వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ
వరవరరావును విడుదల చేయాలని, అందాకా హాస్పటల్ కు పంపి చికిత్సచేయించాలని
భారతదేశ హోం మంత్రి అమిత్ షా గారికి,
హొం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డిగారికి
మాజీ కేంద్ర సమాచార కమిష్నర్ మాడభూషి శ్రీధర్
వినతి
ఇప్పుడు మహారాష్ట్ర జైల్ లో అనారోగ్యంగా ఉన్న ప్రముఖ కవి వరవరరావు ను జైలునుంచి లేదా జైలు దవాఖాన నుంచి మంచి హాస్పటల్ కు పంపి చికిత్చ చేయించాలని మీకు నా విజ్ఞప్తి. న్యాయపరంగా, సమన్యాయపాలన పరంగా ఆలోచించినా, మానవతా విలువల కోణం నుంచి పరిశీలించినా, వరవరరావును జైల్లో ఉంచాల్సిన ఆగత్యం లేదు. వరంగల్లు సికె ఎం కళాశాలలో తెలుగు అథ్యాపకుడు, కవి వరవరరావు 80 సంవత్సరాల పైబడిన వయసులో ప్రభుత్వయంత్రాంగానికి దొరకకుండా ఎక్కడికో వెళ్లే అవకాశం లేదు కనుక ఆయనకు ప్రస్తుత చట్టాల ప్రకారం బెయిల్ పొందే హక్కు ఉంది కనుక జైలునుంచి విడుదల చేయాలి. ఆ విధి విధానాలకు సమయం పడుతుందనుకుంటే ఆయనను వెంటనే హాస్పటల్ కు పంపి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చికిత్స చేయించాలి. సికె ఎం కళాశాల విద్యార్థిగా, న్యాయశాస్త్ర పరిశోధకుడిగా నేను ఇద్దరు హో మంత్రులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా వరవరరావును వ్యక్తిగతంగా ఎరిగిన హైదరాబాద్ ప్రజాప్రతినిధి కిషన్ రెడ్డిగారు చొరవతీసుకుని అమిత్ షాకు ఇతర సంబంధిత పెద్దలకు ఈ అవసరాన్ని తెలియజేసి వరవరరావును విడుదల చేయడానికి, ఆయన్ను కాపాడుకోవడానికి సహాయం చేయాలని నేను కోరుతున్నాను.
వరవరరావు ఫోన్ చేసినపుడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారనీ, ఏవేవో పాత మాటలు అసంగత విషయాలను చెబుతున్నారని, అవి విన్నతరువాత ఆయన శారీరక మానసిక స్థితి ఆందోళన కరంగా ఉందని మాకు అనిపిస్తున్నదని కుటుంబ సభ్యులు – భార్య హేమలత, కూతురు పవన, బావమరిది ఎన్ వేణుగోపాల్ విలేకరులతో చెప్పి ఆవేదన చెందుతున్నారు. తన తండ్రి అంత్య క్రియల గురించి వరవరరావు మాట్లాడుతుంటే భయపడుతున్నారు. వరవరరావుతోఫోన్ చేసినప్పుడు, రిసీవర్ తీసుకునివారి సహ ఖైదీ వెర్నాన్ గాన్ సాల్వే గారు ఆయన పరిస్థితి బాగా లేదని, సరిగ్గా నడవలేకపోతున్నారనీ, స్వయంగా పళ్లు తోముకోవడం, టాయిలెట్ కు వెళ్లడం కూడా కష్టమైపోతున్నది చెప్పారని భార్య హేమలత ముగ్గురు కూతుళ్లు పాత్రికేయులకు వివరించారు. దీన్ని బట్టి వరవరరావుకు వెంటనే వైద్య సదుపాయం ఉండే హాస్పటల్ కు వెళ్లాలని అర్థమవుతున్నది.
భీమ్ కొరేగావ్ కేసులో బందీలుగా ఉన్న 11 మందిలో వరవరరావు వయసులో పెద్దవారు. మహారాష్ట్రజైల్లో ఖైదీలు కిక్కిరిసి ఉన్నారు. జనవరి 2018లో భీంకొరెగావ్ లో జరిగిందని ఆరోపిస్తున్న సంఘటనలో వరవరరావుకు ప్రమేయం ఉందని కేవలం అనుమానం తప్ప మరే ఆధారమూ లేదు. కరోనా వ్యాధి దృష్ట్యా తలోజా జైల్లో రద్దీని తగ్గించాలన్న నియమం ప్రకారమైనా వరవరరావును విడుదల చేయడం అవసరం. ఈ లెక్కన 897 మంది ఖైదీలను తలోజా నుంచి విడుదల చేయాలి. ఈ పరిస్థితుల్లో వరవరరావును తలోజా జైల్లో ఉంచడం, ఆయనకు, అక్కడి వారికి కూడా మంచిది కాదు.
రక్తంలో ఎలక్ట్రొలైట్ల సమతౌల్యత లేక, సోడియం స్థాయిపడిపోయిందని, లీటర్ కు 135 – 145 మధ్య ఉండవలసిన సోడియం కణాలు కేవలం 113.16 మాత్రమే ఉన్నాయని ది కారవాన్ పత్రికవారు మెడికల్ రిపోర్టులు చూసి చెబుతున్నారు. పోటాషియం కణాలు కూడా సాధారణ స్థితికన్న తగ్గిపోయాయి. ఈ లక్షణాలకు చికిత్స చేయకపోతే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది.
