ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన జమ్ముకశ్మీర్ విద్యుత్ ఉద్యోగులు- ఆర్మీని దించిన ప్రభుత్వం

ప్రయివేటీకరణకు

20-12-2021

(ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి నుండి నుంచి ఈ సమ్మె ప్రారంభమయ్యింది. సమ్మె అణిచివేయడానికి ప్రభుత్వం ఆర్మీని దించింది. ఈ అంశంపై ʹఇఫ్టు ప్రసాద్ʹ తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ఆర్టికల్ )

*చరిత్రాత్మకమైన ప్రయివేటీకరణ వ్యతిరేక సమ్మె చేస్తోన్న J&K విద్యుత్ ఉద్యోగులకి చెయ్యెత్తి జైకొడదాం*
*సమ్మె అణచివేత కై ఆర్మీని దింపే ఫాసిస్టు చర్యని ఖండిద్దాం*
*కార్పొరేట్ శక్తులపై కార్మికవర్గ పోరులోని హిందు ముస్లిం ఐక్యత ని వేనోళ్ల చాటుదాం*
*సమ్మెలో లైన్ మెన్ నుండి ఇంజనీర్ల వరకూ అపూర్వ ఐక్యతని ఆదర్శంగా భావిద్దాం*
*ఆర్మీ దాడి నుండి కార్మికవర్గ పోరాటాల్ని కాపాడుకుందాం*,

ప్రియమైన మిత్రులారా!

మోడీ-షా ప్రభుత్వం భారత రైతాంగ పోరాట అణిచివేతకు బరితెగించి భంగపడింది. నాగాలాండ్ ప్రజల్ని టెర్రర్ చేయబోయి చతికిల పడింది. విదేశీ యుద్దాలకై శిక్షణ ఇచ్చి నిర్మించిన ఇండియన్ ఆర్మీని ఇండియన్ పౌరులపై యుద్దానికి వాడుకుంటోంది. ఇప్పుడు జమ్మూ& కాశ్మీర్ లో ఆర్మీ మరో క్రూర ఫాసిస్టు చర్యకు బరితెగిస్తోంది.

5-8-2019న మోడీ ప్రభుత్వం జమ్మూ& కాశ్మీర్ కి 370 & 35A రద్దు చర్య అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు కాశ్మీర్ అప్పగింత కోసమే అని భావించాం. నేడు అదే నిజమవుతోంది.

ఆపిల్, డ్రై ఫ్రూట్స్, కుంకుమ తోటలతో పాటు భూతల స్వర్గంగా పిలిచే ప్రకృతి సర్వ సంపదల్ని కార్పొరేతలకి అప్పగింతకే అనేది నేటి నిజం! ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభాలు గడించేంత విద్యుత్తు కాశ్మీర్ కొండల్లో ప్రవహించే జలపాతాల్లో ఉత్పత్తి అవుతుంది. అట్టి విద్యుత్ వనరుల పై బడా కార్పొరేట్ సంస్థల కళ్ళు పడ్డాయి. ఫలితమే జమ్మూకాశ్మీర్ విద్యుత్ రంగ ప్రయివేటీకరణ!

జమ్మూ లో విద్యుత్ ఉద్యోగులు ఇరవై వేల మంది 17-12-2021 అర్ధరాత్రి నుండి సమ్మె ప్రారంభించారు. సమ్మెలో సాధారణ లైన్ మెన్ నుండి సీనియర్ ఇంజినీర్ల వరకూ పాల్గొంటున్నారు. తాత్కాలిక కార్మికులు, ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయడం వంటి కోర్కెలు ఉన్నా, ప్రధాన డిమాండ్ ప్రయివేటీకరణ రద్దే!విద్యుత్ ఉద్యోగులు ప్రయివేటీకరణ డిమాండ్ ని వదులుకుంటే, ఇతర డిమాండ్లను పరిష్కరించే సంకేతాన్ని వదిలారు. ఉద్యోగులు ససేమిరా అనడం విశేషం! తమ ప్రధాన శిఖర డిమాండ్ ప్రయివేటీకరణ అని నిన్న ఆదివారం సాయంత్రం జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు కుండబద్దలు కొట్టినట్లు తేల్చిచెప్పాయి. వెంటనే జమ్ము డివిజనల్ కమిషనర్ విద్యుత్ పునరుద్ధరణ బాధ్యతను ఆర్మీ కి అప్పగిస్తూ లేఖలో అభ్యర్ధించడం జరిగింది. ఆ లేఖను అందుకున్న ఆర్మీ నిన్న రాత్రికి రాత్రే జమ్ము ప్రాంతంలోని వివిధ విద్యుత్ కేంద్రాలకు చేరుకున్నది. విద్యుత్ కేంద్రాలు సైనిక శిబిరాలు గా మారుతున్నాయి.

