ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు

ఎవరీ

కామ్రేడ్స్ కన్నన్, అరవిందన్, అజిత, మణివాసగం అమరులై 2020అక్టోబర్ 28, 29 తేదీలకు ఒక సంవత్సరం పూర్తవుతుంది. సరిగ్గా సంవత్సరానికి ముందు మంజకండిలో రక్తపిపాసి ʹథండర్ బోల్ట్స్ ʹ( కేరళ పోలీసుల ప్రత్యేక దళం) చేతుల్లో సజీవంగా పట్టుబడి, చిత్రహింసలకు గురై దారుణ హత్యకు గురయ్యారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, ʹకామ్రేడ్ʹ పినరయి విజయన్ ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక, అమానవీయ, దారుణ హత్యలు జరిగాయి.

హత్య జరిగిన తరువాతి కొన్ని వారాల జ్ఞాపకాలు మదిలో మెదిలినప్పుడు ఒక సంవత్సరం గడచిన తరువాత కూడా, నా హృదయం వేదనతో, దు:ఖంతో, కోపంతో నిండి పోయింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని పిలవబడే పినరయి విజయన్ హిట్లర్ ప్రభుత్వంలాగా వ్యవహరించింది. పోలీసు, ప్రభుత్వ వ్యవస్థలు చనిపోయినవారిని కూడా అవమానించాయి. అమరుల మృతదేహాలను కుళ్లిపోయేట్లుగా కొన్ని రోజులపాటు అడవిలో వదిలేశారు.

తమ ప్రియమైనవారి మృతదేహాలను చూడటానికి రక్త సంబంధీకులను కూడా అనుమతించలేదు. మద్రాస్ హైకోర్టు ఆదేశించిన తరువాతనే చూడటానికి బంధువులను అనుమతించారు కానీ తమ వూళ్ళకు తీసుకెళ్లద్దని బెదిరించారు. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకున్న తరువాత మాత్రమే, కామ్రేడ్ మణివాసగం మృతదేహాన్ని అతని స్వగ్రామంలో దహనం చేయగలిగారు. వారి పార్థివ శరీరాలను తీసుకెళ్లి గౌరవప్రదమైన అంత్యక్రియలు చేసే ప్రాథమిక హక్కుని నిరాకరించడం వారి గుండెల్ని బద్దలు చేసింది.

పాలకుల క్రూరత్వం, వక్రబుద్ధి కేరళతో ఆగలేదు. తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం తమ వంతుగా అంత్యక్రియలు అర్ధరాత్రి 30 నిమిషాల్లోపల జరిగిపోయేలా చూసారు.

కామ్రేడ్ మణివాసగమ్ రక్త బంధువులు, అతని భార్య కళ, మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు జైలు నుండి వచ్చిన సోదరి చంద్ర, వివేక్ (అంటే నేను) లతో సహా 5 మందిపై యుఎపిఎ కేసులను పెట్టడం ద్వారా తమ క్రూరత్వానికి ముగింపునిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు అతని అంత్యక్రియలను ఏర్పాటు చేసిన నేరానికి కామ్రేడ్ మణివాసగం సోదరి, ఆమె భర్త, ఆమె కుమారుడిని జైలులో పెట్టారు. మనం భూస్వామ్య చోళ రాజ్యం లేదా సామ్రాజ్యవాద బ్రిటిష్ రాజ్ క్రింద జీవించడం లేదు.

మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనీ, కేరళ ప్రభుత్వం వామపక్ష ప్రజాస్వామిక ఫ్రంట్ ప్రభుత్వమనీ పదే, పదే చెప్తూంటారు. కానీ ʹప్రజాస్వామ్యం చనిపోయింది… ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి!ʹ

విప్లవకారులను దారుణంగా హత్య చేసిన తరువాత, పినరయి విజయన్ నుండి ససీంద్రన్ (వయనాడ్ ఎమ్మెల్యే) వరకు కేరళ సిపిఐ (ఎం) నాయకులు అపవాదులతో, అబద్ధాలతో అవమానించారు. తనను కమ్యూనిస్టుగా చెప్పుకునే పినరయి విజయన్ వారిని బయటి వ్యక్తులు అని నిందించాడు. వారి యాసను అనుకరించి హేళన చేశాడు.

కమ్యూనిస్ట్ ఇంటర్నేషనలిజాన్ని ఎంత గొప్పగా వ్యక్తీకరించారు! ప్రజల నుండి బియ్యం అడిగి తీసుకున్నారని బిచ్చగాళ్ళన్నాడు. అతని హృదయం నుంచి వచ్చిన నిజమైన వ్యక్తీకరణ! పినరయి వంటి 5 స్టార్ కమ్యూనిస్ట్ నుండి ఇంతకన్నా ఏమి ఆశించగలం?

