కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ - ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్

కేసీఆర్

ప్రొఫెసర్ జి హరగోపాల్
విజిటింగ్ ప్రొఫెసర్
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ, బెంగళూరు
ప్రియమైన శ్రీ చంద్రశేఖర్ రావు గారు, మీరు వేగంగా కోలుకుంటున్నారని నమ్ముతున్నాను.
సార్,
మీ ప్రభుత్వం పదహారు ప్రజాస్వామ్య సంస్థలను చట్టవిరుద్ధమని ప్రకటించడం అనాగరికమైనది. ఇది నిజంగా మాకు షాక్ లాంటిది. పూర్వం ఎపిసిఎల్‌సి, ప్రస్తుతం సివిల్ లిబర్టీస్ సంస్థ కూడా ఇందులో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో మీరు ఈ సంస్థను ఉద్దేశించి ప్రసంగించారని మీకు గుర్తు ఉండే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో భాగంగా చేసే ఉద్యమంలో హక్కుల సంఘం భాగం కావాలని మీరు పిలుపు నిచ్చారు. అటువంటి సంస్థ ఎలా చట్టవిరుద్ధం అవుతుంది? ఇది దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతోంది. ఈ పదహారు సంస్థలన్నీ గత మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజ్యాంగ చట్రంలో భాగంగానే బహిరంగంగా పనిచేస్తున్నాయి. ప్రతి సంస్థకు దాని స్వంత చట్ట బద్ధమైన లక్ష్యం వుంది. అది వారి ప్రజా కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ సంస్థలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు సదరు సంస్థ నాయకులతో చాలా మందితో సంభాషించేవారు. ఈ సంస్థలో వున్న అందరి సభ్యులు ఉన్నత మానవ విలువలకు నిలబడతారు. అవి తెలంగాణ సమాజంలో నైతిక విలువలను పెంపొందిస్తాయు.
కరోనా కారణంగా గత ఒక సంవత్సరం ఏ సంస్థ కూడా దాని కార్యకలాపాలను నిర్వహించలేదు. గత ఆరు నుండి ఏడు సంవత్సరాలలో, తెలంగాణలో మావోయిస్టుల వైపు నుండి ఎటువంటి చర్యలు లేవు. సాపేక్ష శాంతి ఉంది. అణచివేత చట్టాలను ఉపసంహరించుకోవడానికి, ఈ సంస్థలను చట్టవిరుద్ధంగా ప్రకటించడానికి ఈ దశలో, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రేరేపించినది ఏమిటి? ఇది చాలా బాధ కలిగించే అంశం.
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని, రాజ్యాంగ చట్టం ద్వారా పాలించబడుతుందని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఈ రాజ్యాంగం పౌరులకు అనేక ప్రజాస్వామ్య హక్కులను హామీ ఇచ్చింది. ఆ చట్టపరమైన ప్రమాణాలు, నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, దాని ఉపోద్ఘాతంలో అణచివేత ఎల్లప్పుడూ తిరుగుబాటుకు దారితీస్తుందని గట్టిగా చెబుతుంది. మానవ చరిత్ర ఎక్కువుగా ఇటువంటి సందర్భాలతోనే నిండి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అటువంటి సుదీర్ఘ అణచివేతలో భాగంగానే పోరాట రూపాన్ని సంతరించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మావోయిస్టు ఉద్యమంగా పిలవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు చట్టవిరుద్ధమని ప్రకటించిన అన్ని సంస్థలు అప్పుడు చురుగ్గా పాల్గొన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వీరంతా ఉత్సాహభరితమైన మద్దతుదారులు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి ఇది ఒక కారణం. దాదాపు ఒక దశాబ్దం పాటు శాంతి కోసం పనిచేసిన శాంతి కమిటి సమావేశమైన సమావేశాలలో, బంతిని బలవంతంగా విసిరితే, అది సమాన శక్తితో తిరిగి బౌన్స్ అవుతుందని మీరు పేర్కొన్నారు. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన తరువాత మీరు ప్రజాస్వామ్య పోరాటాల విలువను అర్థం చేసుకుని గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.
ఈ ప్రజాస్వామ్య ఉద్యమాల సుదీర్ఘ చరిత్రను చూసిన తర్వాత, ఈ సంస్థలను చట్టవిరుద్ధం అని ప్రకటించిన నిర్ణయం తెలంగాణ ఉద్యమం సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలను తిరస్కరించడమే. ఈ అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధమైన G.O 73 ను ఉపసంహరించుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము.
మీ భవదీయుడు,
ప్రొఫెసర్ జి. హరగోపాల్
కన్వీనర్,
నిర్బంధ వ్యతిరేక వేదిక
8 - 284 / OU / 263,
O.U. కాలనీ,
షేక్‌పేట,
హైదరాబాద్ -500008.

Keywords : telangana, kcr, haragopal, virasam, clc, praja front, cms, tvv, tvs, ban
(2024-04-25 00:36:59)



No. of visitors : 952

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కేసీఆర్