విశాఖ ఉక్కు కార్మిక పోరాటంతో సహా ఇటీవల ప్రయివేటీకరణ వ్యతిరేక సమరశీల సమ్మెల జోరు పెరుగుతూ వస్తోంది. ఆ తరహా సమ్మెలో కూడా ఇదో శిఖరసమ్మె! దీనికి ALL JAMMU & KASHMIR POWER EMPLOYEES AND ENGENEERS COORDINATION COMMITTEE నాయకత్వం వహిస్తోంది. దాని నాయకుడు ʹసచిన్ టిక్కూʹ నిన్న రాత్రి పత్రికలతో మాట్లాడుతూ క్రింది విధంగా అన్నారు.
ʹʹWE ARE OPPOSING THE SYSTEMATIC TRANSFER OF ASSETS. THEY ARE SELLING THE ASSETS OF THE TRANSMISSION SECTOR. THEY WANT TO GIVE 50% SHAREHOLDINGS TO THE POWER GRID WHICH IS AGAINST THE INTERESTS OF PEOPLE OF JAMMU AND KASHMIRʹʹ
(ఆస్తుల వ్యవస్థీకృత అప్పగింతను మేము వ్యతిరేకిస్తున్నాము. విద్యుత్ రంగ ఆస్తుల్ని వాళ్ళు అమ్మేస్తున్నారు. జమ్మూ& కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా 50 శాతం వాటాల్ని వాళ్ళు ఇవ్వ జూస్తున్నారు)

దేశవిభజన కాలంలో లార్డ్ మౌంట్ బాటన్ అవార్డ్ ప్రకారం స్వమతసులతో కూడిన పాకిస్థాన్ లో లీగల్ గానే చేరే అవకాశం కాశ్మీర్ ముస్లిం సమాజానికి ఉంది. ఐనా వారు లౌకిక ప్రాతిపదికన ఇండియాకి దగ్గరయ్యారు. అలా ఇష్టపడి దగ్గరైన కశ్మీర్ జాతిపై పాకిస్థాన్ అనుకూల ముద్రలు వేసి భారతదేశ ప్రజల్లో, ముఖ్యంగా హిందువుల్లో కాశ్మీర్ జాతిని నేరస్థ జాతిగా చిత్రించడం తెల్సిందే! 2019 ఆగస్టు 5న 370& 35A రద్దు సందర్భంగా కూడా అట్టి నిందా ప్రచారాన్నే మోడీ ప్రభుత్వం చేసింది. మరీ ముఖ్యంగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు దేశంలో హిందు ముస్లిం విభజన తెచ్చే విద్వేష ప్రచారం సాగించాయి. ఐతే అదే ఫాసిస్టు రాజకీయ శక్తులకి జమ్మూకాశ్మీర్ విద్యుత్ ఉద్యోగ కార్మిక వర్గాలు చెంపపెట్టు వంటి షాక్ ఇస్తున్నారు. అదే వారి మధ్య ఈ సమ్మెలో ఏర్పడ్డ మత సమైక్యత!

కాశ్మీర్ లోయలో ముస్లిం జనాభా ఎక్కువ! జమ్ము లో హిందూ జనాభా ఎక్కువ! విచిత్ర విషయం ఏమంటే, జమ్ము డివిజన్ లోనే ఇరవై వేలమంది ఉద్యోగ, కార్మిక వర్గాల తాజా సమరశీల సమ్మె జరుగుతూ ఉండడం! అందులో హిందు ముస్లిం సమైక్యత ఓ పునాదిగా వుండటం విశేషం!

ఆ ఇరవై వేల మంది చేసే సమ్మె అణచివేత కై నేడు ఫాసిస్టు పాలకులు ఆర్మీ ని దించుతున్నారు. వారు ఇప్పుడు విశాల భారతదేశ ప్రజలకు క్రింది సందేశం పంపిస్తున్నారు.