ʹమిస్టర్ పినరయి, మీరు వారిని బిచ్చగాళ్ళు అని పిలవచ్చు, కాని వారు కోడియేరి బందిపోట్ల సోదరుల్లాగా లేదా మీ ముఠా లోని వలయార్ రేపిస్టుల్లాగా కాదు. ససీంద్రన్ మావోయిస్టులను ʹరోడ్ల మీద తిరిగే వీధి కుక్కలుʹ అని పిలిచాడు. అనేక దేశాలలో తిరిగిన చే గువేరాని మీరు ఏ విధంగా వర్ణిస్తారో నాకు తెలియదు!ʹ

ఈ నలుగురుఎవరో తెలుసుకుందాం! వీరంతా పేద రైతు కుటుంబాలకు, పట్టణ కార్మికవర్గానికి చెందినవారు.

కామ్రేడ్ మణివాసగం

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కామ్రేడ్ మణివాసగం ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. అతను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు, పోరుగూర్లో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన విప్లవ రైతాంగ పోరాటాల నుండి స్ఫూర్తి చెంది, 80 ల రెండవ భాగంలో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ నేతృత్వంలోని విప్లవోద్యమంలో చేరారు. యువత, విద్యార్థి, రైతాంగం వంటి వివిధ ప్రజా సంఘాలలో పనిచేశారు. వివిధ జిల్లాల్లో అనేక పోరాటాలలో ముందుండి ప్రజలను నడిపించారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యు) రాష్ట్ర అధ్యక్షుడిగా, విప్లవ పత్రిక మున్నోడి సంపాదకుడిగా కూడా పనిచేశారు. తొంభైల ఆరంభం నుండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అతను చివరకు 2011 లో ట్రై-జంక్షన్ ప్రాంతంలోకి ప్రవేశించాడు.

అతను తమిళనాడు రాష్ట్ర కమిటీ సభ్యుడుగానూ, తరువాత మావోయిస్టు పార్టీ పశ్చిమ కనుమల ప్రత్యేక మండల కమిటీ సభ్యుడుగానూ బాధ్యత వహించారు. అతను ఒక సాధారణ, కష్టపడి పనిచేసే కమ్యూనిస్ట్. ప్రజలతో సులభంగా కలిసిపోయాడు. పనిచేసిన ప్రతిచోటా ప్రజలకు ప్రియతముడైనాడు. అనేక సందర్భాలలో చిత్రహింసలనెదుర్కొన్న అతను ఎప్పుడూ లొంగిపోలేదు లేదా శత్రువు ముందు తలవంచలేదు. అనేక సంవత్సరాల జైలు జీవితం అతని విప్లవోత్సాహాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. అతని వయస్సు, ఆరోగ్యం, ఇతర వడిదుడుకులు ఏవీ కూడా పశ్చిమ కనుమల కఠినమైన భూభాగంలోకి ప్రవేశించకుండా నిరోధించలేదు, పీడిత ప్రజల కోసం తన అమూల్యమైన జీవితాన్ని అంకితం చేశాడు.

కామ్రేడ్ కన్నన్ (కార్తీ)

కామ్రేడ్ కన్నన్ (కార్తీ) చెన్నై పట్టణ కార్మికవర్గ కుటుంబానికి చెందినవాడు. ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత కార్మికుడిగా పనిచేశాడు. అతను తన ప్రాంతంలో DYFI సభ్యుడు. 2000 సంవత్సరంలో మావోయిస్టు విప్లవ ఉద్యమంతో సంపర్కంలోకి వచ్చాక, సిపిఐ (ఎం) పార్లమెంటరీ, వర్గ-రాజీ రాజకీయాలను తిరస్కరించాడు. ఆ తరువాత, అతను ఎప్పుడూ వెనక్కి తిరగిచూడలేదు. అతను అజ్ఞాతంలోకి వెళ్ళి యువజనోద్యమంలో పాల్గొన్నాడు. అతి త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజరయ్యాడు.

