తొలి తరం విప్లవ యోధురాలు కన్నుమూత !

తొలి

తొలి తరం విప్లవ యోధురాలు ద్రోణవల్లి అనసూయమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో, మృత్యువుతో పోరాడుతూ ఆమె గురువారంనాడు మధ్యాహ్నం విజయవాడలో మరణించారు.
జీవితమంతా విప్లవాన్ని శ్వాసించిన అనసూయమ్మ 1930 లో కృష్ణాజిల్లా మేడూరులో జన్మించారు. ఆమెకు అక్క,చెల్లెల్లు అన్నదమ్ములు కలిసి ఆరుగురు. ఆమె చిన్నాన్న యలమంచిలి వెంకట కృష్ణయ్య కాంగ్రెసు కార్యకర్త . అనసూయమ్మను తొమ్మిదోయేట నుంచే ఆయన జాతీయ కాంగ్రెస్ సభలకు తీసుకొని వెళ్ళేవారు. ఈమె మేనత్త భర్త జాతీయోద్యమంలో జైలుపాలయి అక్కడే చనిపోయారు. ఈనేపధ్యంలో ఆమె చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలవైపు ఆకర్షితురాలయినారు. చిన్నతనం నుండి
ఊరి గ్రంధాలయంలో చదివిన రష్యన్ సాహిత్యం కమ్యూనిస్టు రాజకీయాలవైపు మలిచింది.
1946 లో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలయింది. 1945 డిశంబర్ లో చురుకయిన కమ్యూనిస్ట్ కార్యకర్త సత్యప్రసాద్ తోవివాహమయింది. ఇది ఆ ప్రాంతంలో తొలి ఆదర్శవివాహం. అప్పటి నుండి దంపతులిద్దరు, ఉద్యమంలో భాగమైనారు. 1945 ను౦డి1952 వరకు రహస్యోద్యమంలో తన సహచరునితో కలిసి గెరిల్లా దళ సభ్యురాలిగా పని చేసింది. 1950 ఆగష్టు5న ఆమెభర్త సత్యప్రసాదును పోలీసులు కాల్చి చంపారు.1953 లో ఆమె పార్టీ తాలూక కమిటీ సెక్రటేరియట్ సభ్యురాలయింది. ఆ తర్వాత ఆమె నక్సలైటు రాజకీయాల వైపు వచ్చారు. పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో 1984లో ఐలూరు ,గురివింద పల్లె, పెద వేగిలలో జరిగిన భూపోరాటాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. 1984 లోఎపి రైతు కూలీ సంఘం రాష్ఱ్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆమె తాను నమ్మిన విప్లవ రాజకీయాలలో కొనసాగారు. అనసూయమ్మ నిరంతర అధ్యయనశీలి..
చొరవ పట్టుదల సిద్ధాంత నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం. ఆమె ఉద్యమ సహచరులను కన్నబిడ్డల్లా ప్రేమించింది. ఆ ప్రేమను కడదాకా పెంచింది. ఆ కమ్యూనిస్టు యోధురాలికి విప్లవరచయితల సంఘం, ఇతర విప్లవ ప్రజా సంఘాలు నివాళులు అర్పించాయి
.. విప్లవ రచయితల సంఘం

Keywords : Naxalite, Anusuyamma, Revolutian, Krishana
(2024-04-24 23:18:57)



No. of visitors : 1424

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తొలి