ʹʹకాశ్మీరులో హిందు ముస్లిం బేధం లేకుండా కలిసి అంబానీ, ఆదానీ వంటి కార్పోరేట్ల పై మేం సమ్మె చేస్తున్నాం. మీరు నివసించే విశాల భారత్ లో బ్యాంకింగ్, టెలికం, భీమా, బొగ్గు, ఉక్కు, చమురు, రైల్వే, నౌకా, విమాన రంగాల్ని మింగే కార్పొరేట్లపై మీరూ సమ్మెలు చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని భక్షించుటకు దిగితే హిందు, శిఖు, ముస్లిం, క్రిస్టియన్ తేడాలు లేకుండా విశాల భారత్ రైతాంగం పోరాడి ఘన విజయం సాధించింది. ఆ స్పూర్తితో మేమిక్కడ జమ్మూలో విద్యుత్ రంగ ఆస్తుల పరిరక్షణకై మత సమైక్యతతో పోరాడుతున్నాం. ఓ సువిశాల భారతదేశ బాధిత ప్రజలారా, మీ పొరాటమూ, మా జమ్ము కశ్మీర్ ఉద్యోగుల పోరాటమూ ఒకటే! మాపై సైన్యాన్ని దింపి మా సమ్మె అణిచివేతకి దిగుతోన్న ప్రభుత్వ ఫాసిస్టు విధానాన్ని వ్యతిరేకించి మా పక్షాన నిలబడి అండదండల్ని ఇవ్వండిʹʹ

సువిశాల భారతదేశ ప్రజల్ని తమకు మద్దతు ఇమ్మని నేడు కాశ్మీర్ జాతి మతాతీతంగా కోరుతోంది. పంజాబ్, హర్యానా రైతాంగం ప్రారంభించి, యావత్తు భారతదేశ రైతాంగ పోరాటంగా మారి విజయం సాధించింది. నాగాలాండ్ పై ఫాసిస్టు దాడికి దిగిన ఫలితంగా నేడు AFSPA రద్దుకై విశాల పోరాటంగా మారుతోంది. తాజా జమ్మూ& కాశ్మీర్ విద్యుత్ ఉద్యోగ, కార్మిక వర్గాల సమరశీల సమ్మె పోరాటం కూడా యవద్భారత పీడిత, బాధిత ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి ఇస్తోంది. ముఖ్యంగా భారతదేశ కార్మికవర్గానికి కర్తవ్య బోధ చేస్తోంది. ఇంతటి రాజకీయ ప్రాధాన్యత గల జమ్మూ& కాశ్మీర్ విద్యుత్ సమ్మె పోరాట శక్తులకు పిడికిళ్ళుఎత్తి జైకొడదాం. అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ల కోసం సమ్మెకారులపైకి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు రాజనీతితో ఆర్మీ ని పురికొలిపే దాడిని ఎలుగెత్తి ఖండిద్దాం.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
20-12-2021

Keywords : jammu kashmir,
(2024-04-27 09:55:53)



No. of visitors : 596

Suggested Posts


kashmir: UAPA కింద 15 ఏండ్ల బాలుడు అరెస్ట్

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లా బుమ్హామా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో కలిపి 15 ఏండ్ల బాలుడు జహాబ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద‌ కేసు నమోదు చేశారుపోలీసులు. ఈ నలుగురిని మే 29 న పోలీసులు అరెస్టు చేశారు

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

హక్కుల కార్యకర్తను మావోయిస్టుగా మార్చే ప్రయత్నం చేసిన పోలీసులు

ʹసివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకుంటే మరొకరు, నా నడుముకి రివాల్వర్‌ ఎక్కుపెట్టి బొలెరోలోకి లాగినప్పుడు, నేను చాలా భయపడ్డాను. వీళ్ళు నన్ను థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురి చేయడమో లేదా, ఎన్‌కౌంటరే చేసేస్తారేమోననిపించింది.ʹ

ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI

The Network of Women in Media, India, expresses its outrage at the harassment and violence meted out to the elderly parents of award-winning Kashmiri photojournalist and NWMI member Masrat Zahra. Such harassment of vulnerable family members is an abhorrent strategy of intimidation that must be strongly condemned.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం

లాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

kashmir:పడవ ప్రమాదం పై వాట్సప్ లో స్టేటస్ పెట్టినందుకు జర్నలిస్టు అరెస్టు

గతంలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఓ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు.

kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI

అవార్డు గ్రహీత, కశ్మీరీ ఫోటో జర్నలిస్ట్, NWMI సభ్యురాలు మస్రత్ జహ్రా వృద్ధ తల్లిదండ్రులను వేధింపులు, హింసకు గురిచేయడం పట్ల నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI), ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రయివేటీకరణకు