తప్పుడు కేసులో అరెస్టై నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. మరో ముగ్గురు కామ్రేడ్స్ తో పాటు మూడేళ్లు ఒరిస్సా జైలులో గడిపాడు. జైలులో ఉన్న వందలాది మంది ఆదివాసీల హక్కుల కోసం జైల్లో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఒరియా భాష రాయడం, చదవడం నేర్చుకున్నాడు. జైలు నుండి బయటకు వచ్చిన కొద్ది కాలం తరవాతనే ట్రై-జంక్షన్ కార్యకలాపాలలో నిమగ్నమయ్యాడు. అతను చాలా వినయవంతుడైన కమ్యూనిస్ట్, ఉల్లాసంగా వుండేవాడు, కష్టపడి పనిచేసేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. కలిసి పనిచేసిన కామ్రేడ్సందరి ప్రేమపాత్రుడయ్యాడు. గొప్ప విప్లవ నాయకుడిగా రూపొందే కామ్రేడ్ ని కేరళ ఫాసిస్ట్ పాలన దారుణంగా హత్య చేసింది.

కామ్రేడ్ అరవిందన్

కామ్రేడ్ అరవిందన్ కామ్రేడ్ కార్తీకి స్నేహితుడు. అతను చెన్నై నివాసి, DYFI సభ్యుడు కూడా. విప్లవోద్యమంలో చేరిన తరువాత, కార్మికులను సంఘటితం చేయడానికి కొద్దికాలం పాటు ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశాడు. తరువాత కర్ణాటకలోని పార్టీ సాయుధ దళంలో చేరి కమాండర్ అయ్యాడు. అతను మంచి ఆర్గనైజర్. ట్రై-జంక్షన్ ప్రాంతానికి వచ్చి కమాండర్‌గా పనిచేశాడు. అతను చాలా గంభీరంగా, కష్టపడి పనిచేసే కామ్రేడ్.

కామ్రేడ్ అజిత

ట్రై జంక్షన్ ప్రాంతంలో కామ్రేడ్ అజిత అదే పేరుతో అమరురాలైన రెండవ మహిళ. ఆమె తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చాలా పేద కుటుంబానికి చెందినది. ఆమె అనేక జానపద నృత్యాలలో శిక్షణ పొందిన ప్రతిభావంతురాలైన సాంస్కృతిక కార్యకర్త. ఆమె డిగ్రీ పూర్తి చేసి లా కోర్సులో చేరింది. ట్రై-జంక్షన్ ఉద్యమంలో పనిచేయడం కోసం న్యాయవాద విద్యను వదిలేసింది. ఆ ప్రాంతం, పని గురించి అనుభవం లేకపోయినప్పటికీ, తనను తాను మంచి నాయకురాలిగా అభివృద్ధి చేసుకుంది.

ఈ కామ్రేడ్స్ అందరూ పునాది వర్గాలకు చెందినవారు. వారిలో కొందరు విద్యావంతులు. వారిలో అందరూ విప్లవోద్యమలో చేరడానికి ముందు ఉద్యోగాలు చేసుకొనేవారు.

ఈ అమరులు తమ స్వార్థం కోసం అధికారం లేదా డబ్బు కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. వారు రాజకీయాధికారం కోసం, అణగారిన ప్రజల మంచి భవిష్యత్తు కోసం పోరాడారు. కార్మికవర్గం, ఇతర అణగారిన వర్గాల విముక్తి కోసం వారు తమ సురక్షితమైన జీవితాన్ని, కుటుంబాలను, స్నేహితులను, యవ్వనాన్ని త్యాగం చేశారు.

వారు మార్క్సిజం- లెనినిజం-మావోయిజం భావజాలాన్ని విశ్వసించారు. నిజమైన కమ్యూనిస్టులుగా జీవించడానికి, పోరాడటానికి ప్రయత్నించారు. విప్లవం కోసమే వారు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఈ నిస్వార్థ మావోయిస్టులు తెలంగాణ, కయూర్ అమరుల నిజమైన వారసులు. కేరళ మహత్తర అమరుడు కామ్రేడ్ వర్గీస్ అడుగుజాడల్లో నడిచి, నిజమైన కమ్యూనిస్టులుగా జీవించి మరణించారు.

తమను తాము కమ్యూనిస్టులుగా పిలుచుకునే కొంతమంది వున్నారు, తమవి కమ్యూనిస్టు పార్టీలు అని పిలుచుకునే కొన్ని పార్టీలు వున్నాయి. వారు బూర్జువాల్లాగా జీవిస్తున్నారు. బూర్జువా విధానాలను అనుసరిస్తున్నారు. దీనికి సరైన ఉదాహరణ సిపిఐ (ఎం), దాని నాయకులు. సిపిఐ (ఎం) కమ్యూనిజానికి ఆదర్శమైన సామాజిక విప్లవాన్ని వదులుకుంది. పాలకవర్గాల రాజకీయ ప్రతినిధులలో ఒకరిగా మారింది. దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మడం, బడా బూర్జువా దోపిడీకి సహాయం చేయడం, అర్ధ భూస్వామ్య వ్యవస్థని కాపాడుకోవడం, ప్రజలను అణచివేసి, ఫాసిస్టులా ప్రవర్తించే వారితో పొత్తు పెట్టుకుంది. ఇందుకు వందలాది ఉదాహరణలు ఇవ్వగలం. పినరయి విజయన్ ప్రభుత్వంలో కొన్ని ఉదాహరణలను చూడవచ్చు.

