include 'men';
?>
ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
07-12-2021
విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు వలసి @ రమే, వనతల లక్ష్మి @ సంగీత , కొర్ర దేవి @ సీతలను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులుప్రకటించారు.
అయితే ఈ ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధంలో ఉంచారని ఆరోపిస్తూ, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల క్రితమే సీపీఐ (మావోయిస్ట్) లేఖ విడుదల చేయడం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం, అరెస్టయిన ముగ్గురిలో వలసి తలపై 4 లక్షల నగదు బహుమతి, మిగిలిన ఇద్దరిపై లక్ష రూపాయల నగదు బహుమతి ఉంది.
వలసి (30) 2007లో మావోయిస్టు పార్టీలో చేరి, 2017లో ఏరియా కమిటీ సభ్యురాలిగా మారారని, 2016 నుంచి 2020 మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐదు ఎన్కౌంటర్లలో ఆమె పాల్గొందని పోలీసులు తెలిపారు. ఈమె అరెస్టు సందర్భంగా 3 కిలోల పేలుడు పదార్థాలను, ఆహార క్యారేజ్, డిటోనేటర్లు, ఒక నాటు తుపాకీ కొంత మందుగుండు సామగ్రి సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
వనతల లక్ష్మి(23) పార్టీ సభ్యురాలు మరియు చింతపల్లె (2020), కొయ్యూరు (2021)లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో పాల్గొందని పోలీసులు చెప్పారు.
గాలికొండ దళానికి చెందిన కొర్ర దేవి (20) గనుల బ్లాస్టింగ్లో నైపుణ్యం సంపాదించిందని, ఆమె వద్ద నుంచి 2 కిలోల పేలుడు పదార్థాలు, నాలుగు డిటోనేటర్లతో కూడిన స్టీల్ క్యారేజీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.
Keywords : visakhapatnam, maoists, police, arrest, women
(2024-04-27 21:59:43)
No. of visitors : 2453
Suggested Posts
| మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారుమనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం..... |
| అనారోగ్యంతో నడవలేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ ! నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ |
| చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు.... |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదను సామ్రాజ్యవాద, కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల చట్టాలను తీసుక వచ్చి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నది. |
| ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూమనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు. |
| విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..