కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
విరసం సభ్యుడు, సీనియర్ జర్నలిస్టు కెవి కూర్మనాథ్, ప్రొ. కె. సత్యనారాయణ లకు ఎన్.ఐ.ఎ. సమన్లు పంపించడాన్ని ఖండిస్తూ విప్లవ రచయితల సంఘం విడుదల చేసిన ప్రకటన...
విరసం సభ్యుడు, కథా రచయిత కెవి కూర్మనాథకు, ప్రొ. కె. సత్యనారాయణకు ఎన్.ఐ.ఎ. సమన్లు
భీమా కొరేగావ్ కేసులో ఇరికించాలనుకుంటున్న ఎన్.ఐ.ఎ. కుట్రను ఖండించండి
ప్రముఖ కథా రచయిత, విరసం సభ్యుడు, పాత్రికేయుడు కా. కెవి కూర్మనాథ్ కు భీమా కొరేగావ్ కేసులో సాక్ష్యం చెప్పడానికి రమ్మని ఎన్.ఐ.ఎ. సమన్లు ఇచ్చింది. ఇప్పటికే నిరాధారంగా, అక్రమంగా, రాజకీయ దురుద్దేశంతో దేశవ్యాప్తంగా 12 మంది మేధావులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులను రెండేళ్లకు పైగా జైలులో నిర్బంధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రొఫెసర్లు, లాయర్లు, పాత్రికేయులను విచారణ పేరుతో వేధిస్తోంది.
ఇటీవలే విరసం కార్యవర్గ సభ్యుడు కా. క్రాంతిని వారం పాటు విచారణతో వేధించారు. ఢిల్లీకి చెందిన ప్రొ. హనీబాబును విచారణకు పిలిచి అరెస్టు చేశారు. ఆ తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లను ఈ కేసులో సాక్ష్యం కోసమని ఎన్.ఐ.ఎ. పిలుస్తోంది. తాజాగా కూర్మనాథ్ ను, ప్రొ. సత్యనారాయణను ఈ నెల 9న విచారణకు రావాలని సమన్లు ఇచ్చింది. వీరిని కూడా భీమా కొరేగావ్ కేసులో ఇరికించే కుట్రలో భాగమే ఈ సమన్లని విరసం భావిస్తోంది.
కూర్మనాథ్ గత ఇరవై ఏళ్లుగా కథలు రాస్తున్నారు. ఇప్పటికి రెండు సంపుటాలు విడుదల చేశారు. తెలుగు కథా ప్రపంచంలో పేరెన్నికగన్న కూర్మనాథ్ వృత్తిరీత్యా పాత్రికేయుడు. ది హిందూలో పని చేస్తున్నారు. నగర జీవిత సంక్లిష్టతలను, పాత్రికేయ జీవితంలోని సంక్షోభాలను, ఆధునిక సాంకేతికతలో మాయమవుతున్న మానవీయ దృష్టి కోణాలను ఆయన తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రిస్తున్నారు. వ్యవస్థ అత్యంత అమానుషంగా మారే క్రమంలో పెరిగిపోయే హింసారూపాలను కాల్పనీకరిస్తున్నారు. బాల్యపు ప్రపంచంలోని సున్నిత కోణాలను పెద్దల కోసం తన కథల్లో ఆవిష్కరిస్తున్నారు. వ్యవస్థ అసంబద్ధతను చిత్రించే సృజనకారుడిని ఒక అబద్ధపు కుట్ర కేసులో సాక్ష్యం చెప్పమని పిలవడమే మన రాజ్య వ్యవస్థ అసంబద్ధతకు, దుర్మార్గానికి నిదర్శనం.
2018లో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు అరెస్టు సందర్భంగా హైదరాబాదులో క్రాంతి, కూర్మనాథ్, ప్రొ. సత్యనారాయణల ఇండ్ల మీద దాడులు చేశారు. రోజంతా సోదా చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రొ. సత్యనారాయణ ఇఫ్లూ యూనివర్సిటీలో అధ్యాపకుడు. ఆయన ఇంటి మీద రైడ్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను, విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఆయన సేకరించుకున్న విలువైన పరిశోధన గ్రంథాలను, రాసుకున్న పత్రాలను ఎన్.ఐ.ఎ. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిశోధకుడిగా, సామాజిక విశ్లేషకుడిగా ఆయన దేశవ్యాప్తంగా పేరున్న వ్యక్తి. సుదీర్ఘకాలంగా దళితుల, బలహీనవర్గాల పక్షాన తన మేధస్సును వెచ్చించి విలువైన విశ్లేషణలు సమాజానికి అందించారు. తెలుగులో, ఇంగ్లీషులో ఎన్నో రచనలు చేశారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా గొంతువిప్పి వాళ్ల పక్షాన నిలబడ్డారు. ప్రొఫెసర్ గా విశ్వవిద్యాలయంలోనేగాక సమాజంలో కూడా ప్రజాస్వామిక విలువల కోసం, సమానత్వ సంస్కృతి కోసం పని చేయాల్సి ఉంటుందనే అవగాహన ఉన్న బుద్ధిజీవి.
వీళ్లు ఏనాడూ నేరపూరిత ఆలోచన కూడా చేసి ఉండరు. నేరమయ వ్యవస్థపట్ల తమ భిన్నాభిప్రాయాన్ని రచనల్లో వ్యక్తం చేసి ఉంటారు. ఇప్పుడు రాజ్యం వాళ్ల చుట్టూ భీమా కొరేగావ్ అబద్ధపు కుట్ర కేసును అల్లే ప్రయత్నం చేస్తోంది.
అలాగే కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో బయోమెడికల్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రొఫెసర్ పార్థసారథి రాయ్ ను కూడా ఎన్ఏఏ ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించింది.
భీమా కొరేగావ్ కేసు పేరుతో వివిధ రాష్ట్రాల్లోని మేధావులందరినీ వేధించడం, నిందితులుగా వాళ్ల పేర్లు చేర్చి అక్రమంగా నిర్బంధించడం పెరిగిపోయింది. సంఘ్ పరివార్ ప్రభుత్వం ప్రజా మేధావులంటే భయపడుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే రచయితలంటే వణికిపోతోంది. ఏదో ఒకసాకుతో వాళ్లందరినీ నిర్బంధించడానికి భీమా కొరేగావ్ కుట్ర కేసును సాకుగా చేసుకున్నది. ఈ దుర్మార్గాన్ని అందరూ నిరసించాలని విరసం విజ్ఞప్తి చేస్తోంది.
విప్లవ రచయితల సంఘం
7.9.2020
Keywords : bhima koregaon, virasam, varavararao, elgar parishath,
(2024-04-25 00:03:24)
No. of visitors : 513
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |