include 'men';
?>
హత్రాస్ వెళ్లాలనుకోవడమే అతడి నేరం
హత్రాస్ వెళ్లేందుకు యత్నించిన మళయాళీ పాత్రికేయుడు సిద్ధికీ కప్పన్తో పాటు మరో ముగ్గురిని సోమవారం యూపీ పోలీసులు అరెస్టు చేసి Unlawful Activities (Prevention) Act (యూఏపీఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు.
హత్రాస్లో అత్యాచారానికి గురై హత్యగావించబడ్ద యువతి బంధువులను కలవడానికి వెళ్తున్న వీరిని మధుర టోల్ప్లాజా వద్ద అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కార్యదర్శి కప్పన్తో పాటు అతీక్ ఉర్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలమ్లు ఉన్నారు. వీరికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) , దాని అనుబంధ విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా CFI)తో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. వారి నుంచి ల్యాప్ టాప్, సెల్ఫోన్లతో పాటు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
azhimukham.com కోసం పనిచేస్తున్న కప్పన్ ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నారు. కాగా టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన ఈ నలుగురినీ సీఆర్పీసీ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్టు చేశామని మథుర ఎస్ ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. వీరు హత్రాస్లో శాంతి భంగం కల్గించే భారీ కుట్ర పన్నారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.
ఉగ్రవాద చర్యలకోసం నిధులు సమకూర్చడం ఆరోపణలతో ఉపా యాక్ట్లోని సెక్షన్ 17 , రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడంతో పాటు, మత విశ్వాసాలను గాయపరచడం లాంటి ఆరోపణలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని 65, 72, 76 సెక్షన్లను వీరిపై ప్రయోగించారు. బుధవారం అరెస్టయిన నలుగురినీ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా.. కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా.. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఢిల్లీ యూనిట్ ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్కి కప్పన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ లేఖ రాసింది.
మరోవైపు హత్రాస్లో కుల ఘర్షణలను రెచ్చగొట్టేందుకు యత్నించారనే ఆరోపణలపై గుర్తుతెలియని పలువురిపై పోలీసులు 19 ఎఫ్ ఆర్ ఐలను ఫైల్ చేశారు.
Keywords : Unlawful Activities (Prevention) Act, Hathras, Journalist
(2024-04-25 03:13:39)
No. of visitors : 1237
Suggested Posts
| హత్రాస్ సంఘటన : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమకుందన్నజిల్లా మెజిస్ట్రేట్
అత్యాచారం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై హత్రాస్ దారుణంపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిథల్ మరియు జస్టిస్ రాజన్ రాయ్ డివిజన్ బెంచ్ రెండు గంటల విచారణలో బాధితుడి కుటుంబం మరియు వివిధ ప్రభుత్వ అధికారులను వాదనల్ని విన్నది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
|
| దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపుఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా బుల్ గడి గ్రామంలో 20 బ్రాహ్మణ,వంద భూస్వామ్య ఠాకూర్ కుటుంబాలు,కేవలం నాలుగు దళిత కుటుంబాలు వ్యవసాయ రైతుకూలీలుగా జీవిస్తున్నారు.19 ఏళ్ల దళిత యువతి మనీషాను ఠాకూర్ కులానికి చెందిన నలుగురు మృగాళ్ళు |
| పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు నిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..