సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ సెప్టంబర్ 23 న అమరులయ్యారు ఈ సందర్భంగా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన‌

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కోవిడ్-19 కూడా సోకడంతో విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కామ్రేడ్ చంద్రమ్మ శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 16 వ ఏటనే పాల్గొన్నారు. దళ సభ్యురాలిగా వుంటూ విప్లవోద్యమ కృషి చేసారు. తనతోపాటు దళంలో పనిచేసిన కామ్రేడ్స్ పోలీసు ఎన్కౌంటర్లలో చనిపోయినా చంద్రమ్మ సంకల్పం చెక్కు చెదరలేదు. ఉక్కు మహిళగా ముందుకు సాగారు.
ఉద్యమ క్రమంలోనే కామ్రేడ్ చంద్రమ్మకి పైలా వాసుదేవరావు గారితో వివాహమైంది. పోరాటం తీవ్రమైన నిర్బందాన్ని ఎదుర్కొంటున్న స్థితిలో కామ్రేడ్ చంద్రమ్మ తనకు పుట్టిన బిడ్డను (నేడు ప్రముఖ జర్నలిస్ట్ అత్తలూరి అరుణ)పొత్తిళ్లలోనే పార్టీ నిర్ణయం మేరకు వేరే వాళ్లకు ఇచ్చివేసారు.
శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని రాజ్యం తీవ్ర నిర్బంధంతో ఎంకౌంటర్లు, అరెస్టులుతో అణిచివేయడానికి పూనుకుంది. ఆ స్థితిలో దెబ్బతిన్న ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి చంద్రమ్మ ఇతర కామ్రేడ్స్ తోపాటు తన వంతు కృషి చేసారు. ఈ క్రమంలోనే అరెస్టయ్యి విశాఖ సెంట్రల్ జైలులో సుమారు 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
జైలు నుండి విడుదలైన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఉద్ధానం ఏరియాలో రైతు-కూలీలు, ఆదివాసీల, మత్స్యకారుల సమస్యలపై ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నడిపారు. జీడీ పిక్కలకు మద్దతు ధర కోసం పోరాడటమేగాక, జీడిపిక్కల పరిశ్రమలలోని కార్మికుల సమస్యలపై ఆందోళనలు చేశారు.
ప్రజాపంథా, జనశక్తి, న్యూడెమోక్రసీ పార్టీలలో శ్రీకాకుళం జిల్లా నాయకురాలు గానూ, అఖిల భారత రైతు-కూలీ సంఘం నాయకురాలుగాను బాధ్యతలు నిర్వహిస్తూ విప్లవోద్యమ నిర్మాణ కృషిచేశారు. ప్రస్తుతం సి.పి.ఐ (ఎం.ఎల్) రైజింగ్ న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
72 సంవత్సరాల వయసులో 55 సంవత్సరాల జీవితాన్ని విప్లవోద్యమం కోసం వెచ్చించి చివరి వరకూ ఆశయ సాధనకై అంకితమైన ధన్యజీవి కామ్రేడ్ చంద్రమ్మ.
కామ్రేడ్ పైలా చంద్రమ్మకు అరుణారుణ జోహార్లు.
వై.సాంబశివరావు,
అధికార ప్రతినిధి
సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
23-9-2020

Keywords : paila chandramma, cpi ml new democracy, srikakulam, martyr
(2024-04-25 00:07:29)



No. of visitors : 985

Suggested Posts


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు.

శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడ‌దాం

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యన్నీకాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూదికొండ (నెమలికొండ) ను నాశనం చేస్తున్నారు పాలకులు. కొందరు పెద్దల లాభాల కోసం పర్యావరణాన్ని,

చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ

యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సీనియర్