమరుల బంధు మిత్రుల సంఘం నాయకునిగా ఆయన రెండు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు, సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో అడవులు, పట్టణాలు అనకుండా కాలుకు బలపం కట్టుకొని తిరిగాడు. ఎదురు కాల్పుల పేరిట రాజ్యం బలిగొన్న విప్లవకారుల దేహాలను తల్లిదండ్రులకు అప్పగించటంతో పాటు, పోరాటయోధులు తమ చివరిశ్వాస దాకా వారు కలలుగన్న సిద్ధాంతాలు, విలువలకు అనుగుణంగా వారిని సగౌరవంగా విప్లవ సాంప్రదాయాలకు అనుగుణంగా వారి అంతిమయాత్రలను నిర్వహించటంలో నర్సన్న పాత్ర ఎనలేనిది.
నలభై ఏండ్లుగా విరామమెరుగని విప్లవాచరణలో నర్సన్న ఎన్నడూ అనారోగ్యం, అలసట ఎరుగడు. ఈ సుదీర్ఘకాలంలో జరిగిన అన్ని అందోళనలు, ఉద్యమాచరణలన్నింటిలో ఆయన నిత్యనూతనంగా ప్రతి సందర్భంలోనూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఎన్నడు లేనిది అమరుడు కావటానికి రెండు రోజుల ముందు కనిపించినప్పుడు కొంత డల్‌గా కనిపించాడు. ఏంటన్నా.. ఆరోగ్యం బాగా లేదా అని అడిగితే.. ఏం లేదయ్యా.. కొంత అలసటగా ఉన్నదని ఎప్పటిలాగానే తన సొంతమైన, స్వచ్ఛమైన తెల్లని నవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ అలసటనే నిత్య పోరాటయోధున్ని శాశ్వత విరామంలోకి తీసుకుపోవటం ఊహించనిది. చివరి మాటలుగా కూడా తన సహచరితో మాట్లాడుతూ.. అందరి వలె నేను పోయాక నీవు బొట్టు, గాజులు తీయొద్దు. అవి మహిళలుగా మీకు సహజసిద్ధంగా, హక్కుగా వచ్చిన వ్యక్తీకరణలు, ఆబరణాలని తెలియజెప్పుతూ ఎట్టి పరిస్థితిలోనూ బొట్టు, గాజులు తీయొద్దని జీవిత సహచరి అండాలమ్మ దగ్గర హామీ తీసుకొని కన్నుమూశాడు నర్సన్న. చివరిశ్వాస దాకా తాను కలలుగన్న సమ సమాజం కోసం పోరాటయోధుడిగా అలుపెరుగని పోరాటం చేయటమే కాకుండా ఒక నూతన మానవీయ శాస్త్రీయ విలువల కోసం పాటుపడ్డాడు నర్సన్న. బంధువులు, ఇరుగుపొరుగు వారు ఎంతగా వత్తిడి చేసినా.. నర్సన్న జీవిత సహచరిగా నర్సన్న బాటలో నడుస్తున్న విప్లవ మాతృమూర్తి అండాలమ్మకు జేజేలు. నర్సన్న జీవితాచరణ ఈ తరానికి స్ఫూర్తిదాయకం, అనుసరణీయం. సకల దోపిడి పీడనలు, వివక్షలు, అసమానతలు లేని మానవీయ సమాజం కోసం నర్సన్న ఆశయాలను ముందుకుతీసుకుపోవటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
- దాము

Keywords : narsanna, ravana, venu, revolutionary,
(2024-04-24 23:50:33)



No. of visitors : 1113

Suggested Posts


అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?

పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.

ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు

ఈ జూలై 18కి అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడి 20 ఏళ్లు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాన్ని ఇరవై వసంతాల వేడుకగా జరుపుకుంటారు. మేం ఆ మాట అనలేకపోతున్నాం. ఇది వసంతమూ కాదు, వేడుకా కాదు.

విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !

కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు.

అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మొదటితరం