Corona Vaccination: వ్యాక్సిన్ విషయంలోనూ స్త్రీల పట్ల వివక్ష‌

Corona

15-05-2021

దేశంలో స్త్రీల పట్ల అన్ని రంగాల్లోనూ వివక్ష కొనసాగుతోంది. వేల ఏండ్లుగా కొనసాగుతున్న ఈ వివక్ష ఈ ఆధునిక కాలంలోనూ తప్పడం లేదు. చివరకు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతున్నది. దేశంలో కరోనా వ్యాక్సిన్ స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువగా వేస్తున్నారు. ఉత్తర భారతంలో ఈ వివక్ష ఎక్కువగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య అంతరం జాతీయస్థాయిలో చూస్తే 4% కాగా, కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల పురుష–స్త్రీ నిష్పత్తి అంతరం 10 శాతానికి పైగా ఉన్నట్టు వెల్లడవుతోంది.

ఇక నాగాలాండ్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో మాత్రం ఈ తేడా 14% వరకు ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే ఉన్నా వ్యాక్సినేషన్‌ విషయంలో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయా గణాంకాలను బట్టి ప్రస్ఫుటమైంది. నాగాలాండ్‌లో ఈ తేడా 14.6%, జమ్మూ,కశ్మీర్‌లో 13.76%, యూపీ, పంజాబ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 10–13% మధ్యలో ఉండగా, చండీగడ్‌లో 11% ఉంది.

ఇక‌ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే స్త్రీ పురుషులకు సమానంగా కొన్ని సందర్భాల్లో మగవారి కంటే స్త్రీలకు ఎక్కువగా వ్యాక్సిన్లు వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 17.78 కోట్ల మందికి (గురువారం నాటికి)వ్యాక్సిన్లు వేయగా వారిలో 7.3 కోట్ల మంది పురుషులు, 6.5 కోట్ల మంది మహిళలు, 19వేల మంది ఇతరులున్నారు.

Keywords : corona, covid 19, vaccine, women, men
(2024-04-20 05:39:15)



No. of visitors : 794

Suggested Posts


కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల రోగులు మరణించలేదని కేంద్రం ప్రకటించింది. అలా చనిపోయినట్టు రాష్ట్రాలనుంచి కానీ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కానీ సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది.

కరోనా వల్ల నిమిషానికి 7గురు చనిపోతే ఆకలి వల్ల 11 మంది చనిపోతున్నారు

ప్రపంచవ్యాప్తంగా, ఆకలి వల్ల ప్రతి నిమిషానికి 11 మంది మరణిస్తున్నారని, గత ఒక సంవత్సరంలో కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ʹది హంగర్ వైరస్ మల్టీప్లెక్స్ʹ అనే తాజా నివేదికలో పేర్కొంది.

దేశంలో కరోనా కల్లోలం..గంటకు 62 మంది మృతి, 10 వేల మందికి పైగా పాజిటీవ్ !

దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న వేగం జనజీవితాన్ని కకావికలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో స్మశానాలు శవాలతో నిండి పోతున్నాయి. నిమిషానికి 181 మందికి, గంటకు 10,895 మందికి కరోనా సోకుతోందంటే ఆ మహమ్మారి

COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు

దేశంలో కోవిడ్ -19 ను వ్యాప్తి చేయడానికి భారత ఎన్నికల కమిషన్ దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

బీజేపీ ఎంపీ ప్రచార యావ... కోవిడ్‌తో చనిపోయిన వారిని స్మ‌శానానికి తరలించే వాహనం ముందు ఫోటోలకు పోజులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్‌ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ʹముక్తి వాహనంʹ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. పైగా తన ఫోటో షూట్ కోసమే వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు

ʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారుʹ అని పోస్టర్లు -15 మంది అరెస్టు

ʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు?ʹʹ అని రాసున్న పోస్టర్లను ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో గోడలకు అతికించారు. నిజాన్ని ఇలా బహిరంగంగా చెప్పినందుకు మహా ఘనత వహించిన ఈ దేశ చక్రవర్తులవారికి కోపం తెప్పించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


Corona