సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడ‌దాం

సూదికొండను

11-07-2021

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యన్నీకాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూదికొండ (నెమలికొండ) ను నాశనం చేస్తున్నారు పాలకులు. కొందరు పెద్దల లాభాల కోసం పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు పాలకులు. ఈ నేపథ్యంలో సూది కొండను కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజా సంఘాలు పోరాటం ప్రారంభించాయి. ʹసూది కొండ పరిరక్షణ పోరాట కమిటీʹ ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయి ఆ క్రమంలో పలాస ప్రజలు, కమిటీ నాయకులు శ్రీకాకుళం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా సూది కొండ పరిరక్షణ పోరాట కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పలాస కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యాన్నికాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూది కొండ .నెమలికొండ.!!

ఈరోజు సూదికొండ కొంతమంది పెద్దల సంపద కై తవ్వకాలతో కనుమరుగు అవుతుంది. ప్రజల అనుమతి లేకుండానే అక్రమంగా సంపాదించుకున్న అనుమతులతో కొందరి కారణంగా సూది కొండ రోజురోజుకి కరిగిపోతున్నది. ఈరోజు సూదికొండ నెమలి కొండ ప్రాంతంలో సుమారు వెయ్యి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాలన్నీ కడు పేదరికంలో ఉన్న కుటుంబాలు. ఈ కొండ తవ్వకాలతో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

నీరు మనిషి జీవనాధారం. ఆ జీవనాధార మే కనుమరుగైతే ఇక ఆ ప్రాంతం విడిచి పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ తవ్వకాలను ఆపాలనే ఆందోళన చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జీవావరణం పై జరుగుతున్న ఈ దోపిడీని ప్రశ్నిద్దాం..!! అద్భుతమైన జీవ వైవిధ్యం పచ్చని ప్రకృతి. జీవ సంపద ఉన్న ఈ కొండను పరిరక్షించుకుందాం. జీవించే హక్కు కే పోరాడదాం.

ఇది కేవలం సూది కొండ కొండ దగ్గర ఉన్న ప్రజల సమస్య కాదు పలాస, కాశిబుగ్గ జంటనగరాల ప్రజల సమస్య కూడా. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపుట కంటే 3,4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగాయి . ఈ కొండను కూడా గ్రావెల్ పేరుతో అమ్మేస్తే మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంతేకాదు ఈ కొండ కనుమరుగైతే వర్షపాతం కూడా ఈ ప్రాంతంలో తగ్గిపోతుంది. అందుకే జంటనగరాల ప్రజలరా, పర్యావరణ ప్రేమికులారా... బుద్ధి జీవులారా పర్యావరణాన్ని కాపాడుకుందాం..!!
సూది కొండ ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుదాం..!!
ఇట్లు
సూది కొండ పరిరక్షణ పోరాట కమిటీ.

ఈరోజు సూది కొండ ప్రజలతో కలిసి శ్రీకాకుళం కలెక్టర్ ను కలిసిన వారిలో పౌరహక్కుల సంఘం (CLC) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పత్తిరి దానేష్, పి డి ఎం జిల్లా అధ్యక్షుడు సాలీన వీరస్వామి, అమరుల బంధుమిత్రుల సంఘం జోగు కోదండం, పీకేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొర్రయి నీలకంఠం. ఉత్తరాంధ్ర మహిళా సంఘం పోతనపల్లి అరుణ, పోతనపల్లి నాగమణి తోపాటు
పి వైకుంటం, డొక్కరె దానయ్య. గంగయ్య. లక్ష్మణ్ త‌దితరులు ఉన్నారు.

Keywords : srikakulam, andhrapradesh, sudikonda, nemalikonda, Environment
(2024-04-24 23:33:54)



No. of visitors : 953

Suggested Posts


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు.

శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.

చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ

యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సూదికొండను