Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి

27-10-2021

త్రిపురలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా ఓ మసీదును ధ్వంసం చేశారు. మైనారిటీల‌ షాపులపై, ఇళ్ళపై దాడులు చేసి దోచుకున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన హింసకు నిరసనగా ఉత్తర త్రిపుర జిల్లా ఫనిసాగర్ లో మంగళవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ ఓ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ జరుగుతుండగానే ఓ మసీదుపై దాడి చేసి దాన్ని తగలబెట్టారు. మైనారిటీల‌ ఇళ్ళపై, షాపులపై దాడులు చేశారు. అందినకాడికి దోచుకున్నారు అని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భావనపద చక్రవర్తి తెలిపారు.

దీంతో అప్రమత్తమైన‌ రాష్ట్ర పోలీసులు సున్నితమైన ప్రాంతాల్లోని మసీదులకు రక్షణ కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పంపకుండా హెచ్చరికలు జారీ చేశారు.

"సమీపంలో ఉన్న రోవా బజార్‌లో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారి మూడు ఇళ్ళు, పలు దుకాణాలు కూడా దోచుకున్నారు" అని చక్రవర్తి నివేదించారు, పరిస్థితి అదుపులో ఉందని ఆయన అన్నారు.

ʹʹఈరోజు జరిగిన సంఘటనపై ఉత్తర త్రిపుర జిల్లా పోలీసులు చట్టబద్ధమైన చర్య తీసుకుంటున్నారు. పరిస్థితి అదుపులో ఉంది. కొందరు సోషల్ మీడియాలో పుకార్లు, రెచ్చగొట్టే సందేశాలు పంచుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని, శాంతిని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాముʹʹ అని త్రిపుర పోలీసులు ట్వీట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసి శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను ఖండించిన ప్రతిపక్ష సీపీఐ(ఎం) రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు దుర్మార్గులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.

బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత రాష్ట్రంలోని పలు మసీదులు, మైనారిటీల‌ నివాసాలు దాడికి గురయ్యాయని శుక్రవారం త్రిపుర జమియత్ ఉలేమా-ఎ-హింద్ ఆరోపించింది. అందుకు కారణమైన‌ దుర్మార్గులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

త్రిపురలోని గోమతి జిల్లా ఉదయ్‌పూర్ సబ్ డివిజన్ పరిధిలోని మహారాణి ప్రాంతంలో గత గురువారం పోలీసులకు, మితవాద రైట్ వింగ్ గ్రూపులకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు పోలీసు అధికారులతో సహా 12 మందికి పైగా గాయపడ్డారని ది వైర్ నివేదించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించేందుకు రైట్‌వింగ్ గ్రూపులకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు పాల్పడిన వ్యక్తులను అధికారులు గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత గురువారం నాడు సుమారు 13 సంస్థలు అగర్తలాలో ఓ నిరసన ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయానికి మెమోరాండం సమర్పించాయి.

Keywords : tripura, VHP, Muslims, attacks, Mosque Vandalised, Shops, Houses, Mosque Vandalised, Shops and Houses Attacked During VHP Rally
(2024-04-24 23:10:59)



No. of visitors : 758

Suggested Posts


గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు

అక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు....

హంతకుల‌ రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న‌ సీపీఎం

స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి..

మత హింస గురించి రాసినందుకు ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు - బెయిల్ మంజూరు చేసిన కోర్టు

త్రిపురలో ఈ మధ్య‌ జరిగిన ముస్లింలపై దాడులకు సంబంధించిన ఘటనలను రిపోర్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఆదివారం నాడు అరెస్టుచేశారు. సమృద్ధి సకునియా, స్వరణ్ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులను అస్సాం లోని కరీంగంజ్ జిల్లాలో అదుపులోకి తీసుకుని ఆపై త్రిపుర పోలీసులకు అప్పగించారు అస్సాం పోలీసులు.

త్రిపురలో ముస్లింలపై హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లపై UAPA -ప్రజాసంఘాల ప్రకటన‌

నవంబర్ 3న, త్రిపుర పోలీసులు ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులకు ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ నోటీసులు పంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


Tripura: