రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

పౌర హక్కుల సంఘం తెలంగాణ.
పత్రికా ప్రకటన..........

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. మోడీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను,విద్యుత్ సవరణ చట్టాన్ని (2020) ఉపసంహరించాలని,పంటలకు కనీస మద్దతు ధర( MSP) చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న రైతులు ఇచ్చిన‌ దేశవ్యాప్త బందు పిలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.....

నవంబర్ 26,27 న, దేశవ్యాప్తంగా రైతుల ఛలో ఢిల్లీ ర్యాలీలపై కేంద్ర BJP ప్రభుత్వం పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో అణిచివేత, లాఠీఛార్జ్ ,వాటర్ కేనాన్ ప్రయోగం తీవ్ర పోలీస్ నిర్బంధాన్ని అమలు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది.రైతులు శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు.

మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఊడిగం చెయ్యడానికి మూడు కొత్త వ్యయసాయ చట్టాలు,విద్యుత్ సవరణ చట్టంను(2020) తీసుకురావడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ దేశంనలుమూలల నుంచి రైతులు ఢిల్లీకి వెళుతుండగా అడ్డుకోవడం, బారికేడ్లు పెట్టడం,రోడ్డుపై పెద్ద పెద్దకందకాలు తవ్వడం,పెద్దపెద్ద బండరాళ్ళుపెట్టి,ఇనుప ముళ్ళకంచెలు మరియు ఇసుక కుప్పలు పోసి ఆటంకాలు సృష్టించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులచే రహదారులను దిగ్బంధించడం అప్రజాస్వామిక చర్య మరియు రాజ్యాంగ వ్యతిరేకం.నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులపై,క్రూర నిర్బంధ చట్టాలు నమోదు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై కేంద్రపోలిస్ బలగాలను ఉపయోగించి అణిచివేయడం మానుకోవాలని.కనీసం రైతుల ఆందోళన ఏమిటో అని వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అత్యంత అమానవీయం.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో రైతు సంఘాలతో చర్చలు జరపాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ డిమాండ్లను పరిష్కరించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.డిసెంబర్ 8న జరిగే దేశవ్యాప్త బందుకు,మేధావులు,ప్రజాస్వామిక వాదులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు,కార్మిక సంఘాలు,విపక్షాలు అన్ని వర్గాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
1.మూడు కొత్త వ్యవసాయ బేషరతుగా చట్టాలు రద్దుచేయాలి.
2.విద్యుత్ సవరణ చట్టంను(2020) రద్దుచేయాలి.
3.రైతు పంటకి కనీస మద్దతు ధరకు (Minimum Support Price) చట్టబద్దత కల్పించాలి.
4.ప్రజాస్వామికంగా నిరసన తెలుపుతున్న రైతులపై పాశవికంగా అమలుచేస్తున్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలి.రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..

రైతుల పోరాటానికి మద్దతుగా దేశ వ్యాప్త బందును విజయవంత చేయాలని కోరుతూ ఈ రోజు గోదావరిఖనిలో ధర్నా జరిగింది వివిధ పౌర, ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు.

1.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.GAV, ప్రసాద్,అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4.ఏనుగు మల్లారెడ్డిప్రధాన కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8..పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.నార వినోద్, బొడ్డుపెల్లి రవి,పొగులరాజేశం, కడ రాజయ్య, యాదవనేని పర్వతాలు.
7.T. రాజిరెడ్డి,CITU, రాష్ట్ర అధ్యక్షుడు.
6.I. కృష్ణ, IFTU, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
7.E.నరేష్, IFTU, రాష్ట్ర సహాయ కార్యదర్శి.
8.K.విశ్వనాధం, IFTU, రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
9.గాండ్ల మల్లేశం, TPF, పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యుడు.
10.లక్ష్మీపతి గౌడ్,INTUC RG-1,నాయకులు.
11.ముడిమడుగుల మల్లయ్య, అధ్యక్షుడు, రైతు సమస్యల సదనసామితి తెలంగాణ.
12.బియ్యాల స్వామి, రైతు.
13.పోరెడ్డి వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త.

Keywords : farmers protest, bharat bandh, CLC, godavarikhani
(2024-04-25 03:31:31)



No. of visitors : 693

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

తీవ్రమైన రైతుల ఉద్యమం ‍- రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ‌ కేసులు బనాయించి అరెస్టు చే

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రైతుల