ఈ మధ్య వరవరరావుకు ఆరోగ్యం బాగాలేక హాస్పటల్ కు తీసుకువెళ్లి ఆ తరువాత తొందరపడి మళ్లీ జైలుకు పంపించారు. తరువాత ఆయన ఆరోగ్యం గురించి అసలు సమాచారమే ఇవ్వడం లేదు. జెజె హాస్పటల్ లో చికిత్స చేసిన తరువాత మరోసారి సమీక్షించడానికి అక్కడికి తీసుకువెళ్తారో లేదో తెలియదు. నెలరోజుల్లో ఆ విషయమై ఏమీ చేయలేదు. జెజె వైద్యులు చెప్పినరీతిలో చికిత్సచేసారా లేదా, చేస్తే ఏమయింది? ఆరోగ్యం చేకూరకపోతే మళ్లీ ఆ డాక్టర్లను అడగాలి కదా? వరవరరావు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆయనను కనీసం వీడియో కాన్ఫరెన్స్ లో చూడడానికి కూడా అనుమతించడం లేదు. ఇప్పుడు జైలు అధికారి సునీల్ రామానంద్ హిందూపత్రిక విలేకరితో మాట్లాడుతూ వీడియోలో మాట్లాడించే ప్రయత్నాలుచేస్తానన్నారు. ఎప్పుడుచేస్తారు?
కుటుంబ సభ్యులతో కేవలం రెండు నిమిషాలు మాత్రామే మాట్లాడనిస్తారు. అప్పుడే ఆయన స్థిమితంగా మాట్లాడడం లేదని తెలిసింది. ఎప్పుడూ లేంది ఆయన హిందీలో మాట్లాడుతున్నారు.
వరవరరావు పైన ఆరోపణలు దర్యాప్తులు సాక్ష్యాలు ఉన్నాయని అనుకున్నా ఆయనకు కేసు విచారణ ముగిసే దాకా బతికే హక్కు, ఆరోగ్యంగా ఉండే హక్కు, తమ కుటుంబ సభ్యులను కలుసుకుని తన ఆరోగ్యం గురించి తెలియజేసే హక్కుఉంది. వారి కుటుంబ సభ్యులకు కూడా వరవరరావు సమాచారం హోం మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకునే హక్కు ఉంది.
టెర్రరిస్టు, లేదా కరడు కట్టిన నేరస్తుడికి సంబంధించిన వారికి ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఉరి శిక్ష వేయాలని సుప్రీంకోర్టు నిర్ధారించిన తరువాత కూడా ఖైదీల ఆరోగ్యం కాపాడాలని, ఆవిషయాలు కుటుంబాలకు తెలియజేయాలని జైలు న్యాయసూత్రాలు ప్రపంచమంతటా చెబుతున్నాయి. ఆయన హక్కులను, వారి కుటుంబసభ్యుల హక్కులను అమలు చేసి గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.
రాజకీయ సైద్దాంతిక విభేదాల పైన ఎవ్వరినీ శిక్షించడానికి వీల్లేదని మీకూ తెలుసు. వరవరరావుమీద ఫిర్యాదే లేదని, ఆరోపణ ఇంతవరకు రూపు దిద్దుకోలేదని, అనుమానాలకు కూడా ఆధారాలు లేవని, దర్యాప్తు ఎన్నేళ్లయని ముందుకు పోవడం లేదని, దస్తావేజులు చూస్తూ ఇద్దరు హోం మంత్రులకు కూడా తెలిసిపోతుంది. ఎవరూ అడగకపోయినా ఫైళ్లు చూసి న్యాయం చేయవలసిన బాధ్యత మంత్రులకు ఉంటుంది.
80ఏళ్లకు పైబడిన ఈ ఉపాధ్యాయుడు కవిత్వం రాయడం తప్ప చేసిన నేరమేమీ లేదు. జైలు శిక్ష విధించాల్సిన ఏ నేరం చేసారో ఇంతవరకు చెప్పకుండా ఇంతకాలం నిష్కారణంగా ఇంత వృద్ధుడిని జైల్లో బంధించడం చట్టబద్దమైన పని కాదు
ఇంకా దర్యాప్తు చేయాలనుకున్నా, అనుమానం తీరేదాకా పరిశోధించాలనుకున్నా ప్రభుత్వ యంత్రానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అందుకే వారికి బెయిల్ ఇచ్చి అందాకా విడుదల చేయాలని చట్టాలు చెబుతున్నాయి. ఇంకా ఆయనను విడుదల చేయకుండా, బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించాలని ప్రభుత్వం అనుకుంటే అది ఏమాత్రం న్యాయం కాదని న్యాయశాస్త్ర విద్యార్థిగా నేనుచెప్పగలను. అయితే చరిత్ర సంస్కృతి, న్యాయం, ధర్మం అని మాట్లాడుకునే మనమంతా రాజ్యాంగ నీతి నియమాలు, నేర న్యాయ విధానాలను అనుసరించి ఆయనను ఒక హాస్పటల్ కు పంపడం అనేది కనీసమైన మానవతా విలువ అనిపించుకుంటుంది. ఎన్ ఐ ఎ అధికారులు, వారికి సలహాలిచ్చే న్యాయాధికారులు, ఇద్దరు హోం మంత్రులు తమ విచక్షణాధికారాన్ని వినియోగించి వరవరరావును విడుదల చేయాలని, హాస్పటల్ కు పంపాలని, కుటుంబ సభ్యులతో వారి సమావేశం ఏర్పాటు చేయాలని, వారికి ఎప్పడికప్పుడు పూర్తి సమాచారం ఇవ్వాలని నేను హోంమంత్రి అమిత్ షా, జి కిషన్ రెడ్డి గార్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు
మాడభూషి శ్రీధర్ 13.7.2020
Keywords : amit shah, kishan reddy, madabhushi sridhar, maharashtra, jail, health
(2024-04-24 23:52:57)
No. of visitors : 817
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |