వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్

వాళ్ళు

07-07-2021

భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన.
మన మిత్రులు మనల్ని నిర్దేశిస్తున్నారు. వాళ్ళు "ఈ నేలకు ఒక శాపం పెట్టారు."
కస్టడీలో ఒక 84 ఏళ్ళ ముసలి క్రైస్తవ జెస్యుట్ ఫాదర్ ని క్రమంగా ʹచావుʹలోకి నెట్టి, చంపేయడం అత్యంత సిగ్గుపడాల్సిన మురికి చర్య. ఆయన తన జీవితంలో అనేక దశాబ్దాల పాటు ఈ దేశంలోని ʹతమ కంటూ ఏమీలేని, తమని ఎవ్వరూ చేరదీయనిʹ ప్రజానీకం పనిచేసిన ఈ వ్యక్తి హత్య మన సమాజంలోని కిటికీ దగ్గరే జరిగింది. మన న్యాయ వ్యవస్థ, పోలీసులు, నిఘా విభాగపు సంస్థలు, ఇక్కడి జైలు వ్యవస్థలే ఈ హత్యకు బాధ్యులు. ఈ దేశప్రజాలకి, మన ప్రధాన స్రవంతి మీడియాకి కూడా ఈ కేసు గురించి క్షుణ్ణంగా తెలుసు. దిగజారి పోతున్న అతని ఆరోగ్య పరిస్థితి గురించీ తెలుసు. అయినప్పటికీ ఆయన్ని అదేవిధంగా క్రుంగదీశారు.
ఈ పెద్దమనసున్న, నిజాయితీ గల, ఆరోగ్యం ఏమాత్రం బాగోని అద్భుతమైన వ్యక్తి తనతోపాటు ఉన్న బికే కేసుగా పిలవబడుతున్న 16 మంది సహచర నిందితుల్లో ఒకరుగానే చనిపోయారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను పరీక్షించే ఫోరెన్సిక్ విశ్లేషకులు ఒక బూటకపు కథను అల్లగానే అవసరమైన కొన్ని ఫైళ్లను, ఈ కేసులోనే మరో నిందితుడిగా ఉన్న రోనా విల్సన్ కంప్యూటర్ లోకి చొప్పించారనడానికి పెద్ద సాక్ష్యం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వచ్చిన ఒక కథనం తెలియజేసింది. అయితే ఈ రిపోర్టు బయట పడకుండా ప్రధాన స్రవంతి మీడియా, కోర్టులు కలిసి పాతిపెట్టేశాయి.
ఫాదర్ చనిపోయిన ఒకరోజు తర్వాత అంటే మంగళవారం నాడు ఇదే కేసులో మరొక సహా నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ తన కంప్యూటర్ లో కూడా మాల్ వేర్ ప్రవేశపెట్టినట్లు సాక్ష్యం ఉందని తెలియజేశారు. కానీ - మనకి ఇక్కడ ఉపా అనే ఒక చట్టం ఉంది. అది నిందారోపణ మోపబడిన వ్యక్తుల్ని పెద్ద లాయర్లనీ, మేధావులనీ, కార్యకర్తలనీ ఎంతకాలమైనా నిర్బంధంలో ఉంచే వీలు ప్రభుత్వానికి కల్పిస్తోంది. ఎంతకాలమంటే - వాళ్ళు జబ్బుపడి చనిపోయేదాకా కానీ, లేక ఏళ్లతరబడి సాగే జైలు జీవితం వారి జీవితాలను పూర్తిగా ధ్వంసం చేసేదాకా కానీ నిర్బంధం లో ఉంచవచ్చు. అందరూ అంటున్నట్టు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేయడం లేదు. దాన్ని సరిగ్గా ఇందుకోసమే తయారు చేశారు.
క్రమక్రమంగా జరిగిన ఫాదర్ స్టాన్ స్వామి హత్య ఒక అత్యంత సిగ్గుపడాల్సిన, ప్రజాస్వామ్య విస్తృత భాగంలో ప్రభావం చూపగలిగే సంఘటన. .మనకి మనం ఇంకా ప్రజాస్వామ్యంగా పిలుచుకునే దాన్ని మరింత క్రమక్రమంగా కాకుండా చేసిన హత్య.
ʹమనం మన మిత్రుల చేత పాలించబడతాం. అయితే వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారుʹ.

- అరుంధతీ రాయ్
(తెలుగు అనువాదం అశోకన్ వీవీ అయ్యర్)

Keywords : stanswamy, arundhathi roy, NIA, Bhimakoregaon, BK16
(2024-04-24 23:36:26)



No. of visitors : 1085

Suggested Posts


ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు .

Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party

rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.

ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవిత

భయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు

ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌

దేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు.

స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టు

భీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది.

ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం

ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.

bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు ‍- చంపబడ్డాడు

ఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి

స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి ‍-ఐక్యరాజ్యసమితి

ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెంద‌డం ప‌ట్ల‌ ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ‌హక్కుల హైక‌మిష‌న‌ర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

అతని మరణం ఒక‌ స‌త్య ప్ర‌క‌ట‌న -విరసం

అతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు.

మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లం

బాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం?

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వాళ్ళు