హరిభూషణ్ భార్య శారదక్క చనిపోలేదు... అసత్య‌ ప్రచారాలను ఖండించిన మావోయిస్టు పార్టీ

హరిభూషణ్

28౦6-2021

కా, హిడ్మ కా. శారద కరోనా వైరస్ తో చనిపోయారనే ప్రచారం అబద్దం.
పాలకులు, పోలీసులు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే

ప్రియమైన ప్రజలారా !

పోలీసులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని నమ్మకండి. కా ,శారద, కా. హిడ్మా ఆరోగ్యంగానే వున్నారు. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని నమ్మి కుటుంబ సభ్యులు, ప్రజలు గందర గోళ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా నిజాలను తెలియ జేస్తుంది. అప్పుడు మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

మావోయిస్టులు కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దళ సభ్యులను బయటికి వెళ్ళకుండా బలవంతంగా అడ్డుకుంటున్నారని, బయటికి వస్తే మెరుగైన వైద్యం అందిస్తామని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కా.గంగాల్ ను, కా.శోబ్రాయ్ లను తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ కు పంపిస్తే పక్కా సమాచారంతో అరెస్టులు చేసి వారికి వైద్యం అందకుండ చేసి
నీచంగా హత్య చేసిన కుటిల నీతి కలిగిన కసాయి ప్రభుత్వాలు, పోలీసులు మళ్ళీ ప్రజలను నమ్మించడానికి, శ్రేయోభిలాషి లాగా హితవులు పలుకుతున్నారు.

మా కామ్రేడ్స్ ను హస్పిటల్ కు వెళ్ళి పట్టుకొని చంపిన విషయం ప్రజలెవరు ఇంకా మరిచి పోలేదు. అదే విధంగా ప్రజల కోసం పోరాడుతున్న వారికి వైద్య అవకాశాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ ని నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని కౄర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ కారణంగానే కామ్రేడ్ హరిభూషణ్, కామ్రేడ్ భారతక్క లకు సరైన వైద్యం అందించ లేక పోయాము. వాస్తవానికి ఈ కామ్రేడ్స్ చనిపోయే ఒక రోజు ముందు ఇన్ఫార్మర్ల‌ ద్వారా పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్, చత్తీస్ గడ్ సంయుక్తంగా వందలాది మంది పోలీసులు దాడి చేయడానికి ఆపరేషన్ చేపట్టారు. మా ప్రజల ద్వారా పోలీసుల సమాచారం తెలుసుకొని మా కామ్రేడ్స్ ను కాపాడుకోవాడానికి వారిని మోసుక తిరిగాము. ఈ నిర్బంధం మద్యనే బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాము. కాని బ్రతికించుకోలేక పోయాము. ఇంకా కా.శారద, కా. హిడ్మి చని పోయారని ప్రజల్లో ప్రచారం చేసి ఒక పెద్ద గందర గోళాన్ని, భయాన్ని ప్రజల్లో సృష్ఠంచడానికి పోలీసులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు.

మేము కరోనాకు అతీతులమేమీ కాదు. ప్రజల మద్యనే జీవిస్తున్నాము. అన్ని సెక్షన్ల ప్రజలను కలుస్తుంటాము. మాకు కరోనా సోకే అవకాశం లేక పోలేదు. అందులో భాగంగానే కరోనా వైరస్ సోకి, కా, హరిభూషణ్, కా, భారతక్క లు భౌతికంగా ప్రజలకు దూరమయ్యారు. అందుకు ప్రభత్వాలు అమలు చేస్తున్న పాశవిక నిర్బంధం కూడా ఒక కారణమే. కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలందర్ని కబలించేస్తుంది. ఇది అస్థిత్వ సమస్యగా మారింది. సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా వెనక బడిన దేశాలలో వనరులను దోచుకోవడానికి ప్రకృతిని విధ్వంసం చేయడం మూలంగానే ఈరోజు మనల్నీ కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలను పట్టి పీడిస్తుంది. దీని మూలంగా లక్షలాది మరణాలే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుక పోయి అన్ని సెక్షన్ల ప్రజలకు పనులు దొరకక, ఉద్యోగాలు లేక, జీతాలు లేక ఆకలితో అలమటిస్తూ, వైద్యం చేయించుకొని స్థితిలో మరణిస్తున్న ప్రజలు కోట్లాదిగా వున్నారు. అసలు సమస్యను ప్రక్కన పెట్టి, ప్రజల ప్రాణాలను గాలికి వదిలి, ప్రజల జీవితాలకు గ్యారంటీ ఇవ్వకుండా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ మావోయిస్టు పార్టీని నిర్మూలించడంలో వెనకడుగు వేయడం లేదు.

ప్రజలారా !
కరోనా ఎవరిదో ఒక్కరి సమస్య కాదు. ప్రపంచ ప్రజల సమస్య, ప్రాణాంతక సమస్య, అస్థిత్వ సమస్య, ఇది సామ్రాజ్యవాదుల లాభాల కోసం వారు సృష్టించిన సమస్య, దీని అంతం కోసం ప్రజలంతా ఏకమై సామ్రాజ్యవాదులను, వీరికి ఆధారమైన భూస్వామ్యాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడి దారులను, పూర్తిగా కూల్చకుండా ప్రజలకు నిజమైన విముక్తి లేదు. దానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే సరైన మార్గం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
తెలంగాణ రాష్ట్ర కమిటీ
అధికార ప్రతినిధి
జగన్

Keywords : haribhushan, sharadakka, cpi maoist, corona, covid19, death
(2024-04-13 12:55:05)



No. of visitors : 2793

Suggested Posts


అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

వాళ్ళ అమరత్వంలోంచి అడవి చిగురిస్తున్నట్లుగానే ఉంటుంది

మావోయిస్టు పార్టీ నాయకులు హరిభూషన్, భారతక్క మరణం అనేక మందిని కలిచివేసింది. వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేకున్నా వాళ్ళ గురించి విన్నవాళ్ళు అనేక విధాలుగా సపంధించారు. సోషల్ మీడియాలో అనేక మంది తమ భావాలను పంచుకున్నారు. కొందరు ఆ అమరులపై కవితలు రాశారు.

అస్తిత్వ ప‌రిధులు దాటి కార్మిక‌వ‌ర్గ ప్ర‌తినిధులై.. -పాణి

విషాదం కూడా రోమాంచితంగా ఉంటుందా? మామూలుగానైతే అంగీకరించలేం. కానీ అదీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడే తెలుస్తుంది.. విషాద రేఖకు కూడా ఒక మెరుపు అంచు ఉంటుందని. అదే దు:ఖం నుంచి తెప్పరిల్లే ఓదార్పు గీతమవుతుంది. అదే నడచి వచ్చిన దారిని రక్త కాంతులతో దేదీప్యమానం చేస్తుంది. తెరచాప వలె భవిష్యత్తులోకి లాక్కెళుతుంది.

ఆదివాసీ, పీడిత ప్రజల గుండె ధైర్యం కామ్రేడ్.హరిభూషణ్ -అలెండి

ఆదివాసీ, పీడిత, తాడిత ప్రజానీకానికి జూన్ 21, 2021 తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన రోజు. ఆదివాసీ, పీడిత ప్రజల ప్రియమైన నాయకుడు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హరిభూషణ్