సిపిఐ (ఎం) పార్టీ తాను నయా ఉదారవాద దోపిడీకి వ్యతిరేకం అని చెబుతోంది. కానీ పినరయి విజయన్ ప్రభుత్వం వేలాది మంది మత్స్యకారులను ఇళ్ల నుంచి వెళ్ళగొట్టి సాగర్ మాల ప్రాజెక్టుకోసం భూమిని సిద్ధం చేస్తోంది. అనేక యితర ప్రాజెక్టుల కోసం కూడా పేద రైతుల భూములను లాక్కుంటోంది.

పశ్చిమ కనుమల పర్యావరణ సమతౌల్యానికి విపరీత నష్టాన్ని కలిగించే పశ్చిమ కనుమల అడవులను నాశనం చేసే బహుళజాతి కంపెనీలు, ధనికులకు కేరళ ప్రస్తుత, గత సిపిఐ (ఎం) ప్రభుత్వాలు అత్యుత్సాహంగా సహాయపడ్డాయి.

హిందుత్వ సంఘ పరివార్‌పై పోరాడుతున్నామని చెప్పే పినారాయ్ విజయన్ ప్రభుత్వం, వాస్తవానికి, తుపాకులను తయారు చేసే లేదా సోషల్ మీడియాలో రైఫిల్స్‌ ను బహిరంగంగా ప్రదర్శించే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది.

లైంగిక వేధింపుచేసిన ఒక RSS వ్యక్తిపై పోస్కో కేసును వుపసంహరించుకుంది. షెడ్యూల్డ్ కులాల పిల్లలపై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో నిర్దోషులుగా విడుదలవడానికి సిపిఐ (ఎం) సభ్యులకు పినరయి ప్రభుత్వం, పోలీసులు సహాయం చేశారు.

అంతే కాదు, పినరయి ప్రభుత్వం అవినీతి చర్యలు కూడా బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, అతని కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగి బంగారు అక్రమ రవాణాతో పాటు, ఇళ్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఈ కుంభకోణాల్లో కోడియేరి బాలకృష్ణన్ కుమారులకి పూర్తి పాత్ర వుంది.

మావోయిస్టు అమరుల రక్తంతో పినరయి విజయన్ చేతులు తడిసాయి. కేరళ పోలీసులు గత నాలుగేళ్లలో 7 మంది మావోయిస్టులను హత్య చేశారు. ఎన్కౌంటర్స్ అన్నీ పట్టుకొని చంపినవే. ఒక అమాయక ఫోటోగ్రాఫర్ బెన్నీని మావోయిస్టు అని చంపేశారు. క్రూరమైన యుఎపిఎకు వ్యతిరేకంగా ఒకవైపు సిపిఐ (ఎం)ప్రచారం చేస్తూ మరోవైపు, కేరళ ప్రభుత్వం దీనిని విచక్షణారహితంగా ఉపయోగిస్తోంది. మావోయిస్టులుగా అభియోగాలు మోపిన అలెన్, త్వాహ లాంటి తమ పార్టీ సభ్యులను కూడా ఈ చట్టం కింద అరెస్టు చేశారు.

ఇంతేకాకుండా, ఈ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంలో కనీసం 45 కస్టోడియల్ మరణాలు సంభవించాయి. పినరయి విజయన్ జూనియర్ మోడీ లాగా పాలన సాగిస్తున్నాడు. వెలిసిపోయిన సిపిఐ (ఎం) ఎర్రజెండాను ఈ జూనియర్ మోడీ (పినరయి) పూర్తి కాషాయరంగుగా మార్చారు. కేరళలోని అణగారిన ప్రజలు నిజమైన కమ్యూనిస్టులు, ఎర్ర ముసుగులో వున్న ఫాసిస్టుల మధ్య తేడాని గుర్తిస్తారని ఆశిస్తున్నాను.
‍ - వివేక్
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి
(aroraonline.com సౌజన్యంతో)

Keywords : kerala, maoists, fake encounter, pinaryi vijayan, tamilanadu, martyrs
(2024-04-25 03:11:23)



No. of visitors : 2139

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఎవరీ