ఛత్తీస్గడ్ లో నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, తప్పుడు కేసులు
ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న జర్నలిస్టులపై నిరంతర వేధింపులు కొనసాగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టిజైలుకు పంపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వార్తాపత్రికలలో రాసే, సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలనువ్యక్తీకరించే జర్నలిస్టులను రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు.
బస్తర్లో కరోనా కాలంలో గిరిజన సమస్యలపై నిరంతరం రాసిన జర్నలిస్ట్ మంగల్ కుంజమ్ను నిర్బంధించే కుట్ర రాజ్య ఆదేశం మేరకు జరుగుతోంది. దంతేవాడ జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ 2020 జూలై 25న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో జర్నలిస్ట్ మంగల్ కుంజమ్, అతని కుటుంబసభ్యులపై అనుమానాస్పదులుగా పోలీసులు నిఘా పెడుతున్నారని, సమాచారం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. పరిపాలనా అవినీతిని బహిర్గతం చేసినందుకు కాంకేర్లోని ʹబస్తర్ బంధుʹ పత్రిక జర్నలిస్ట్ సుశీల్ శర్మను మేనెలలో అరెస్టు చేశారు.
బస్తర్లో, జర్నలిస్టులు ప్రభాత్ సింగ్, మంగల్ కుంజమ్, సుశీల్ శర్మలపై అబద్ధపు ఆరోపణలు చేసి విచారణ చేపట్టడంలో, వారిని భయభ్రాంతులను చేసి, నిజాయితీగా, న్యాయమైన జర్నలిజాన్ని చేయడం మానేయాలని ఒత్తిడి తేవడమూ, ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులను విమర్శించడమూ, వారి అకృత్యాలను ప్రెస్లో బహిర్గతం చేయకూడదనే సందేశం యివ్వడమూ అనే ఉద్దేశ్యం యిమిడిఉంది.
న్యూస్ 24, ANI, PTI లలో మనీష్ కుమార్ సోనీ సీనియర్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. సర్గుజా పోలీసులు తన జర్నలిజం పట్ల సంతోషంగా లేరని మనీష్ సోని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తనపై దేశద్రోహం కేసుపెట్టి తప్పుడు కేసులో ఇరికిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చారు.
అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది మార్చిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్పై "అభ్యంతరకరమైన" సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడని ఎఫ్ఐఆర్ నమోదైంది. జర్నలిస్ట్ మనీష్ కుమార్ సోనిపై 2020 ఆగస్టు 16 న అంబికాపూర్ పోలీస్ స్టేషన్లో ఐదు నెలల పాత ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా సుర్గుజా పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 153 (ఎ), 153 (బి), 505 (2) సెక్షన్ కింద నేరాన్ని నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్పొరేటర్ అలోక్ దుబే చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు.
"ఫిర్యాదుపై విచారణ జరిపి దర్యాప్తు సోని చేసిన పోస్ట్ ఒక ఆదివాసీ సముదాయాన్ని అవమానించిందనీ, అది వారిని రెచ్చగొట్టే ప్రయత్నమని నిర్థారించింది" అనీ, యింకా ఎవరినీ అరెస్టుచేయలేదని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సుర్గుజా రేంజ్) రతన్ లాల్ డాంగి చెప్పారు.
మార్చి 21 న, సుక్మా జిల్లాలోని మిన్పా గ్రామ సమీపంలో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) కు చెందిన పదిహేడు మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఆ సందర్భంలో సోనీ 2020 మార్చి 25న మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన భద్రతా సిబ్బంది ఫోటోలను పెట్టి సోని తన ఫేస్బుక్ ఖాతాలో హిందీలో ఈ వ్యాఖ్యతో పోస్ట్ చేసారు. ʹచనిపోయిన వాళ్ళ కులం చూడండి… అలాగే చంపిన వాళ్ళది కూడా చూస్తే అందరిదీ ఒకటే కులం అయి వుంటుంది. ఇప్పుడు చంపించినవాళ్ళ గురించి అర్థం చేసుకోండి.... సమాధానం దొరుకుతుంది..... యిప్పుడు వీరిని అమరులని, వారి అమరత్వానికి సలాం చేసి మళ్ళీ జరగబోయే ఘటన కోసం ఎదురుచూడండి... ఆదివాసీలను ఆదివాసీలతో కొట్లాడించడం ద్వారానే అడవిని స్వాధీనం చేసుకోవచ్చు.....ʹ
"గత ఒక సంవత్సరం నుండి పోలీసు కస్టడీలో జరిగిన ఆదివాసీ యువకుడు పంకజ్ బైక్ మరణం గురించి నేను నిరంతరం రిపోర్టు చేస్తున్నాను కాబట్టి, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నాను, బాధితులకు న్యాయం జరగడానికి మద్దతు ఇస్తున్నాను. చిన్న, చిన్న సంఘటనల కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమస్య గురించి నేను చాలా సందర్భాలలో సీనియర్ పోలీసు అధికారులకు లేఖ రాశాను కాని ప్రయోజనం లేకపోయింది"అని సోని చెప్పారు.
2019 లో పంకజ్ బెక్ అనే ఆదివాసీ యువకుడు పోలీసుల అదుపులో వున్నప్పుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, పంకజ్ బెక్ కస్టడీ నుండి పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాని పంకజ్ బెక్ పోలీసుల అదుపులో వున్నప్పుడే మరణించారని అతని కుటుంబం ఆరోపించింది. ఈ కేసులో పోలీసులపై విచారణ పెండింగ్లో ఉంది. పంకజ్ బెక్ ప్రకరణలో తన రిపోర్టింగ్ ద్వారా జర్నలిస్ట్ మనీష్ సోని పోలీసుల కథనం, పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. అదే క్రమంలో, పోలీసు అధికారులు జరిపిన విలేఖరుల సమావేశంలో పంకజ్ బెక్ కేసుకు సంబంధించి లేవనెత్తిన న్యాయమైన ప్రశ్నలు పోలీసు శాఖకు, పోలీసు అధికారులకు నచ్చలేదు. అప్పటి నుండి, అతన్ని దేశద్రోహం తదితర సెక్షన్ల క్రింద కేసు పెట్టవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ డైరెక్టర్ జనరల్, రాయ్పూర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుర్గుజా రేంజ్ లకు లేఖ ద్వారా తెలియచేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ విచారణ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మునుపటి బిజెపి పాలనలో జర్నలిస్టులను వేధించడం గురించి వచ్చిన వరుస ఫిర్యాదుల వల్ల కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల రక్షణ కోసం ఒక చట్టాన్ని ప్రవేశపెపెడ్తానని యిచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక మరిచిపోయింది.
మీడియా సిబ్బంది రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని కమిటీ ఒక బిల్లును రూపొందించింది. రాష్ట్రంలో వాక్స్వాతంత్ర్యాన్ని, మీడియా వ్యక్తీకరణను పరిరక్షించే బిల్లును రూపొందించడానికి ఈ కమిటీని ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం, ప్రజా సేవకుడిగా, జర్నలిస్టులను రక్షించడంలో తాను ఈ చట్టం ప్రకారం నిర్వర్తించాల్సిన విధులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్టే కనక నిర్ణయించిన మేరకు లేదా ఒక సంవత్సరం వరకు, జైలు శిక్ష విధించవచ్చు.
(janchowk.com, timesofindia.indiatimes.com, సౌజన్యంతో)
Keywords : chattis garh , journalists, police case, chhattisgarh journalists questioning government policies are being implicated in fake cases
(2024-04-25 00:01:38)
No. of visitors : 734
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |