పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త పథకం
అత్యాచారాలకి అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వమో ఎప్పటికప్పుడు చాటుతూనే వుంది.
ప్రజా వ్యతిరేక చట్టాలని తీసుకొస్తూ, తమది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వమే అని నిర్మొహమాటంగా, బాహాటంగానే ప్రకటిస్తుంది. ఆ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరుగుతూ అనేక రకాలుగా నిరసనలు చేపడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంకో పనికిమాలిన చట్టాన్ని తీసుకరాబోతుంది.
RSS ద్యారా నడుపబడుతున్న "గర్భ సంస్కారం" అనే పథకాన్ని యూపీ ప్రభుత్వం చట్టంగా తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
"గర్భ సంస్కారం "అంటే ... తల్లి గర్భంతో ఉన్నపుడే కడుపులో వున్న బిడ్డకి ఆధ్యాత్మిక సంస్కారాన్ని కల్పించడం కోసం వారు పవిత్రంగా భావించే భక్తి గీతాలని వినిపించడం, వేదాలని చదివించడం లేక చదివి వినిపించడం, తల్లితో పూజలు చేయించడం, ధ్యానం చేయించడం మొదలైనవి చేయడం.
ఈ రకంగా గర్భంతో వున్న తల్లికి "గర్భ సంస్కార" అనే ʹఆధ్యాత్మిక చికిత్స" ఇవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డ భారతీయ సనాతన సంప్రదాయం, హిందూ సంస్కారం తో పుడతాడని, పుట్టాలని వారి ప్రభుత్వ పెద్దల కోరిక. దానికోసం మొదట బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని సుందర్ లాల్ హాస్పిటల్ ను ఎంపిక చేశారు. ఇది యూపీలోనే మూడవ అతిపెద్ద రెఫరల్ హాస్పిటల్. గర్భంతో వున్న మహిళలకి ఈ హాస్పిటల్లోని ఆయుర్వేదిక్ విభాగంలో "గర్భ సంస్కార" చికిత్సని ఇస్తారు.
గర్భంతో వున్న మహిళలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత చికిత్స కావాలన్నా, ఫ్రీగా డెలివరీ చేయాలన్నా ఖచ్చితంగా ఈ "గర్భ సంస్కారం " అనే సెషన్ కు హాజరు కావాలని ఆదేశించారు.
ఒక వేళ గర్భంతో వున్న మహిళ హిందువు కానప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఇది ఎంత అప్రజాసామ్యమో ఇట్టే తెలిసిపోతుంది. ఏ రకంగా చూసుకున్న ఇది రాజ్యాంగం స్ఫూర్తికి వ్యతిరేకం.
భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని గొప్పగా చెప్పుకుంటున్న దేశంలో, బలవంతాన హిందూ ధర్మాన్ని రుద్దడం ఏ రకంగా చూసినా రాజ్యాంగానికి వ్యతిరేకమే. పైగా తమ మెజారిటీ మత విశ్వాసాలను బలవంతాన చొప్పించేందుకు గర్భిణీలని పావులుగా వాడుకోవటం ఆటవిక చర్య గాక ఇంకేమిటి. ఇది జీవించే హక్కును కాలరాయడమే కాకుండా ప్రజల అస్తిత్వానికి, వారి నమ్మకాలకి వ్యతిరేక చర్య.
ఆడపిల్లలకు, మహిళలకి కనీస రక్షణ లేకుండా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాం,గృహహింస, హత్యలు జరుగుతున్న చోట బాధ్యతా యుతమైన ఏ ప్రభుతమైన చేయాల్సిన మొదటి పని మహిళలకు రక్షణ చట్టాలు, అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి. అంతే కానీ ఇలా సంస్కారం పేరిట, సనాతన ధర్మం పేరిట సమాజాన్ని హిందూ మత విశ్వాసాలను రుద్దటం కాదు.
ఇది గర్భిణీలకు చికిత్స అందకుండా మానసికంగా వాళ్ళని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, వాళ్ళ ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. ఇది ఆర్థికంగా వాళ్ళను కష్టాల పాలు చేయడమే. చికిత్స అందాలంటే హిందువుగా అయినా మారు లేదంటే చావనైనా చావు అనే ఈ రకమైన చర్యలు ప్రజా వ్యతిరేకమైనవి.
ధర్మం పేరుతో మనుషుల్ని ముక్కలుగా చీల్చి, లేదా వారిని మట్టుపెట్టాలని ప్రభుత్వం తెచ్చే ఇలాంటి తప్పుడు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించకపోతే, ఇప్పటికే మహిళలపై పెరిగిపోతున్న దాడులు, మానభంగాలు, హత్యలతో పాటు మహిళలు మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
(వ్యాస రచయిత అనూష... ఈ వ్యాసం అనూష ఫేస్ బుక్ టైం లైన్ నుండ్ తీసుకున్నాము)
Keywords : uttarapradesh, garba samskar yogi aityanath,
(2024-04-25 03:26:47)
No. of visitors : 571
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |