include 'men';
?>
పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
27-10-2021
దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తామే కమిటీ వేస్తామన్న కేంద్రం అభ్యర్తనను సుప్రీం తిరస్కరించింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా సుప్రీం కేంద్రం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రతి దానికి జాతీయ భద్రతకు ముడిపెట్టడంపై అసంత్రుప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమక్త వుతుందని తెలిపింది. పెగాసస్వ్యవహారంలో గోప్యత హక్కుఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుం దని తెలిపింది. కమిటీ పనితీరును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.
"2019 నుండి పెగాసస్ దాడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఈ కోర్టు కేంద్రానికి తగినంత సమయం ఇచ్చింది. అయితే కేంద్రం పరిమితమైన అఫిడవిట్ మాత్రమే దాఖలుచేసింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తే మాపై భారం తగ్గేది" అని పేర్కొన్నారు ప్రధాన న్యాయమూర్తి.
"నేటి ప్రపంచంలో, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి, జాతీయ భద్రతను పరిరక్షించడానికి అవసరమైనప్పుడు మాత్రమే గోప్యతపై ఆంక్షలు విధించబడతాయి. కానీ జాతీయ భద్రతా సమస్యలను లేవనెత్తడం ద్వారా రాజ్యం ప్రతిసారీ ఫ్రీ పాస్ను పొందజాలదు." అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా పెగాసస్ స్పై వేర్ ద్వారా దేశంలోని ప్రతిపక్ష నాయకుల, మేదావుల, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారం నుండి తప్పించుకోవడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి వ్యవస్థలు సహకరిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Keywords : pegasus, supreme court, NV Ramana, Supreme Court Forms Pegasus Probe Panel
(2024-04-24 23:10:28)
No. of visitors : 440
Suggested Posts
| తొలగించబడిన చట్టం కింద 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్2015 నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66(ఏ)ను ఇప్పటికే తొలగించగా, 22 మందిని ఈ చట్టం కింద ప్రాసిక్యూట్ చేశారని పీయూసీఎల్ |
| ʹఉగ్రవాద సంస్థలో సభ్యుడుగా ఉండటం, మద్దతు యిచ్చినంత మాత్రాన UAPA నేరం కిందికి రాదుʹ: సుప్రీం కోర్టు ఆదేశంఒక తీవ్రవాద సంస్థలో సభ్యుడిగా వుండడమూ లేదా ఇతరత్రా మద్దతు ఇచ్చినంత మాత్రాన UAPA కింద నేరంగా పరిగణించడానికి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ విధంగా స్పష్టం చేసింది |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..