లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

లొంగి

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో గడ్ చిరోలీ మహారాష్ట్ర , అధికార ప్రతినిధి కే. శ్రీనివాస్విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

లొంగిపోయిన ʹమావోయిస్టుʹలారా!

మీ జీవితాలు ఖాకీల ముందు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. ఛత్తీస్ గఢ్ పోలీసులు ʹలోన్ వర్రట్ʹ పేరుతో ప్రారంభించిన బూటకపు లొంగుబాటు పథకాన్ని నమ్మి ఇటీవలే 2021 ఫిబ్రవరి 19న బీజాపులో పోలీసులకు లొంగిపోయిన చేతనా నాట్య మంచ్ కళాకారిణి పందొమ్మిదేళ్ల కామ్రేడ్ పాండే కోవాసీని పోలీసులు ఎంత క్రూరంగా హత్య చేసి ఆత్మహత్య కట్టుకథ అల్లారో మీరు వినే ఉంటారు. మన బస్తర్ అదివాసీ తెగ పెద్దలు సహా ప్రజలంతా పోలీసుల హత్యను ఖండిస్తున్నారు. కామ్రేడ్ పాండే తల్లి తండ్రులు కూతురు శవాన్ని తీసుకో నిరాకరించారు. పాండే మరణానికి కారణాలను కోరిన సామాజిక కార్యకర్త సోనీసోడిని జిల్లా ఎస్పీ తమ పోలీసుల నేరాన్ని అంగీకరించకుండా అమెనే ఉల్టా దబాయించాడు. గడ్ చిరోలీ, ప్రాణహిత క్యాంపులలో మీ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయో మీ కుటుంబాల ద్వార మాకు వెంట వెంట తెలుస్తునే ఉంది. ఆ బతుకు సుడిగుండం నుండి మీరు బయటకు రావాలనే మా విజ్ఞప్తి. మన ఆదివాసులెవరూ బానిస బతుకును కోరుకోరు. అలోచించండి. .

విప్లవోద్యమంలో మీరు ఎంతో గౌరవంగా ప్రజాస్వామిక జీవితాన్ని గడిపారు? ముఖ్యంగా మహిళలు పార్టీలో ఏ వత్తిళ్లు లేకుండా, రాజకీయంగా ఏ వివక్ష లేకుండా, గౌరవప్రదంగా, ప్రజాస్వామికంగా గెరిల్లా జీవితాన్ని అనుభవించారు. విప్లవోద్యమంలో ఉన్నపుడు మిమ్మల్ని ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ, మీరు వాటన్నింటిని కాలతన్ని ఉద్యమంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను, చిన్న చిన్న సమస్యలను పార్టీ పద్ధతులలో పరిష్కరించుకోవడంలో విఫలమై మీమీ వ్యక్తిగతమైన బలహీనతలతో వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. మీలో ఇపుడు కొందరు పోలీసులకు గైడులుగా, కళ్లు, చెవులుగా, నమ్మకమైన సమాచార వాహకులుగా పని చేస్తున్నారు. మహిళల జీవితాలు అత్యాచారాల కుంపటిలో భగ్గుమంటున్నాయి. వీటిని ఇంకెంత కాలం భరిస్తారు! వద్దు. మీకు అ జీవితాలు వద్దు. వచ్చి మీ మీ గ్రామాలలో ఉండండి.

పోలీసు అధికారుల మోసపు హామీలకు బలై వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్నవారు ప్రజా ఉద్యమానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. అలాంటి వారిని అసహ్యించుకుంటు శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేయడం మీకు తెలిసిందే. మీరు అదే జీవితాన్ని కొనసాగిస్తే ప్రజలు ఎన్నటికైనా మిమ్మల్ని శిక్షించి తీరుతారు. కాబట్టి, పోలీసుల ముందు కడుహీనమైన జీవితాన్ని గడుపుతున్న మీరు దానికి ధైర్యంగా స్వస్తి చెప్పి వినమ్రంగా ప్రజలతో కలిసి మీ కుటుంబాలతో జీవించండి. పోలీసుల గాలింపు చర్యలలో పాల్గొనకండి. నిన్నటివరకు మీరు ప్రజల కోసం పోరాడినవారే. మన పోరాటం న్యాయమైనదని మీరంతా నమ్మినవారే. నిజానికి మీలో ఏ ఒక్కరికి పోరాటంతో విభేదం ఉండదు. పోలీసు అధికారులకు భయపడి మీరు మీడియా ముందు చెప్పే మాటలు కోడి ఈక కన్నా తేలికైనవని మీకూ, పోలీసులకూ తెలుసు. కాబట్టి
మీరు మీ స్వార్థంతో ప్రజలకు, విప్లవోద్యమానికి ఎంతమాత్రం ద్రోహం చేయకుండా, దానిని సమూలంగా మట్టుబెట్టాలనే పాలకుల కుట్రలకు బలికాకుండా పార్టీ చేస్తున్న ఈ విజ్ఞప్తిని ఖాకీల ఎంగిలి మెతుకులకు ఆశపడి నిర్లక్ష్యం చేయకండి.

గ్రామసభలకు విజ్ఞప్తి! మీ ఊరికి చెందిన లొంగిపోయిన మావోయిస్టుల గురించి అలోచించాలి. మీ ఊరి నుండి ఎవరు పోలీసులకు లొంగిపోయినా, మీరే బాధ్యత పడి వారిని పోలీసుల చెర నుండి విడిపించి వారి కుటుంబాలతో జీవించేలా చూడండి. పోలీసులు చేసే బెదరింపులకు భయపడకుండా చట్టపరంగానే వారిని వారి కుటుంబాలతో జీవించేలా చూడండి. పోలీసుల వెంట అడవులలోకి, గ్రామాలలోకి రావద్దని చెప్పండి. నక్సల్ గాలింపు చర్యలలో పోలీసులకు సహకరించి ప్రజలకు నష్టాన్ని కలిగించవద్దని వివరించండి. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అన్ని హక్కులు వారికి వర్తించేలా గ్రామసభలే బాధ్యత పడాలి. వారిని గ్రామసభ సభ్యులుగా చేర్చుకొని వారు మీలో ఒకరిగా జీవితాన్ని గడిపేలా చూడాలని మా విజ్ఞప్తి. మీ మాట వినని వారిని గ్రామాల నుండి బహిష్కరించండి. వారితో గ్రామసస్థులు ఎవరు సంబంధాలు పెట్టుకున్నా గ్రామసభలలో విచారించండి.

కే. శ్రీనివాస్, అధికార ప్రతినిధి,
పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో, దండకారణ్యం
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).


Keywords : maoists, maharashtra, gadchiroli, cpi maoist party, police, surrender naxal
(2024-04-25 00:43:34)



No. of visitors : 2912

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


లొంగి