స్టాన్ స్వామి మృతికి నిరసనగా జైల్లో నిరాహార దీక్ష
భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో నిందితులుగా తలోజా జైల్లో ఉన్న పది మంది హక్కుల కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు. తమతో పాటు సహ నిందితుడిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్యంతో మృతి చెందడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ వీరు ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఎల్గర్ పరిషత్ కేసుపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తలోజా జైలు మాజీ సూపరింటెండెంట్పై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న వారిలో బీమా కోరేగావ్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధవాలే, మహేష్ రౌత్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, గౌతమ్ నవలఖా, ఆనంద్ టెల్టుంబే, రమేష్ గైచోర్ మరియు సాగర్ గోర్ఖే ఉన్నారు.
మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పాధర్ స్టాన్ స్వామి (84) ని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద 2020 అక్టోబర్లో రాంచీ నుండి ఎన్ఐఏ అరెస్టు చేసి, నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలుకు తరలించింది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా కోర్టుకు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ కోసం పోరాటం మధ్యలో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ స్టాన్ స్వామి సోమవారం మరణించారు.
2017 డిసెంబర్ 31 న పూణేలో జరిగిన ఒక సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై పూనే పోలీసులు ఎల్గార్ పరిషత్ కేసు నమోదు చేశారు. సమావేశంలో పాల్గొన్నవారి ప్రసంగాల కారణంగా మరుసటి రోజు పశ్చిమ మహారాష్ట్ర నగర శివార్లలో ఉన్న కొరెగావ్-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో హింస చెలరేగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్వహించిన వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, వీరితో కలిసి మావోయిస్టు పార్టీ ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిందని ఆరోపిస్తూ కేసులో పలువురు సామాజిక, హక్కుల కార్యకర్తల పేర్లను చేర్చారు. ఈ కేసును తమ పరిధిలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మొత్తం 16మంది హక్కల కార్యకర్తలను అరెస్టు చేసింది. వారిలో పలువురు వయసు పైబడిన వారు కావడంతో పలు అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాయి. అయినా వారికి బెయిల్ ఇవ్వకుండా ఎన్ఐఏ అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో స్టాన్ స్వామి మృతికి కారణమైన ఎన్ ఐఏ, జైలు అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఎల్గర్ పరిషత్ కేసులో నింధితులుగా ఉన్న పదిమంది నిరాహార దీక్షను ప్రారంభించారు.
స్టాన్ స్వామి మరణాన్ని సంస్థాగత హత్య గా పేర్కొన్న వారు నిర్లక్ష్య జైళ్లు, ఉదాసీనత గల కోర్టులు, హానికరమైన దర్యాప్తు సంస్థలు ఈ హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. "స్టాన్ స్వామిని వారి నుండి వేరుచేయడం ఉద్దేశపూర్వక సంస్థాగత హత్య" అని పేర్కొన్నారు. ఎన్ఐఏ, తలోజా జైలు మాజీ సూపరింటెండెంట్ కౌస్తుబ్ కుర్లేకర్ స్టాన్ స్వామిని "వేధించే" ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోలేదని వారు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు.
జైలు లోపల "భయంకరమైన చికిత్స, అనారోగ్యంతో ఉన్న స్వామిని ఆసుపత్రి నుండి జైలుకు తరలించడం, కనీసం తాగడానికి సిప్పర్ కూడా అందించకుండా వేధించడం స్టాన్ స్వామి మరణానికి కారణమయ్యాయి, అందువల్ల ఈ సంస్థాగత హత్యకు కారకులైన ఎన్ఐఏ అధికారులు మరియు జైలు సూపరింటెండెంట్ ను భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద విచారించాలి" అని వారు డిమాండ్ చేస్తున్నారు. తలోజా జైలు పరిపాలన ద్వారా ఈ డిమాండ్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు సమర్పించనున్నట్లు నిందితుల కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నిందితులను జైల్లో వేర్వేరు బ్యారక్ లలో ఉంచినప్పటికీ, వారు మంగళవారం కలుసుకున్నారు. ఫాదర్ స్టాన్ స్వామి జ్ఞాపకాలను పంచుకున్నారు. అతనికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కేసులో సహ నింధితులైన సుధా భరద్వాజ్, షోమా సేన్, జ్యోతి జగ్తాప్ ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు.
Keywords : elgar parishad, bhima koregaon, maoists, bk 16, stanswamy,
(2024-04-24 23:36:32)
No. of visitors : 766
Suggested Posts
| Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to |
| భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టుదళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు. |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...భీమా కోరేగావ్ / ఎల్గర్ పరిషథ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్ ఐ ఏ. కళా కారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే రమేష్ గైచోర్ల ను నిన్న(సెప్టంబర్7, 2020) అరెస్టు చేయగా కళాకారిని, రచయిత, దళిత కార్యకర్త జ్యోతీ జగతాప్ ను ఈ రోజు (సెప్టంబర్ 8, 2020)అరెస్టు చేశారు. దీంతో భీమా కోరేగావ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవాళ్ళ సంఖ్య 15కు చేరుకుంది. |
| ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ పికె విజయన్, రాకేశ్ రంజన్లకు ఎన్ఐఏ సమన్లు పంపడాన్ని ఖండించండి!హిందూ కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు డాక్టర్ పి.కె. విజయన్, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాకేశ్ రంజన్లు ఇద్దరూ విశ్వవిద్యాలయ సముదాయానికి దశాబ్దాల జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తలు. వారు ప్రజాస్వామిక హక్కులు, ఉన్నత విద్య అందుబాటు మరియు కుల, వర్గ, సముదాయ ప్రాతిపదికన వివక్ష వంటి సమస్యలపై పని చేశారు. |
| ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹభీమా కోరే గావ్ కేసులో నిన్న అరెస్టు కాబడిన కబీర్ కళా మంచ్ కళాకారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే , షాహిర్ రమేష్ గైచోర్ లను ఎన్ ఐ ఏ కొంత కాలంగా విచారణ పేరుతో వేధిస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర కేసులో సాక్షులుగా మారాలని |
| కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టుఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. |
| ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా అన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా |
|
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clcవరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్, ప్రొఫెసర్ ఆనంద్ టెల్టుంట్లే, గౌతమ్ నవలాఖా లాంటి మేధావులను,సుధా భరద్వాజ్ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలో నిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమకారు |
| అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది. |
| Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASRThe Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case. |