అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
రెండు రోజుల క్రితం ములుగు జిల్లా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్, అంతకు ముందు ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్ కౌంటర్ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఎన్ కౌంటర్ల తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు...తదితర వివరాలతో అమరుల బంధుమిత్రుల సంఘం విడుదల చేసిన ప్రకటన....
ములుగు జిల్లా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 18న బూటకపు ఎన్కౌంటర్ పేర పోలీసులు ఇద్దరు మావోయిస్టులను కాల్చేశారు. వారిలో ఒకరు ములుగు ఏరియా కమిటీ కార్యదర్శి కా. సుధీర్, మరొకరు దళ సభ్యుడు కా. లక్మా. పోలీసులు వీరిపై ఏక పక్షంగా కాల్పులు జరిపి ఎన్కౌంటర్ గా ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల పేర్లు ప్రకటించడంలో కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్ హత్యాకాండలో భాగమే ములుగు ఘటన. లాక్ డౌన్ మొదలయ్యాక తెలంగాణలో విప్లవోద్యమం మీద నిర్బంధం తీవ్రమైంది. కొవిడ్ పేరుతో ప్రజా జీవితం స్థంభించి పోయిన తరుణంలో కూడా వేలాది సంఖ్యలో కూంబింగులు కొనసాగుతున్నాయి. ఆదివాసీ గ్రామాల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారి జిల్లా కేంద్రాల్లో మకాం వేసి ఎన్ కౌంటర్ హత్యలకు పథకం రూపొందించి అమలు చేస్తున్నారు. ఇది గోప్యంగా జరగడం లేదు. పదే పదే మీడియాలో ఈ విషయాలు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 7, 8, 19, 23 తేదీల్లో తెలంగాణలో ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో 10 మంది విప్లవకారులను కాల్చేశారు. వీటిలో ఒక్కటి కూడా ఎదురు కాల్పుల ఘటన కాదు. అన్ని ఘటనలూ విప్లవకారులను, ప్రజలను పట్టుకొని కాల్చేసినవే. ఎన్ కౌంటర్ మృతదేహాల స్వాధీనానికి, అంత్యక్రియలకు అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యులు వెళ్లనివ్వడం లేదు. ఈ సంవత్సరం మార్చి నెలలో అమరుడైన జాడ వీరాస్వామి అంత్యక్రియలకు వెళుతున్న బంధుమిత్రుల సంఘం సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి అంత్యక్రియలు చేయించారు. జులై మొదటివారంలో అమరుడైన అభిలాష్ అంత్యక్రియలకు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు, చుట్టుపక్కల అమరుల కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు వాళ్లు ఊరి నుంచి వెళ్లిపోతేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఊరి బయటే అపేశారు. ఆ రాత్రంతా ఊళ్లోని ప్రతి ఇల్లూ గాలించారు. మృతుల కుటుంబ సభ్యుల మీద ఇట్లా ఒత్తిడి తెచ్చే పద్ధతిని కూడా ఇటీవల అనుసరిస్తున్నారు. ఈ రెండు నెలల్లో ఎన్ కౌంటర్లలో చంపేసిన వాళ్ల పేర్లు, ఫొటోలు పత్రికలకు ఇవ్వకపోవడమేగాక కుటుంబాల మీద ఒత్తిడి తెచ్చి హడావిడిగా అంత్యక్రియలు జరిపించాక మృతుల వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్కౌంటర్ ఘటన దగ్గరికి పాత్రికేయులను కూడా వెళ్లనివ్వడం లేదు. దీంతో అసలు ఏం జరిగిందో బైటికి తెలియడం లేదు.
రాజ్యహింస ఎన్కౌంటర్ల రూపంలోనే కాదు, హత్యాకాండ తర్వాత ఇన్ని రూపాల్లో పెరిగిపోతున్నది. విప్లవకారుల శవాల స్వాధీనంలో అమరుల బంధుమిత్రుల సంఘం పాత్ర ఉంటే, అంత్యక్రియల్లో పాల్గొంటే విప్లవకారుల త్యాగ నిరతి ప్రజలకు అర్థమవుతుందని, పోలీసుల చిత్రహింసల హత్యాకాండ కూడా ప్రజలు గ్రహిస్తారని ప్రభుత్వం అందోళన పడుతోంది. దీన్ని అడ్డుకోడానికే ఇలాంటి పద్ధతులకు పోలీసులు పాల్పడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్లలో అమరులవుతున్నది ఆదివాసులు కావడం వల్ల ఈ హత్యాకాండతోపాటు ఆ తర్వాత ఆ కుటుంబాలపై అమలువున్న నిర్బంధం కూడా బైటికి తెలియడం లేదు.
అంత మాత్రాన ప్రభుత్వ దుర్మార్గం మరుగునపడిపోదు. అమరుల త్యాగాలు ప్రజలకు తెలియకుండా పోవు. ములుగు ఎన్ కౌంటర్ లో ప్రాణత్యాగం చేసిన సుధీర్, లక్మాల అమరత్వం శాశ్వతమైనది. వారికి అమరుల బంధుమిత్రుల సంఘం అరుణారుణ జోహార్లు చెబుతోంది. వాళ్ల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తోంది.
అంజమ్మ(అధ్యక్షురాలు)
శాంత(ఉపాధ్యక్షురాలు)
పద్మకుమారి(కార్యదర్శి)
Keywords : telangana, fake encounters, ABMS, Mulugu, maoists, police, kcr
(2021-04-16 08:53:34)
No. of visitors : 1037
Suggested Posts
| మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్నదశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న. |
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు. |
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
more..