బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన‌

బాలికల

బిలాస్‌పూర్‌లో ఎన్‌జిఓ నడుపుతున్న బాలికల ఆశ్రయ గృహం ʹమా ఇల్లుʹ ఆశ్రమంపై పోలీసులు దాడి చేసి పిల్లలను హింసించి, న్యాయవాది ప్రియాంక శుక్లాను అరెస్టు చేయడాన్ని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తీవ్రంగా ఖండించింది. పీయూసీఎల్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ – ఛత్తీస్‌ఘడ్ చాప్టర్
బాలికల గృహంలో పోలీసుల హింసాకాండను,
న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టును పియుసిఎల్ తీవ్రంగా ఖండిస్తూంది
ʹఅప్నా ఘర్ʹ (మా ఇల్లు) బాలికల గృహం సిబ్బంది మీద దౌర్జన్యం చేసి, అక్కడ నివసిస్తున్న హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలను బలవంతంగా అపహరించుకు పోయిన సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకోడానికి ప్రయత్నం చేసిన మా సంస్థ సభ్యురాలు, న్యాయవాది ప్రియాంక శుక్లాను 17.08.2020 న బిలాస్‌పూర్ పోలీసులు దారుణంగా హింసించి అరెస్టు చేయడాన్ని పియుసిఎల్ తీవ్రంగా ఖండిస్తూంది.
హెచ్‌ఐవి పాజిటివ్ పిల్లల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి బిలాస్‌పూర్‌లో ఎన్‌జిఓ నడుపుతున్న బాలికల ఆశ్రయ గృహం ʹమా ఇల్లుʹ మాత్రమే ఉందనీ, ఆ ఆశ్రయ నిర్వహణ, సదుపాయాలు సంతృప్తికరంగా వున్నాయని అక్కడ నివసిస్తున్న బాలికలు, వారి కుటుంబాలు మీడియా ముందు పదేపదే చెప్పారు. "మా ఇల్లు" రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని నోటీసులు రావడంతో న్యాయ సహాయం కోసం న్యాయవాది ప్రియాంక శుక్లాను సంప్రదించారు. తమ సంస్థకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఇవ్వడానికి అధికారులు అడిగిన లంచం ఇవ్వడానికి ఇష్టపడకపోవటంతో ఈ వేధింపులు మొదలయ్యాయని వారు చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, న్యాయవాది ప్రియాంక శుక్లా, ఆమె సహచరులు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న అధికారుల ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. అయితే, అధికారులు మళ్లీ తమ ప్రయత్నాలను
17.08.2020 ఉదయం, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, శిశు సంక్షేమ కమిటీ సిబ్బంది, సర్కండ పోలీస్ స్టేషన్ పోలీసు బలగాలతో కలిసి వచ్చి , 14 మంది పిల్లలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మొదటగా వారు సిసిటివి కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి, అమ్మాయిలందరినీ ఒక గదిలోకి నెట్టి , వారిపై శారీరకంగా దాడి చేశారు అనడానికి రక్తపు మరకలు సాక్ష్యంగా వున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేస్తున్నప్పటికీ వారిని జుట్టు పట్టుకొని లాక్కెల్లి , వాహనంలోకి తోసేసి తీసుకెళ్లిపోయినట్లు మీడియా ఇంటర్వ్యూ చేసిన ఇరుగుపొరుగువారు చెప్పారు.
అడ్వకేట్ శుక్లా అక్కడికి చేరుకుని, బాలికలను తీసుకెళ్లడానికి తెచ్చిన ఉత్తర్వులను చూడాలని డిమాండ్ చేసినప్పుడు, ఆమె మీద కూడా దాడి చేసి, వేధింపులకు గురిచేసి, చివరకు అరెస్టు చేసి, ఐపిసి 353 సెక్షన్ కింద (ప్రభుత్వాధికారులను విధి నిర్వహణలో అడ్డగించడం)అభియోగం మోపారు. సిడబ్ల్యుసి అధికారి పార్వతి వర్మ చెప్పడంతో ఎఫ్‌ఐఆర్‌లో ʹమా ఇల్లుʹ డైరెక్టర్ సంజీవ్ ఠక్కర్, హాస్టల్ సూపరింటెండెంట్ దీపికా సింగ్‌ల పేరు కూడా చేర్చారు. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా, వారి కుటుంబాల సమ్మతి లేకుండా, వారి నాజూకైన ఆరోగ్య స్థితిని దృష్ట్యా కావల్సిన భద్రత, సంరక్షణల గురించి ఏ మాత్రం సంవేదనాదృష్టి లేకుండా వారందరినీ వేర్వేరు బాల గృహాలలో వుంచారు.
బిల్హాలో మేజిస్ట్రేట్ అడ్వకేట్ ప్రియాంక శుక్లాను బెయిల్ పై విడుదల చేసినందుకు మాకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఈ ప్రకరణ మొత్తం చాలా ఆందోళనకరంగా ఉంది. తన క్లయింట్ పట్ల విధులను నిర్వర్తించే న్యాయవాదిపై దాడి చేసిన పోలీసుల దౌర్జన్యాన్ని చూసి మేము దిగ్భ్రాంతి చెందాం. తమను ప్రశ్నించిన వారందరిపైనా, అందులోనూ అనారోగ్యంతో ఉన్న బాలికలపై కూడా పోలీసులను క్రూర హింస ప్రయోగించారు. చివరగా, HIV పాజిటివ్ పిల్లలు, వారి కుటుంబాల ప్రత్యేక అవసరాల గురించి CWC విభాగానికి ఏ మాత్రం సంవేదనాశీల దృష్టి లేదు.
మా డిమాండ్స్:
1. "మా ఇల్లు" ఆశ్రయంలో హింసకు కారణమైన పోలీసులు, సిడబ్ల్యుసి అధికారులపై అభియోగాలు దాఖలు చేసి తగిన చర్యలు తీసుకోవాలి.
2. న్యాయవాది ప్రియాంక శుక్లా, మా ఇంటి కార్యనిర్వాహకులు సంజీవ్ ఠక్కర్, దీపికా సింగ్‌లపై పెట్టిన అన్ని ఆరోపణలను ఉపసంహరించుకోవాలి.
3. "మా ఇల్లు" లో వుండిన 14 మంది బాలికలకు, ప్రత్యేకించి కరోనా విపత్తు ఉధృతంగా ఉన్న సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వారి ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు సురక్షితమైన గృహవసతి కల్పించాలి. వారిలో పరస్పరం వున్న సన్నిహిత సంబంధాలను గుర్తించి వారందరినీ ఒకే దగ్గర ఉంచాలి కల్పించి, సరైన వైద్య సదుపాయాలు, వారు ఎదుర్కొన్నా మానసిక ఆందోళనను తగ్గించడానికి తగిన కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి.
డిగ్రీ చౌహాన్, అధ్యక్షులు
శాలిని గేరే, కార్యదర్శి.

Keywords : PUCL, Chattisgarh, priyanka shukla, police
(2024-04-25 00:01:29)



No. of visitors : 754

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


బాలికల